తమన్ ఇప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ మాటకొస్తే ఇండియాలోనే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ స్థానానికి అతను గట్టి పోటీదారు అనడంలో సందేహం లేదు. ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకోవడంతో తమన్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. ఐతే ఎంత పాపులారిటీ, గౌరవం సంపాదించుకున్నప్పటికీ.. తమన్ అప్పుడప్పుడూ సోషల్ మీడియాకు టార్గెట్ అవుతూనే ఉంటాడు. తాజాగా గాడ్ ఫాదర్ టీజర్తో అతను మరోసారి నెటిజన్లకు లక్ష్యంగా మారేలా కనిపిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా టీజర్ ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక రోజు ముందే లాంచ్ అయింది. రిచ్ విజువల్స్, ఎలివేషన్లతో ఈ టీజర్ జనాలను బాగానే ఆకట్టుకుంటోంది. తమన్ నేపథ్య సంగీతం కూడా ఎనర్జిటిగ్గా, అభిమానుల ఉత్సాహాన్ని పెంచేలాగే ఉంది. కాకపోతే ఆ స్కోర్లో కొత్తదనం మాత్రం లేదు. కొన్ని నెలల కిందటే విడుదలైన వరుణ్ తేజ్ సినిమా గని టైటిల్ సాంగ్, థీమ్ మ్యూజిక్లో వినిపించిన సౌండింగే ఇందులోనూ తమన్ రిపీట్ చేసినట్లు ఉన్నాడు.
టీజర్ ఆద్యంతం రిపీటవుతూ వచ్చిన మ్యూజిక్ను పదే పదే గనిని గుర్తుకు చేస్తుండడంతో కొన్ని నిమిషాల్లోనే నెటిజన్లు అలెర్ట్ అయిపోయారు. ఇలా చేశావేంటి తమన్ అంటూ గని టైటిల్ సాంగ్ మ్యూజిక్ బిట్స్ను ప్లే చేసి చూపిస్తున్నారు. తమన్తో వచ్చిన తలనొప్పి ఇదే.. తన ట్యూన్లను తనే కాపీ కొడుతుంటాడు, అవే రిపీట్ చేస్తుంటాడు అని అతడిని విమర్శిస్తున్నారు. ఇలా తమన్ గతంలో చాలాసార్లు నెటిజన్లకు దొరికిపోయి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఈ మధ్య ఈ రకమైన విమర్శలు కొంచెం తగ్గాయి కానీ.. అప్పుడప్పుడూ మాత్రం ఇలా దొరికిపోతున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే గాడ్ ఫాదర్ టీజర్ అభిమానుల అంచనాలకు తగ్గట్లే ఉండి ఆకట్టుకుంటోంది.
This post was last modified on August 22, 2022 4:00 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…