కరోనా మహమ్మారి ప్రభావం మొదలవడానికి ముందు విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇంకొన్ని రోజుల్లో థియేటర్లలోకి దిగాల్సిన పరిస్థితుల్లో ‘వి’, ‘ఉప్పెన’, ‘రెడ్’ లాంటి చిత్రాలకు కరోనా వల్ల బ్రేక్ పడింది. వైరస్ ప్రభావం తగ్గగానే సినిమాలు రిలీజ్ చేసేద్దామని చూశారు కానీ.. ఇలా నెలలకు నెలలు వేచి చూపులు తప్పవని ఊహించలేకపోయారా నిర్మాతలు.
మధ్యలో ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా.. అది తమకు గిట్టుబాటు కాదని ఆగిపోయారు. పైగా ఇవన్నీ ఓ స్థాయి ఉన్న సినిమాలే. థియేటర్లలో రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఉంది ఆ చిత్రాలకు. ఆరు నెలలు ఆలస్యంగా అయినా థియేటర్లలోనే వీటిని రిలీజ్ చేయాలనుకున్నారు. ఆగస్టు సమయానికి థియేటర్లు తెరుచుకుని బొమ్మ పడుతుందనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తే అలా ఏమీ కనిపించడం లేదు.
దసరాకు థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడిచినా గొప్పే అన్నది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరోసారి పై సినిమాల ఓటీటీ రిలీజ్ గురించి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నాని-సుధీర్ బాబుల కాంబినేషన్లో ఇంద్రగంటి రూపొందించిన ‘వి’ ఓటీటీ రిలీజ్ గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. దిల్ రాజుకు ఈసారి టెంప్టింగ్ ఆఫర్ వచ్చిందని.. ఇంకెంతో కాలం వడ్డీల భారం భరించడం కష్టమని భావించిన ఆయన ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారని అంటున్నారు.
అటు ప్రైమ్ నుంచే కాక.. అల్లు వారి ‘ఆహా’ నుంచి కూడా మంచి ఆఫర్ వచ్చిందని.. వరుసగా ఓటీటీ సినిమాలు నిరాశ పరుస్తుండటం.. వాటికి స్టార్ వాల్యూ లేకపోవడం వల్ల ఓటీటీ రిలీజ్ల విషయంలో నెగెటివ్ ఫీలింగ్తో ఉన్న ప్రేక్షకుల ఆలోచన మార్చడానికి ‘వి’ లాంటి పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉత్సాహం చూపిస్తున్నాయని అంటున్నారు. హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ల సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో మన దగ్గర నాని సినిమా అలా రిలీజైతే ఆశ్చర్యమేమీ లేదేమో.
This post was last modified on July 4, 2020 8:07 am
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…