గత ఏడాది ‘లైగర్’ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతోందంటూ ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఆ సినిమాకు రూ.200 కోట్లు ఆఫర్ చేసిందని, టీం ఓకే చెప్పేసిందని వార్తలొచ్చాయి. ఐతే ఈ సినిమాకు మరీం అంత రేటా అని అందరూ ఆశ్చర్యపోతుంటే హీరో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగాడు. తన సినిమా థియేటర్లలో రిలీజైతే అంతకంటే ఎక్కువే వసూలు చేస్తుందని పేర్కొంటూ ఓటీటీ డీల్ విషయంలో నిజం లేదని తేల్చేశాడు.
అప్పుడు విజయ్ మాటలు అందరికీ అతిగా అనిపించాయి. ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ రూ.200 కోట్లకు పైగా థియేట్రికల్ కలెక్షన్ అంటే టూమచ్ అని, విజయ్ తన గురించి, తన సినిమా గురించి మరీ ఎక్కువ ఊహించుకుంటున్నాడని, సినిమాకు హైప్ పెంచడానికే ఈ కామెంట్ చేశాడని అన్నారు నెటిజన్లు. ఐతే అప్పుడేదో యధాలాపంగా చేసిన కామెంట్ మీద విజయ్ ఇప్పటికీ నిలబడే ఉన్నాడు. ‘లైగర్’ రూ.200 కోట్లను మించే వసూళ్లు రాబడుతుందని అతను తేల్చేశాడు.
‘లైగర్’ నిర్మాత ఛార్మీనే చేసిన ఇంటర్వ్యూలో అతడికి ఈ సినిమా వసూళ్ల గురించి ప్రశ్న ఎదురైంది. దానికతను బదులిస్తూ.. తన లెక్క అయితే రూ.200 కోట్ల నుంచే మొదలవుతుందని.. దాని మీద ఎంత వసూలు చేస్తుందనే తాను చూస్తానని.. అంతకంటే ముందు వచ్చే వసూళ్లను తాను పట్టించుకోనని విజయ్ వ్యాఖ్యానించాడు. ‘లైగర్’ను పూర్తి చేసి విడుదల చేసే క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము వెనుకంజ వేయలేదని విజయ్ తెలిపాడు.
‘‘నాకు సినిమా అవకాశాలు దొరకడం కష్టంగా ఉన్నపుడు ‘నీ ధర్మం నువ్వు చెయ్యి. ప్రకృతి చూసుకుంటుంది’ అని నాతో ఒకరు చెప్పారు. దాన్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ‘లైగర్’ చేసేటపుడు కూడా నా ధర్మాన్ని నేను పాటించా. నా శక్తికి మించి కష్టపడ్డా. సినిమా కోసం అందరూ అంతే కష్టపడ్డారు. సినిమా స్థాయికి మించి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. దీంతో నేను కూడా అంతే ఉత్సాహంగా నటించా. ఈ సినిమాతో ఇండియాను షేక్ చేస్తానని అన్నాను. ఆ స్టేట్మెంట్ తప్పు. ఈ నెల 25న ప్రేక్షకులే ఇండియాను షేక్ చేయాలి. వాళ్లను నచ్చేలా సాలిడ్ సినిమాను దించుతున్నాం’’ అని విజయ్ అన్నాడు.
This post was last modified on August 20, 2022 10:51 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…