కరోనా మహమ్మారి ప్రభావం మొదలవడానికి ముందు విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇంకొన్ని రోజుల్లో థియేటర్లలోకి దిగాల్సిన పరిస్థితుల్లో ‘వి’, ‘ఉప్పెన’, ‘రెడ్’ లాంటి చిత్రాలకు కరోనా వల్ల బ్రేక్ పడింది. వైరస్ ప్రభావం తగ్గగానే సినిమాలు రిలీజ్ చేసేద్దామని చూశారు కానీ.. ఇలా నెలలకు నెలలు వేచి చూపులు తప్పవని ఊహించలేకపోయారా నిర్మాతలు.
మధ్యలో ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా.. అది తమకు గిట్టుబాటు కాదని ఆగిపోయారు. పైగా ఇవన్నీ ఓ స్థాయి ఉన్న సినిమాలే. థియేటర్లలో రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఉంది ఆ చిత్రాలకు. ఆరు నెలలు ఆలస్యంగా అయినా థియేటర్లలోనే వీటిని రిలీజ్ చేయాలనుకున్నారు. ఆగస్టు సమయానికి థియేటర్లు తెరుచుకుని బొమ్మ పడుతుందనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తే అలా ఏమీ కనిపించడం లేదు.
దసరాకు థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడిచినా గొప్పే అన్నది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరోసారి పై సినిమాల ఓటీటీ రిలీజ్ గురించి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నాని-సుధీర్ బాబుల కాంబినేషన్లో ఇంద్రగంటి రూపొందించిన ‘వి’ ఓటీటీ రిలీజ్ గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. దిల్ రాజుకు ఈసారి టెంప్టింగ్ ఆఫర్ వచ్చిందని.. ఇంకెంతో కాలం వడ్డీల భారం భరించడం కష్టమని భావించిన ఆయన ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారని అంటున్నారు.
అటు ప్రైమ్ నుంచే కాక.. అల్లు వారి ‘ఆహా’ నుంచి కూడా మంచి ఆఫర్ వచ్చిందని.. వరుసగా ఓటీటీ సినిమాలు నిరాశ పరుస్తుండటం.. వాటికి స్టార్ వాల్యూ లేకపోవడం వల్ల ఓటీటీ రిలీజ్ల విషయంలో నెగెటివ్ ఫీలింగ్తో ఉన్న ప్రేక్షకుల ఆలోచన మార్చడానికి ‘వి’ లాంటి పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉత్సాహం చూపిస్తున్నాయని అంటున్నారు. హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ల సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో మన దగ్గర నాని సినిమా అలా రిలీజైతే ఆశ్చర్యమేమీ లేదేమో.
This post was last modified on July 4, 2020 8:07 am
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…