ఇవాళ ఉదయం నుంచి అభిమానులు కౌంట్ డౌన్ పెట్టుకుని మరీ ఎదురు చూసిన గాడ్ ఫాదర్ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు రెండు దశాబ్దాల తర్వాత తెలుగులో మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం, నయనతార సత్యదేవ్ లాంటి క్యాస్టింగ్, భారీ నిర్మాణ విలువలు మొత్తానికి ఆచార్య తాలూకు చేదు జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేస్తుందనే భారీ నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. కొద్దిగా లేట్ చేసి ట్విస్టు ఇచ్చారు లెండి.
నిమిషంన్నర ఉన్న టీజర్లో ఒరిజినల్ వెర్షన్ నే ఎక్కువగా ఫాలో అయినట్టు కనిపిస్తోంది. చాలా మార్పులు చేశామని చెప్పారు కానీ విజువల్స్ చూస్తే మాత్రం చేంజెస్ జోలికి పెద్దగా వెళ్లలేదనే చెప్పాలి. అయితే ఈ వీడియోలోనే సల్మాన్ ఖాన్ ని రివీల్ చేయడం ద్వారా డబుల్ ట్రీట్ ఇచ్చారు. కాకపోతే ఆఖరి షాట్ లో జీపులో ఇద్దరు కలిసి గోడ బద్దలు కొట్టుకుని వచ్చే షాట్ లో మాత్రం ఏదో విఎఫ్ఎక్స్ తేడా అనిపించింది. సమయాభావం వల్ల ఏదైనా హడావిడి పడ్డారేమో మరి. మొత్తానికి అంచనాలు రేపేలా కట్ చేయడం విశేషం.
మొదటిసారి హీరోయిన్ లేకుండా చిరంజీవి చేస్తున్న సినిమా కావడం ఈ గాడ్ ఫాదర్ లో మరో ప్రత్యేకత. నయన్ సత్యదేవ్ లు భార్యభర్తలుగా కనిపిస్తారు. ఇతర క్యాస్టింగ్ లో ఒక్క సముతిరఖనిని మాత్రమే రివీల్ చేశారు. నెక్స్ట్ వచ్చే ట్రైలర్ లో ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. విడుదల తేదీని అక్టోబర్ 5 లాక్ చేసి ఆ మేరకు కన్ఫర్మ్ చేసేశారు. అదే రోజు నాగార్జున ది ఘోస్ట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ దసరా పండక్కు క్లాష్ అయినా పర్లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. సో ఇంకో నలభై అయిదు రోజుల్లో గాడ్ ఫాదర్ వచ్చేస్తున్నాడు
This post was last modified on August 21, 2022 8:13 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…