నిఖిల్-చందూ మొండేటిల కొత్త చిత్రం ‘కార్తికేయ-2’ జులై 22నే విడుదల కావాల్సిందే. ఆ డేట్ను అంతకు రెండు నెలల ముందే ప్రకటించింది చిత్ర బృందం. కానీ సినిమా ఆ సమయానికి రెడీ అయినా సరే.. అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆగస్టు 5కు అనుకుంటే ఆ డేట్నూ మార్చక తప్పలేదు. ఆగస్టు 12కు ఫిక్స్ అయ్యాక కూడా ఒక రోజు ఆలస్యంగా సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. తన సినిమాను ఇలా మళ్లీ మళ్లీ వాయిదా వేయాల్సి రావడంపై నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే.
తమ సినిమా డేట్ మార్చుకోవాలని ఒత్తిడి రావడంతో తాను చాలా రోజులు ఏడ్చినట్లు నిఖిల్ చెప్పుకొచ్చాడు ఆ ఇంటర్వ్యూలో. ఐతే ఏం జరిగినా మన మంచికే ఈ సినిమాను వాయిదా వేయడం మంచిదే అయిందని చెప్పాలి. జులై 22న ఈ సినిమా వచ్చుంటే.. అప్పుడు ప్రేక్షకులు ఉన్న మూడ్లో ఈ సినిమాను ఏమాత్రం ఆదరించేవారన్నది సందేహమే. జులై నెల భారీ వర్షాలు ముంచెత్తాయి. పైగా జనాలు ఎందుకో సినిమాలు చూసే మూడ్లోనే కనిపించలేదు.
ఇక ఆగస్టు 5న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ మంచి టాక్ తెచ్చుకుని చక్కటి వసూళ్లు రాబట్టాయి. వాటితో పోటీ పడి ఉంటే ‘కార్తికేయ-2’కు మైనస్ అయ్యేది. తర్వాతి వారం వచ్చిన మాచర్ల నియోజకవర్గం, లాల్ సింగ్ చడ్డా దారుణంగా బోల్తా కొట్టడంతో ఫోకస్ మొత్తం ‘కార్తికేయ-2’ మీదికి మళ్లింది. ఆమిర్ ఖాన్ చిత్రం మీద ఉన్న నెగెటివిటీ వల్ల హిందీ ప్రేక్షకులు ఇప్పుడు ‘కార్తికేయ-2’ వైపు మళ్లుతున్నారు.
ఇక ‘కార్తికేయ-2’కు సెలవులు కూడా బాగా కలిసొస్తున్నాయి. సోమవారం ఇండిపెండెన్స్ డే లీవ్ ప్లస్ అయింది. ఈ శుక్రవారం జన్మాష్టమి రావడం.. సినిమాలో శ్రీ కృష్ణుడి గురించి గొప్పగా చూపించడంతో టైమింగ్ కూడా బాగా కలిసొచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులు జన్మాష్టమి సెలబ్రేషన్లలో భాగంగా ఇంకా ఎక్కువగా ఈ సినిమా చూస్తున్నారు. ఈ వారం కొత్త సినిమాలన్నీ నామమాత్రం కావడం కూడా ‘కార్తికేయ-2’కు ప్లస్ అయి అది బాక్సాఫీస్ లీడర్గా కొనసాగుతోంది. ఇలా ఏం జరిగినా మన మంచికే అనే సామెత ‘కార్తికేయ-2’ విషయంలో నిజం అనిపిస్తోంది.
This post was last modified on August 19, 2022 11:59 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…