ఇండియన్ స్క్రీన్ మీదికి రాబోతున్న మరో భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ చిత్రానికి ఆశించినంత హైప్ లేకపోవచ్చు కానీ.. ఇది ‘బాహుబలి’కి దీటుగా నిలిచే చిత్రం అవుతుందని కోలీవుడ్ ఆశిస్తోంది. ఎందుకంటే ఆ చిత్రాన్ని రూపొందించింది దిగ్గజ దర్శకుడు మణిరత్నం. ఈ సినిమా తీయాలని ఆయన రెండు దశాబ్దాల ముందు నుంచి కలలు కంటున్నారు. తమిళ లెజెండరీ రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు.
లైకా ప్రొడక్షన్స్తో కలిసి ఆయన సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగాన్నిరూ.200 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించారు. సెప్టెంబరు 30న ఈ చిత్రం థియేటర్లలోకి దిగబోతోంది. తెలుగులో ఈ చిత్రానికి పెద్ద సపోర్టే దొరికింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ‘PS-1’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నాడు.
‘పొన్నియన్ సెల్వన్’ టీజర్ చూస్తే ఇది ఉన్నత స్థాయి సినిమాలాగే కనిపించింది కానీ.. తమిళనాడు అవతల ఈ చిత్రానికి హైప్ తీసుకురావడంలో ఆ చిత్ర బృందం ఇప్పటిదాకా ఫెయిలైంది. ఐతే ఇప్పుడు దిల్ రాజు రంగంలోకి దిగాడు కాబట్టి ఆటోమేటిగ్గా తెలుగులో బజ్ పెరగొచ్చు. దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడంటేనే ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఏర్పడుతుంది. పబ్లిసిటీ గట్టిగా చేస్తారు. రిలీజ్ ప్లానింగ్ కూడా చాలా బాగుంటుంది.
ఇంతకుముందు మణిరత్నం సినిమాలు ‘ఓకే బంగారం’, ‘చెలియా’లను దిల్ రాజే రిలీజ్ చేయడం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్గా తన కెరీర్ ఆరంభంలో ‘అమృత’ చిత్రాన్ని సైతం రాజు తెలుగులో విడుదల చేశాడు. ‘పొన్నియన్ సెల్వన్’కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. విక్రమ్, కార్తి, జయం రవి, అరవింద్ స్వామి, త్రిష, ఐశ్వర్యారాయ్, మోహన్ బాబు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.
This post was last modified on August 20, 2022 6:32 pm
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…