ఆగస్ట్ నెల మొదటి సగాన్ని మూడు బ్లాక్ బస్టర్లతో పూర్తి చేసుకున్న టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి హుషారు మీదుంది. బింబిసార, సీతారామం, కార్తికేయ 2లు ఇచ్చిన కిక్ మాములుగా లేదు. కేవలం వారంలోపే బ్రేక్ ఈవెన్ దాటేసిన అరుదైన ఘనతను కూడా ఇవి దక్కించుకున్నాయి. వీటిని చూడటం పూర్తి చేసిన మూవీ లవర్స్ కళ్ళు ఇప్పుడు గురు శుక్రవారాల మీద పడ్డాయి. చెప్పుకోవడానికైతే ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలు బరిలో దిగుతున్నాయి. మరి ఇన్నేసి వస్తున్నాయి కదా టికెట్ కౌంటర్లు కిక్కిరిసిపోయేంత సీన్ అయితే కనిపించడం లేదు.
వీటిలో మొదటిది 18నే వస్తున్న ధనుష్ తిరు. హఠాత్తుగా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న డబ్బింగ్ మూవీ ఇది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించడంతో అంతో ఇంతో దీని మీద ఆసక్తి లేకపోలేదు. ట్రైలర్ అంత ఎగ్జైట్ మెంట్ అయితే ఇవ్వలేకపోయింది. కంటెంట్ తో ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. వరస దండయాత్రలతో విజయం కోసం పోరాడుతూనే ఉన్న ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్ 19న వస్తుంది. ఇదే రోజు వాంటెడ్ పండుగాడ్, కమిట్ మెంట్, మాటరాని మౌనమిది, అంఅః, లవ్ 2 లవ్, నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా బరిలో దిగుతున్నాయి.
చూసేందుకు కౌంట్ అయితే పెద్దగానే ఉంది కానీ ఓపెనింగ్స్ విషయంలో దేని మీదా ఆశలు పెట్టుకోవడానికి లేదు. మౌత్ టాక్ బ్రహ్మాండంగా ఉంటే తప్ప రన్ ఆశించడం కష్టమే. అసలే వారం గ్యాప్ లో విజయ్ దేవరకొండ లైగర్ ఉంది. ఆలోగానే ఎంత రాబట్టుకుంటే అంత మంచిది. అయినా ఇంతగా ఒకేసారి పోటీ పడేందుకు కారణం లేకపోలేదు. థియేట్రికల్ రిలీజ్ అయితేనే కొంటామని ఈ మధ్య ఓటిటిలు నిబంధనలు స్ట్రిక్ట్ చేశాయి. అందుకే ఈ కాంపిటీషన్ ఇష్టం లేకపోయినా తప్పడం లేదు.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…