మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన అబిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పూర్తి చేశాక తన సినిమాల లైనప్ గురించి ఆయన చెప్పిన మాటలు ఎవ్వరికీ రుచించడం లేదు. లూసిఫర్ రీమేక్ను సాహోతో డిజాస్టర్ ఫలితాన్నందుకున్న సుజీత్ చేతిలో పెడుతుండటం మీదే కొంత అభ్యంతరాలున్నాయి. ఐతే అది రీమేక్ కాబట్టి కొంత సర్దుకోవచ్చు. కానీ ఆ తర్వాత బాబీ, మెహర్ రమేష్లతో సినిమాలు చేసే అవకాశమున్నట్లు చిరు చెప్పడమే షాకింగ్.
బాబీకి దర్శకుడిగా ఎప్పుడూ అంత మంచి పేరు లేదు. పవర్, జై లవకుశ బాగానే ఆడినప్పటికీ.. అతను ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడు కాదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. చివరగా బాబీ తీసిన వెంకీ మామ చాలా ముతకగా అనిపించింది జనాలకు. చిరుతో బాబీ చర్చలని వార్తలొచ్చినపుడే అతడితో సినిమా ఏంటి అని అభిమానులు చర్చించుకున్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు మెహర్ రమేష్ కూడా తనతో సినిమా తీసేందుకు లైన్లో ఉన్నాడని చిరు చెప్పడం పెద్ద షాక్.
చిరుతో సినిమా అంటే దర్శకులు కూడా లైఫ్ టైం ఛాన్స్ అనే అనుకుంటారు. అగ్ర దర్శకుల ఫీలింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఐతే ఈ తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించే సినిమాలు తీయగల అగ్ర దర్శకులు చాలామంది ఉన్నా చిరు.. మెహర్ రమేష్ లాంటి దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి చూస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు.
రాజమౌళికి ఇప్పుడిప్పుడే ఖాళీ లేకపోవచ్చు. కానీ సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు చిరుతో సినిమా చేసేందుకు ముందుకొచ్చి చిరు నుంచి కమిట్మెంట్ తీసుకోకపోవడం.. చిరు కూడా ఇలాంటి దర్శకుల మీద దృష్టిసారించకపోవడమేంటో అర్థం కావడం లేదు.
This post was last modified on April 22, 2020 1:39 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…