మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన అబిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పూర్తి చేశాక తన సినిమాల లైనప్ గురించి ఆయన చెప్పిన మాటలు ఎవ్వరికీ రుచించడం లేదు. లూసిఫర్ రీమేక్ను సాహోతో డిజాస్టర్ ఫలితాన్నందుకున్న సుజీత్ చేతిలో పెడుతుండటం మీదే కొంత అభ్యంతరాలున్నాయి. ఐతే అది రీమేక్ కాబట్టి కొంత సర్దుకోవచ్చు. కానీ ఆ తర్వాత బాబీ, మెహర్ రమేష్లతో సినిమాలు చేసే అవకాశమున్నట్లు చిరు చెప్పడమే షాకింగ్.
బాబీకి దర్శకుడిగా ఎప్పుడూ అంత మంచి పేరు లేదు. పవర్, జై లవకుశ బాగానే ఆడినప్పటికీ.. అతను ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడు కాదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. చివరగా బాబీ తీసిన వెంకీ మామ చాలా ముతకగా అనిపించింది జనాలకు. చిరుతో బాబీ చర్చలని వార్తలొచ్చినపుడే అతడితో సినిమా ఏంటి అని అభిమానులు చర్చించుకున్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు మెహర్ రమేష్ కూడా తనతో సినిమా తీసేందుకు లైన్లో ఉన్నాడని చిరు చెప్పడం పెద్ద షాక్.
చిరుతో సినిమా అంటే దర్శకులు కూడా లైఫ్ టైం ఛాన్స్ అనే అనుకుంటారు. అగ్ర దర్శకుల ఫీలింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఐతే ఈ తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించే సినిమాలు తీయగల అగ్ర దర్శకులు చాలామంది ఉన్నా చిరు.. మెహర్ రమేష్ లాంటి దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి చూస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు.
రాజమౌళికి ఇప్పుడిప్పుడే ఖాళీ లేకపోవచ్చు. కానీ సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు చిరుతో సినిమా చేసేందుకు ముందుకొచ్చి చిరు నుంచి కమిట్మెంట్ తీసుకోకపోవడం.. చిరు కూడా ఇలాంటి దర్శకుల మీద దృష్టిసారించకపోవడమేంటో అర్థం కావడం లేదు.
This post was last modified on April 22, 2020 1:39 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…