మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన అబిమానులకు పెద్ద షాకే ఇచ్చాడు. అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పూర్తి చేశాక తన సినిమాల లైనప్ గురించి ఆయన చెప్పిన మాటలు ఎవ్వరికీ రుచించడం లేదు. లూసిఫర్ రీమేక్ను సాహోతో డిజాస్టర్ ఫలితాన్నందుకున్న సుజీత్ చేతిలో పెడుతుండటం మీదే కొంత అభ్యంతరాలున్నాయి. ఐతే అది రీమేక్ కాబట్టి కొంత సర్దుకోవచ్చు. కానీ ఆ తర్వాత బాబీ, మెహర్ రమేష్లతో సినిమాలు చేసే అవకాశమున్నట్లు చిరు చెప్పడమే షాకింగ్.
బాబీకి దర్శకుడిగా ఎప్పుడూ అంత మంచి పేరు లేదు. పవర్, జై లవకుశ బాగానే ఆడినప్పటికీ.. అతను ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడు కాదన్న అభిప్రాయం జనాల్లో ఉంది. చివరగా బాబీ తీసిన వెంకీ మామ చాలా ముతకగా అనిపించింది జనాలకు. చిరుతో బాబీ చర్చలని వార్తలొచ్చినపుడే అతడితో సినిమా ఏంటి అని అభిమానులు చర్చించుకున్నారు. అది చాలదన్నట్లు ఇప్పుడు మెహర్ రమేష్ కూడా తనతో సినిమా తీసేందుకు లైన్లో ఉన్నాడని చిరు చెప్పడం పెద్ద షాక్.
చిరుతో సినిమా అంటే దర్శకులు కూడా లైఫ్ టైం ఛాన్స్ అనే అనుకుంటారు. అగ్ర దర్శకుల ఫీలింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఐతే ఈ తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించే సినిమాలు తీయగల అగ్ర దర్శకులు చాలామంది ఉన్నా చిరు.. మెహర్ రమేష్ లాంటి దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి చూస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు.
రాజమౌళికి ఇప్పుడిప్పుడే ఖాళీ లేకపోవచ్చు. కానీ సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి, హరీష్ శంకర్, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు చిరుతో సినిమా చేసేందుకు ముందుకొచ్చి చిరు నుంచి కమిట్మెంట్ తీసుకోకపోవడం.. చిరు కూడా ఇలాంటి దర్శకుల మీద దృష్టిసారించకపోవడమేంటో అర్థం కావడం లేదు.
This post was last modified on April 22, 2020 1:39 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…