అసలే ఎన్నడూ చూడని కష్టకాలంలో ఉన్న బాలీవుడ్ కు ఇప్పట్లో ఓదార్పు దక్కేలా లేదు. సౌత్ సినిమా డామినేషన్ పెరిగిపోయి అసలు హిందీ చిత్రాలంటేనే వద్దు బాబోయ్ అనేలా అక్కడి ప్రేక్షకులు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఒక ఏడెనిమిది నెలల కాలం తీసుకుంటే నార్త్ బెల్ట్ లో బాగా ఆడి టాప్ గ్రాసర్స్ గా నిలిచిన కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, పుష్ప పార్ట్ 1, కార్తికేయ 2 ఇవన్నీ దక్షణాది నుంచి వెళ్లి అద్భుతాలు చేసినవే.
అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో పోలిస్తే అంతగా గుర్తింపే లేని నిఖిల్ మూవీ ఎక్కువ వసూలు చేస్తోందంటే దానికన్నా నిదర్శనం వేరే కావాలా. సరే ఎప్పటికైనా ఇది సద్దుమణగకపోదా స్ట్రెయిట్ సినిమా ఏదైనా ఆడకపోదా అని ఎదురు చూస్తున్న టైంలో ఇవాళ తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన దొబారా దేశవ్యాప్తంగా విడుదలయ్యింది.
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి కల్ట్ క్లాసిక్స్ ఇచ్చిన అనురాగ్ కశ్యప్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇది స్పానిష్ మూవీ మిరేజ్ రీమేక్ అని ముందే చెప్పడం వల్ల అనుమానాలు భయాలు లేకపోలేదు. వాటిని నిజం చేస్తూ దొబారా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. క్రిటిక్స్ సైతం కన్ఫ్యూజింగ్ నెరేషన్ కి చాలా తక్కువ రేటింగ్ ఇచ్చి గట్టిగా క్లాసులు తీసుకున్నారు.
పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఉదయం ఇంకా మొదట ఆట పడకుండానే సుమారు 200 షోల దాకా జనం లేనందుకు క్యాన్సిల్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దొబారా ప్రమోషన్ టైంలో తాప్సీ అనురాగ్ లు బాయ్ కాట్ లను ఉద్దేశించి చేసిన వెటకారం కామెంట్లను నెటిజెన్లు సీరియస్ గా తీసుకోవడం కొంత ప్రభావం చూపించింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో మర్డర్ మిస్టరీని చూపించాలని చేసిన ప్రయత్నం మొత్తంగా బెడిసి కొట్టింది. సో లైగర్ వచ్చేదాకా కార్తికేయ 2దే ఉత్తరాది రాష్ట్రాల్లో టాప్ చైర్ కానుంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…