ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని, ఆదాయం పడిపోయిందని, ఇలా అయితే సినిమా మనుగడ సాగించడం కష్టమే అని కొన్ని వారాల ముందు టాలీవుడ్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కానీ గత రెండు వారాల్లో థియేటర్లు కళకళలాడిన తీరు చూసి అందరూ అవాక్కవుతున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు పెద్ద హిట్లు సాధించిన టాలీవుడ్ వైపు ఇప్పుడు దేశమంతా చూస్తోంది. ముఖ్యంగా గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ-2’ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పాలి.
హిందీలో నామమాత్రంగా 50 షోలతో మొదలైన ఈ చిత్రం.. ఇప్పుడు 2 వేలకు పైగా షోలతో నడుస్తుండడం విశేషం. లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ లాంటి పెద్ద సినిమాలను అది వెనక్కి నెట్టేసింది. హిందీ వెర్షన్ మాత్రమే ఇప్పటిదాకా రూ.8 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తొలి వారం ముగిసేరికి ఈ చిత్రం ఓవరాల్గా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. వరల్డ్ వైడ్ వారం రోజుల షేర్ రూ.26 కోట్ల దాకా వచ్చింది.
‘కార్తికేయ-2’ థియేట్రికల్ హక్కులను రూ.14 కోట్లకు అమ్మారు. తొలి వారంలోనే ఈ చిత్రం దాని మీద దాదాపు రెట్టింపు షేర్ రాబట్టడం విశేషం. అంటే ఆల్రెడీ ఈ చిత్రం డబుల్ బ్లాక్బస్టర్ అయిపోయింది. హిందీలో ఈ చిత్రానికి లాంగ్ రన్ ఖాయంగా కనిపిస్తోంది. ‘పుష్ప’ మాదిరే కొన్ని వారాల పాటు థియేటర్లలో నిలిచేలా ఉంది. అక్కడ మాత్రమే రూ.20-25 కోట్ల మధ్య నెట్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి వారం రూ.18 కోట్ల షేర్, రూ.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాం షేర్ రూ.6.5 కోట్లు కాగా.. సీడెడ్లో రూ.2.75 కోట్లు వచ్చాయి. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.8.65 కోట్ల షేర్ కలెక్ట్ అయింది. యుఎస్లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసింది. వరల్డ్ వైడ్ సినిమా రిలీజైన ప్రతి చోటా బయ్యర్లు లాభాల బాటలో ఉన్నారు. ఫుల్ రన్లో పెట్టుబడి మీద రెట్టింపు కన్నా ఎక్కువ ఆదాయమే అందుకోవడం ఖాయం. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో అంచనా వేయొచ్చు.
This post was last modified on August 21, 2022 12:28 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…