అసలే ఎన్నడూ చూడని కష్టకాలంలో ఉన్న బాలీవుడ్ కు ఇప్పట్లో ఓదార్పు దక్కేలా లేదు. సౌత్ సినిమా డామినేషన్ పెరిగిపోయి అసలు హిందీ చిత్రాలంటేనే వద్దు బాబోయ్ అనేలా అక్కడి ప్రేక్షకులు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఒక ఏడెనిమిది నెలల కాలం తీసుకుంటే నార్త్ బెల్ట్ లో బాగా ఆడి టాప్ గ్రాసర్స్ గా నిలిచిన కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప పార్ట్ 1, కార్తికేయ 2 ఇవన్నీ దక్షణాది నుంచి వెళ్లి అద్భుతాలు చేసినవే.
అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో పోలిస్తే అంతగా గుర్తింపే లేని నిఖిల్ మూవీ ఎక్కువ వసూలు చేస్తోందంటే దానికన్నా నిదర్శనం వేరే కావాలా. సరే ఎప్పటికైనా ఇది సద్దుమణగకపోదా స్ట్రెయిట్ సినిమా ఏదైనా ఆడకపోదా అని ఎదురు చూస్తున్న టైంలో ఇవాళ తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన దొబారా దేశవ్యాప్తంగా విడుదలయ్యింది.
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన అనురాగ్ కశ్యప్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇది స్పానిష్ మూవీ మిరేజ్ రీమేక్ అని ముందే చెప్పడం వల్ల అనుమానాలు భయాలు లేకపోలేదు. వాటిని నిజం చేస్తూ దొబారా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. క్రిటిక్స్ సైతం కన్ఫ్యూజింగ్ నెరేషన్ కి చాలా తక్కువ రేటింగ్ ఇచ్చి గట్టిగా క్లాసులు తీసుకున్నారు.
పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఉదయం ఇంకా మొదట ఆట పడకుండానే సుమారు 200 షోల దాకా జనం లేనందుకు క్యాన్సిల్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దొబారా ప్రమోషన్ టైంలో తాప్సీ అనురాగ్ లు బాయ్ కాట్ లను ఉద్దేశించి చేసిన వెటకారం కామెంట్లను నెటిజెన్లు సీరియస్ గా తీసుకోవడం కొంత ప్రభావం చూపించింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో మర్డర్ మిస్టరీని చూపించాలని చేసిన ప్రయత్నం మొత్తంగా బెడిసి కొట్టింది. సో లైగర్ వచ్చేదాకా కార్తికేయ 2దే ఉత్తరాది రాష్ట్రాల్లో టాప్ చైర్ కానుంది.
This post was last modified on August 20, 2022 2:25 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…