కరోనా మహమ్మారి ప్రభావం మొదలవడానికి ముందు విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇంకొన్ని రోజుల్లో థియేటర్లలోకి దిగాల్సిన పరిస్థితుల్లో ‘వి’, ‘ఉప్పెన’, ‘రెడ్’ లాంటి చిత్రాలకు కరోనా వల్ల బ్రేక్ పడింది. వైరస్ ప్రభావం తగ్గగానే సినిమాలు రిలీజ్ చేసేద్దామని చూశారు కానీ.. ఇలా నెలలకు నెలలు వేచి చూపులు తప్పవని ఊహించలేకపోయారా నిర్మాతలు.
మధ్యలో ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా.. అది తమకు గిట్టుబాటు కాదని ఆగిపోయారు. పైగా ఇవన్నీ ఓ స్థాయి ఉన్న సినిమాలే. థియేటర్లలో రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఉంది ఆ చిత్రాలకు. ఆరు నెలలు ఆలస్యంగా అయినా థియేటర్లలోనే వీటిని రిలీజ్ చేయాలనుకున్నారు. ఆగస్టు సమయానికి థియేటర్లు తెరుచుకుని బొమ్మ పడుతుందనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తే అలా ఏమీ కనిపించడం లేదు.
దసరాకు థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడిచినా గొప్పే అన్నది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరోసారి పై సినిమాల ఓటీటీ రిలీజ్ గురించి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నాని-సుధీర్ బాబుల కాంబినేషన్లో ఇంద్రగంటి రూపొందించిన ‘వి’ ఓటీటీ రిలీజ్ గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. దిల్ రాజుకు ఈసారి టెంప్టింగ్ ఆఫర్ వచ్చిందని.. ఇంకెంతో కాలం వడ్డీల భారం భరించడం కష్టమని భావించిన ఆయన ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారని అంటున్నారు.
అటు ప్రైమ్ నుంచే కాక.. అల్లు వారి ‘ఆహా’ నుంచి కూడా మంచి ఆఫర్ వచ్చిందని.. వరుసగా ఓటీటీ సినిమాలు నిరాశ పరుస్తుండటం.. వాటికి స్టార్ వాల్యూ లేకపోవడం వల్ల ఓటీటీ రిలీజ్ల విషయంలో నెగెటివ్ ఫీలింగ్తో ఉన్న ప్రేక్షకుల ఆలోచన మార్చడానికి ‘వి’ లాంటి పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉత్సాహం చూపిస్తున్నాయని అంటున్నారు. హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ల సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో మన దగ్గర నాని సినిమా అలా రిలీజైతే ఆశ్చర్యమేమీ లేదేమో.
This post was last modified on July 4, 2020 8:07 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…