పారసైట్.. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశం అయిన సినిమా ఇదే. ఈ కొరియన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డులు కూడా కొల్లగొట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులు ఆ సినిమాకే దక్కడం విశేషం. ఓ కొరియన్ మూవీ ఆస్కార్ అవార్డుల్లో ఇలా సత్తా చాటడం నభూతో.
అప్పటికే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ దక్కగా.. ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టాక ఇంకా ఎగబడి చూశారు. అమేజాన్ ప్రైమ్లో గత నెల చివర్లో రిలీజ్ చేయగా.. అక్కడా కోట్ల మంది చూశారు. చూస్తున్నారు. హైప్కు తగ్గట్లు సినిమా లేదని కొందరు పెదవి విరిచినా.. మెజారిటీ ప్రేక్షకులైతే ఈ సినిమా చూసి వావ్ అన్నవాళ్లే.
ఐతే మన దర్శక ధీరుడు రాజమౌళికి మాత్రం పారసైట్ సినిమా నచ్చలేదట. లాక్ డౌన్ టైంలో తాను చూసిన సినిమాల్లో పారసైట్ ఒకటని.. కానీ అది తనకు ఎక్కలేదని అన్నాడు జక్కన్న. సినిమా ఆరంభంలో కొంచెం నెమ్మదిగా అనిపించిందని.. మధ్యలోకి వచ్చేసరికి తాను నిద్రలోకి వెళ్లిపోయానని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సినిమాకు నాలుగు ఆస్కార్ అవార్డులిచ్చేంత సీన్ లేదని.. హైప్కు తగ్గట్లు సినిమా లేదని అన్నవాళ్లు ఉన్నారు కానీ.. రాజమౌళి లాంటి సెలబ్రెటీ ఇలా సినిమా మధ్యలో నిద్రపోయానని అనడం మాత్రం షాకింగే. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుని ఆస్కార్లూ కొల్లగొట్టిన సినిమా తనకు నచ్చలేదని చెప్పి ఉండొచ్చు కానీ.. మరీ నిద్రపోయాననడమే విడ్డూరం.
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె..…
కొన్నిసార్లు అంతే అనుకోకుండా అదృష్టం తలుపు తట్టేస్తుంది. దాన్ని వాడుకోవడం తెలిసుండాలి అంతే. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి తీస్తున్న…