ఫీల్డ్ ఏదైనా సరే.. అందరూ సక్సెస్ వెంటే పరుగులు పెడతారు. సినీ రంగం కూడా అందుకు మినహాయింపు కాదు. ఇక్కడ సక్సెస్ రేట్ మరీ తక్కువ కాబట్టి.. హిట్ కొట్టిన వాళ్లకు ఉండే డిమాండ్ వేరు. ఫ్లాప్ ఇస్తే పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. సినిమా తేడా కొడితే మార్నింగ్ షో అవ్వగానే ఫోన్ మోగడం ఆగిపోతుంది. అక్కడ్నుంచి అవకాశాల కోసం ఎక్కే గడప దిగే గడప అన్నట్లుంటుంది పరిస్థితి. అలాంటి వాళ్లను నమ్మి అవకాశాలు ఇచ్చేవాళ్లు అరుదుగా ఉంటారు.
ఐతే ఎవ్వరూ తమను పట్టించుకోని స్థితిలో తమను నమ్మి రాజీ లేకుండా సినిమా నిర్మిస్తే.. ఆ దర్శకుడిలో ఎంతో కసి, తపన కనిపిస్తాయి. ఎలాగైనా హిట్ కొట్టాలని మరింత కష్టపడతారు. ఆ క్రమంలో గొప్ప విజయాలు కూడా రావచ్చు. వైజయంతీ మూవీస్ ఇలా ఫ్లాప్ డైరెక్టర్లను నమ్మడం ద్వారా వారి కెరీర్లకూ ఊపిరులూదడంతో పాటు కాసుల పంట పడించుకుంది.
పిట్టగోడ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అనుదీప్ కేవీని ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుక్కారణం.. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం చూపించకపోవడమే. ఇలాంటి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడిని వైజయంతీ మూవీస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నమ్మి అవకాశం ఇవ్వడం విశేషమే. అందుకు ఫలితమే జాతిరాత్నాలు లాంటి బ్లాక్ బస్టర్. చాలా తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు తెచ్చిపెట్టిందీ సినిమా.
ఇక లై, పడి పడి లేచె మనసు లాంటి పెద్ద డిజాస్టర్లు ఇచ్చిన హను రాఘవపూడికి ఇంకో ఛాన్స్ ఇచ్చే సాహసం ఎవ్వరూ చేయరనే అనుకున్నారంతా. కానీ అతని విజన్ను నమ్మి.. కోరుకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, బడ్జెట్ అన్నీ ఇచ్చి సీతారామం సినిమాను నిర్మించింది. ఈ సినిమా క్లాసిక్గా పేరు తెచ్చుకోవడమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం కూడా సాధిస్తోంది. ఈ చిత్రంతో వైజయంతీ మూవీస్కు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తున్నాయి. మొత్తానికి ఫ్లాప్ డైరెక్టర్లను నమ్మి వైజయంతీ సంస్థ గొప్ప ప్రయోజనమే పొందిందనే చర్చ నడుస్తోంది టాలీవుడ్లో.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…