రామ్ గోపాల్ వర్మ సినిమాల క్వాలిటీ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఇప్పుడు ఎంతమాత్రం లేదు కానీ.. ఆయన ఇటీవల ఓ సంచలన మార్పుకి శ్రీకారం చుట్టి సినీ పరిశ్రమకు మార్గనిర్దేశం చేశాడు. థియేట్రికల్ రిలీజ్కు అవకాశం లేని ఈ పరిస్థితుల్లో అందరూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వైపు చూస్తుంటే.. ఆయనే సొంతంగా తన సినిమాల కోసం ఓ ఫ్లాట్ ఫామ్ను ఏర్పాటు చేసుకున్నాడు.
శ్రేయాస్ మీడియాతో కలిసి ఆయన ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ పేరుతో ఏటీటీ ఫ్లాట్ ఓపెన్ చేశాడు. పే పర్ వ్యూ పద్ధతిలో ఒకసారి లాగిన్ అయి, ఇంత అని డబ్బులు కట్టి సినిమా చూసే అవకాశం కల్పించాడు వర్మ. ఏడాది మొత్తానికి ఓటీటీ ఫ్లాట్ ఫాంలో సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమాలు చూసే జనాలు ఇలా ఒక సినిమాకు వంద, రెండొందలు పెట్టి సినిమా చూస్తారా అన్న సందేహాల్ని వర్మ పటాపంచలు చేశాడు.
ఆర్జీవీ తీసిన నాసిరకం సినిమాల్ని కూడా లక్షల మంది డబ్బులు పెట్టి చూడటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అలాంటిది మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని ఇలా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మిగతా నిర్మాతల్లో కలిగింది. ఐతే టాలీవుడ్ నుంచి ఈ పద్ధతిని ఎంతమంది అందిపుచ్చుకుంటారో కానీ.. తమిళంలో మాత్రం ఓ ప్రముఖ ఫిలిం మేకర్ వర్మ నుంచి స్ఫూర్తి పొందాడు. అతనే.. సీవీ కుమార్. తమిళంలో కొన్ని అద్భుతమైన సినిమాలను నిర్మించిన కుమార్.. సందీప్ కిషన్ హీరోగా ‘మాయవన్’ (తెలుగులో ప్రాజెక్ట్ జడ్) పేరుతో తనే సొంతంగా ఓ మంచి సినిమా తీశాడు. దీని తర్వాత అతడి జోరు కొంచెం తగ్గింది. ఇప్పుడు కుమార్ ‘రీగల్ ట్యాకీస్’ పేరుతో ఒక యాప్ తీసుకొచ్చాడు.
వర్మ మొదలుపెట్టిన తరహాలోనే ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో సినిమా చూసే ఫ్లాట్ ఫామ్ ఇది. ఐతే వర్మ వెబ్ సైట్ ద్వారా సినిమా చూసే అవకాశం కల్పిస్తే.. కుమార్ ఇందుకోసం యాప్నే తీసుకొచ్చాడు. ఇందులో తన సినిమాలతో పాటు.. తన భాగస్వామ్యంతో వేరే వాళ్ల సినిమాలనూ రిలీజ్ చేయడానికి కుమార్ రంగం సిద్ధం చేశాడు. కోలీవుడ్లో ఇదొక సెన్సేషన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on July 3, 2020 6:41 pm
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…