విజయ్ దేవరకొండ బోల్డ్ కామెంట్లకు, స్టేట్మెంట్లకు పెట్టింది పేరు. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా తనేం అనాలనుకుంటే అది అనేస్తాడు. ఏం ఏచయాలనుకుంటే అది చేసేస్తాడు. ఈ క్రమంలో అతడి చర్యలు, మాటలు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. ఐతే ఎవరెంత గొడవ చేసినా విజయ్ మాత్రం పట్టనట్లే ఉంటాడు. ఈ అగ్రిసెవ్.. డోంట్ కేర్ యాటిట్యూడ్ అన్నిసార్లు వర్కవుట్ కాదు. కొన్నిసార్లు లేని తలనొప్పులు ఎదురు కావచ్చు. తాజాగా విజయ్ చేసిన ఒక కామెంట్ అతడి కొత్త చిత్రం లైగర్కు ఎక్కడ ముప్పు తెచ్చిపెడుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది అభిమానుల్లో.
కొంత కాలంగా హిందీ సినిమాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. రకరకాల కారణాలు చూపించి బాలీవుడ్ స్టార్ల సినిమాలను బాయ్కాట్ చేస్తున్నారు నెటిజన్లు. అదే పనిగా సినిమాల మీద నెగెటివ్ ప్రచారం చేసి వాటిని చంపేస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెగెటివ్ ట్రెండ్ గురించి ఎవరైనా విమర్శలు చేసినా వదలట్లేదు. తాము వ్యతిరేకిస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాను హృతిక్ రోషన్ పొగిడాడని అతడి సినిమా విక్రమ్ వేదను టార్గెట్ చేయడం తెలిసిందే.
ఇప్పుడు విజయ్ కూడా వాళ్లకు టార్గెట్ అయిపోతాడేమో అన్న చర్చ నడుస్తోంది. లైగర్ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ అనన్య పాండేతో కలిసి విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఈ బాయ్కాట్ ట్రెండ్ గురించి చర్చ వచ్చింది. సినిమాల మీద వేలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయని, ఇలా బాయ్కాట్ చేయడం సరి కాదని అనన్య పేర్కొంది.
అంతలో విజయ్ జోక్యం చేసుకుని సినిమాలను బాయ్కాట్ చేయాలని ట్రెండ్ చేసే వాళ్లకు అవసరానికి మించి అటెన్షన్ ఇవ్వాల్సిన పని లేదన్నాడు. అంతే కాక బాయ్కాట్ చేస్తే చేయనివ్వండి.. వాళ్లు అలా ట్రెండ్ చేస్తే ఏమవుతుంది? థియేటర్లకు వెళ్లి చూసేవాళ్లు చూస్తారు, లేదంటే ఓటీటీలో చూస్తారు అంతకు మించి ఏమవవ్వదు అని తేల్చేశాడు. ఐతే విజయ్ మాటల్లో తప్పేమీ లేదు కానీ.. సోషల్ మీడియాలో ఎవరు దొరుకుతారా అని కాచుకుని ఉన్న ఈ బాయ్కాట్ బ్యాచ్ను రెచ్చగొట్టి తన సినిమాను రిస్క్లో పెట్టాడేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 20, 2022 9:41 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…