ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని, ఆదాయం పడిపోయిందని, ఇలా అయితే సినిమా మనుగడ సాగించడం కష్టమే అని కొన్ని వారాల ముందు టాలీవుడ్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కానీ గత రెండు వారాల్లో థియేటర్లు కళకళలాడిన తీరు చూసి అందరూ అవాక్కవుతున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు పెద్ద హిట్లు సాధించిన టాలీవుడ్ వైపు ఇప్పుడు దేశమంతా చూస్తోంది. ముఖ్యంగా గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కార్తికేయ-2’ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పాలి.
హిందీలో నామమాత్రంగా 50 షోలతో మొదలైన ఈ చిత్రం.. ఇప్పుడు 2 వేలకు పైగా షోలతో నడుస్తుండడం విశేషం. లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ లాంటి పెద్ద సినిమాలను అది వెనక్కి నెట్టేసింది. హిందీ వెర్షన్ మాత్రమే ఇప్పటిదాకా రూ.8 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తొలి వారం ముగిసేరికి ఈ చిత్రం ఓవరాల్గా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. వరల్డ్ వైడ్ వారం రోజుల షేర్ రూ.26 కోట్ల దాకా వచ్చింది.
‘కార్తికేయ-2’ థియేట్రికల్ హక్కులను రూ.14 కోట్లకు అమ్మారు. తొలి వారంలోనే ఈ చిత్రం దాని మీద దాదాపు రెట్టింపు షేర్ రాబట్టడం విశేషం. అంటే ఆల్రెడీ ఈ చిత్రం డబుల్ బ్లాక్బస్టర్ అయిపోయింది. హిందీలో ఈ చిత్రానికి లాంగ్ రన్ ఖాయంగా కనిపిస్తోంది. ‘పుష్ప’ మాదిరే కొన్ని వారాల పాటు థియేటర్లలో నిలిచేలా ఉంది. అక్కడ మాత్రమే రూ.20-25 కోట్ల మధ్య నెట్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి వారం రూ.18 కోట్ల షేర్, రూ.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నైజాం షేర్ రూ.6.5 కోట్లు కాగా.. సీడెడ్లో రూ.2.75 కోట్లు వచ్చాయి. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.8.65 కోట్ల షేర్ కలెక్ట్ అయింది. యుఎస్లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేసింది. వరల్డ్ వైడ్ సినిమా రిలీజైన ప్రతి చోటా బయ్యర్లు లాభాల బాటలో ఉన్నారు. ఫుల్ రన్లో పెట్టుబడి మీద రెట్టింపు కన్నా ఎక్కువ ఆదాయమే అందుకోవడం ఖాయం. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టో అంచనా వేయొచ్చు.
This post was last modified on August 21, 2022 12:28 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…