మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన అబిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పూర్తి చేశాక తన సినిమాల లైనప్ గురించి ఆయన చెప్పిన మాటలు ఎవ్వరికీ రుచించడం లేదు. లూసిఫర్ రీమేక్ను సాహోతో డిజాస్టర్ ఫలితాన్నందుకున్న సుజీత్ చేతిలో పెడుతుండటం మీదే కొంత అభ్యంతరాలున్నాయి. ఐతే అది రీమేక్ కాబట్టి కొంత సర్దుకోవచ్చు. కానీ ఆ తర్వాత బాబీ, మెహర్ రమేష్లతో సినిమాలు చేసే అవకాశమున్నట్లు చిరు చెప్పడమే షాకింగ్.
బాబీకి దర్శకుడిగా ఎప్పుడూ అంత మంచి పేరు లేదు. పవర్, జై లవకుశ బాగానే ఆడినప్పటికీ.. అతను ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడు కాదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. చివరగా బాబీ తీసిన వెంకీ మామ చాలా ముతకగా అనిపించింది జనాలకు. చిరుతో బాబీ చర్చలని వార్తలొచ్చినపుడే అతడితో సినిమా ఏంటి అని అభిమానులు చర్చించుకున్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు మెహర్ రమేష్ కూడా తనతో సినిమా తీసేందుకు లైన్లో ఉన్నాడని చిరు చెప్పడం పెద్ద షాక్.
చిరుతో సినిమా అంటే దర్శకులు కూడా లైఫ్ టైం ఛాన్స్ అనే అనుకుంటారు. అగ్ర దర్శకుల ఫీలింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఐతే ఈ తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించే సినిమాలు తీయగల అగ్ర దర్శకులు చాలామంది ఉన్నా చిరు.. మెహర్ రమేష్ లాంటి దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి చూస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు.
రాజమౌళికి ఇప్పుడిప్పుడే ఖాళీ లేకపోవచ్చు. కానీ సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు చిరుతో సినిమా చేసేందుకు ముందుకొచ్చి చిరు నుంచి కమిట్మెంట్ తీసుకోకపోవడం.. చిరు కూడా ఇలాంటి దర్శకుల మీద దృష్టిసారించకపోవడమేంటో అర్థం కావడం లేదు.
This post was last modified on April 22, 2020 1:39 pm
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు భారీ మేలును…
ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…
ఈ ఏడాది పెట్టుబడి రాబడి లెక్కల్లో అత్యంత లాభదాయకం అనిపించిన సినిమాలో కోర్ట్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో…
ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే.…