తమన్ ఇప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ మాటకొస్తే ఇండియాలోనే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ స్థానానికి అతను గట్టి పోటీదారు అనడంలో సందేహం లేదు. ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో తమన్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. ఐతే ఎంత పాపులారిటీ, గౌరవం సంపాదించుకున్నప్పటికీ.. తమన్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాకు టార్గెట్ అవుతూనే ఉంటాడు. తాజాగా గాడ్ ఫాదర్ టీజర్తో అతను మరోసారి నెటిజన్లకు లక్ష్యంగా మారేలా కనిపిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా టీజర్ ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందే లాంచ్ అయింది. రిచ్ విజువల్స్, ఎలివేషన్లతో ఈ టీజర్ జనాలను బాగానే ఆకట్టుకుంటోంది. తమన్ నేపథ్య సంగీతం కూడా ఎనర్జిటిగ్గా, అభిమానుల ఉత్సాహాన్ని పెంచేలాగే ఉంది. కాకపోతే ఆ స్కోర్లో కొత్తదనం మాత్రం లేదు. కొన్ని నెలల కిందటే విడుదలైన వరుణ్ తేజ్ సినిమా గని టైటిల్ సాంగ్, థీమ్ మ్యూజిక్లో వినిపించిన సౌండింగే ఇందులోనూ తమన్ రిపీట్ చేసినట్లు ఉన్నాడు.
టీజర్ ఆద్యంతం రిపీటవుతూ వచ్చిన మ్యూజిక్ను పదే పదే గనిని గుర్తుకు చేస్తుండడంతో కొన్ని నిమిషాల్లోనే నెటిజన్లు అలెర్ట్ అయిపోయారు. ఇలా చేశావేంటి తమన్ అంటూ గని టైటిల్ సాంగ్ మ్యూజిక్ బిట్స్ను ప్లే చేసి చూపిస్తున్నారు. తమన్తో వచ్చిన తలనొప్పి ఇదే.. తన ట్యూన్లను తనే కాపీ కొడుతుంటాడు, అవే రిపీట్ చేస్తుంటాడు అని అతడిని విమర్శిస్తున్నారు. ఇలా తమన్ గతంలో చాలాసార్లు నెటిజన్లకు దొరికిపోయి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ మధ్య ఈ రకమైన విమర్శలు కొంచెం తగ్గాయి కానీ.. అప్పుడప్పుడూ మాత్రం ఇలా దొరికిపోతున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే గాడ్ ఫాదర్ టీజర్ అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఉండి ఆకట్టుకుంటోంది.
This post was last modified on August 22, 2022 4:00 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…