మాములుగా తెలుగు సినిమాల విడుదల తేదీలు మహా అయితే ఓ రెండు మూడు నెలల ముందు ప్రకటించడం ఆనవాయితీ. ఏకంగా ఏడాది అడ్వాన్స్ గా రిలీజ్ డేట్ చెప్పడం మాత్రం అరుదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటి గ్రాండియర్స్ కి మాత్రమే అలా చేశారు కానీ అవి కూడా ఒకే మాట మీద ఉండలేక పరిస్థితుల ప్రభావం వల్ల డేట్లు మార్చుకుంటూ పోయాయి.
సలార్ అనౌన్స్ మెంట్ అభిమానుల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఆది పురుష్ కోసం ఎదురు చూస్తుంటే ఊహించినని విధంగా ప్రశాంత్ నీల్ ప్రకటన రావడం షాకే. ప్రత్యేకంగా సెప్టెంబర్ 28నే ఎందుకు ఎంచుకున్నారన్న డౌట్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయితే దీని వెనుక పెద్ద కసరత్తే జరిగింది. అదేంటో చూద్దాం. ఆ రోజు ముస్లింల పవిత్ర పండగ మిలాద్ ఉన్ నబి. నేషనల్ హాలిడే కాబట్టి ఓపెనింగ్ గ్రాండ్ గా ఉంటుంది.
అందులోనూ గురువారం కావడం మొదటి అడ్వాంటేజ్. 29 రెగ్యులర్ శుక్రవారంతో పాటు 30 శనివారం, అక్టోబర్ 1 సండే వీకెండ్ ఎలాగూ భారీ కలెక్షన్లను ఇస్తుంది. తిరిగి అక్టోబర్ 2 సోమవారం గాంధీ జయంతి జాతీయ సెలవు. సో వసూళ్ల పరంగా అయిదు రోజుల పాటు ఇండియా వైడ్ రచ్చ ఖాయం. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆపై ఎలాగూ కంటిన్యూ అవుతుంది
ఈ క్యాలికులేషన్లు అన్నీ చెక్ చేసుకునే సలార్ ని ఈ విధంగా సెప్టెంబర్ 28కి లాక్ చేసినట్టుగా కనిపిస్తోంది. గతంలో రెబెల్ కూడా ఇదే డేట్ కి వచ్చిందనే నెగటివ్ సెంటిమెంట్ ఫ్యాన్స్ లో ఉండొచ్చు కానీ కంటెంట్ బలంగా ఉంటే ఇవేవి పని చేయవుగా. ఇప్పటివరకు యాభై శాతం దాకా పూర్తయిన సలార్ ఒకటే భాగమనే క్లారిటీ కూడా వచ్చేసింది. సీక్వెల్ ఉండొచ్చనే ప్రచారానికి చెక్ పడినట్టే. చూసేందుకు చాలా దూరంగా ఉన్నప్పటికీ ఆ తేదీ దరిదాపుల్లోకి ఎవరూ రావొద్దనే మాస్ వార్నింగ్ కూడా ఇతర సినిమాలకు ఇచ్చినట్టు అయ్యిందిగా
This post was last modified on August 16, 2022 8:06 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…