నిఖిల్-చందూ మొండేటిల కొత్త చిత్రం ‘కార్తికేయ-2’ జులై 22నే విడుదల కావాల్సిందే. ఆ డేట్ను అంతకు రెండు నెలల ముందే ప్రకటించింది చిత్ర బృందం. కానీ సినిమా ఆ సమయానికి రెడీ అయినా సరే.. అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆగస్టు 5కు అనుకుంటే ఆ డేట్నూ మార్చక తప్పలేదు. ఆగస్టు 12కు ఫిక్స్ అయ్యాక కూడా ఒక రోజు ఆలస్యంగా సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. తన సినిమాను ఇలా మళ్లీ మళ్లీ వాయిదా వేయాల్సి రావడంపై నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే.
తమ సినిమా డేట్ మార్చుకోవాలని ఒత్తిడి రావడంతో తాను చాలా రోజులు ఏడ్చినట్లు నిఖిల్ చెప్పుకొచ్చాడు ఆ ఇంటర్వ్యూలో. ఐతే ఏం జరిగినా మన మంచికే ఈ సినిమాను వాయిదా వేయడం మంచిదే అయిందని చెప్పాలి. జులై 22న ఈ సినిమా వచ్చుంటే.. అప్పుడు ప్రేక్షకులు ఉన్న మూడ్లో ఈ సినిమాను ఏమాత్రం ఆదరించేవారన్నది సందేహమే. జులై నెల భారీ వర్షాలు ముంచెత్తాయి. పైగా జనాలు ఎందుకో సినిమాలు చూసే మూడ్లోనే కనిపించలేదు.
ఇక ఆగస్టు 5న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ మంచి టాక్ తెచ్చుకుని చక్కటి వసూళ్లు రాబట్టాయి. వాటితో పోటీ పడి ఉంటే ‘కార్తికేయ-2’కు మైనస్ అయ్యేది. తర్వాతి వారం వచ్చిన మాచర్ల నియోజకవర్గం, లాల్ సింగ్ చడ్డా దారుణంగా బోల్తా కొట్టడంతో ఫోకస్ మొత్తం ‘కార్తికేయ-2’ మీదికి మళ్లింది. ఆమిర్ ఖాన్ చిత్రం మీద ఉన్న నెగెటివిటీ వల్ల హిందీ ప్రేక్షకులు ఇప్పుడు ‘కార్తికేయ-2’ వైపు మళ్లుతున్నారు.
ఇక ‘కార్తికేయ-2’కు సెలవులు కూడా బాగా కలిసొస్తున్నాయి. సోమవారం ఇండిపెండెన్స్ డే లీవ్ ప్లస్ అయింది. ఈ శుక్రవారం జన్మాష్టమి రావడం.. సినిమాలో శ్రీ కృష్ణుడి గురించి గొప్పగా చూపించడంతో టైమింగ్ కూడా బాగా కలిసొచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులు జన్మాష్టమి సెలబ్రేషన్లలో భాగంగా ఇంకా ఎక్కువగా ఈ సినిమా చూస్తున్నారు. ఈ వారం కొత్త సినిమాలన్నీ నామమాత్రం కావడం కూడా ‘కార్తికేయ-2’కు ప్లస్ అయి అది బాక్సాఫీస్ లీడర్గా కొనసాగుతోంది. ఇలా ఏం జరిగినా మన మంచికే అనే సామెత ‘కార్తికేయ-2’ విషయంలో నిజం అనిపిస్తోంది.
This post was last modified on August 19, 2022 11:59 pm
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…