కరోనా మహమ్మారి ప్రభావం మొదలవడానికి ముందు విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇంకొన్ని రోజుల్లో థియేటర్లలోకి దిగాల్సిన పరిస్థితుల్లో ‘వి’, ‘ఉప్పెన’, ‘రెడ్’ లాంటి చిత్రాలకు కరోనా వల్ల బ్రేక్ పడింది. వైరస్ ప్రభావం తగ్గగానే సినిమాలు రిలీజ్ చేసేద్దామని చూశారు కానీ.. ఇలా నెలలకు నెలలు వేచి చూపులు తప్పవని ఊహించలేకపోయారా నిర్మాతలు.
మధ్యలో ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా.. అది తమకు గిట్టుబాటు కాదని ఆగిపోయారు. పైగా ఇవన్నీ ఓ స్థాయి ఉన్న సినిమాలే. థియేటర్లలో రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఉంది ఆ చిత్రాలకు. ఆరు నెలలు ఆలస్యంగా అయినా థియేటర్లలోనే వీటిని రిలీజ్ చేయాలనుకున్నారు. ఆగస్టు సమయానికి థియేటర్లు తెరుచుకుని బొమ్మ పడుతుందనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తే అలా ఏమీ కనిపించడం లేదు.
దసరాకు థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడిచినా గొప్పే అన్నది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరోసారి పై సినిమాల ఓటీటీ రిలీజ్ గురించి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నాని-సుధీర్ బాబుల కాంబినేషన్లో ఇంద్రగంటి రూపొందించిన ‘వి’ ఓటీటీ రిలీజ్ గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. దిల్ రాజుకు ఈసారి టెంప్టింగ్ ఆఫర్ వచ్చిందని.. ఇంకెంతో కాలం వడ్డీల భారం భరించడం కష్టమని భావించిన ఆయన ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారని అంటున్నారు.
అటు ప్రైమ్ నుంచే కాక.. అల్లు వారి ‘ఆహా’ నుంచి కూడా మంచి ఆఫర్ వచ్చిందని.. వరుసగా ఓటీటీ సినిమాలు నిరాశ పరుస్తుండటం.. వాటికి స్టార్ వాల్యూ లేకపోవడం వల్ల ఓటీటీ రిలీజ్ల విషయంలో నెగెటివ్ ఫీలింగ్తో ఉన్న ప్రేక్షకుల ఆలోచన మార్చడానికి ‘వి’ లాంటి పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉత్సాహం చూపిస్తున్నాయని అంటున్నారు. హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ల సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో మన దగ్గర నాని సినిమా అలా రిలీజైతే ఆశ్చర్యమేమీ లేదేమో.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…