‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఎం.ఎస్.రాజశేఖర్ శేఖర్ రెడ్డి.. ఈ పేరు అంత పాపులర్ కాదు కానీ.. ఎడిటర్ శేఖర్ అంటే మాత్రం ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలుసు. మనిషి ఎవరని తెలియకపోయినా ప్రేక్షకులు కూడా చాలా సినిమాల్లో ఎడిటర్గా శేఖర్ పేరు చూసే ఉంటారు. ఎక్కువగా అతను పని చేసింది పూరి జగన్నాథ్ సినిమాలకు. ఆ అనుభవంతోనే ఒక కథ రాసి నితిన్ను మెప్పించి సినిమా తీశాడు.
అదే.. మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా విడుదలకు ముందు రాజశేఖర్ ఎంత అన్పాపులర్ అయ్యాడో, ఎంత నెగెటివిటీ ఎదుర్కొన్నాడో తెలిసిందే. వైఎస్సార్ ఫ్యామిలీ అభిమాని అయిన రాజశేఖర్ రెడ్డి కమ్మ, కాపు కులాలను.. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీలను కించపరిచేలా ట్వీట్లు వేశాడన్న ఆరోపణలతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. దాని తాలూకు ప్రతికూల ప్రభావం ఈ సినిమా మీద పడినట్లే కనిపిస్తోంది.
విడుదలకు ముందు సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రెండ్స్ నడిచాయి. ఇక సినిమాకు వచ్చిన నెగెటివ్ టాక్ను బాగా స్ప్రెడ్ చేసి.. దాని ఓపెనింగ్స్ను గట్టిగానే దెబ్బ తీశారు. ‘మాచర్ల నియోజకవర్గం’ డిజాస్టర్ అని దాదాపుగా తేలిపోయింది. తొలి రోజే ఆ సినిమా థియేటర్లు వెలవెలబోయే పరిస్థితి వచ్చింది. మామూలుగా తొలి చిత్రం తేడా కొడితే ఇంకో అవకాశం రావడం కష్టం. అందులోనూ ‘మాచర్ల..’లో శేఖర్ దర్శకత్వ ప్రతిభ అంటూ ఏమీ కనిపించలేదు.
ఇంత రొటీన్ సినిమాలు తీసే దర్శకులకు అవకాశాలు కష్టమే. దీనికి తోడు అతడి మీద ఉన్న సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ ఉంది. అతడి మీద కొన్ని వర్గాలు పగబట్టేసినట్లే కనిపిస్తున్నాయి. తన ట్వీట్ల విషయంలో అతను వివరణ ఇచ్చినా వాళ్లు శాంతించలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతడి పట్ల వ్యతిరేకతను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు దర్శకుడిగా టాలెంటూ చూపించక, అటు నెగెటివిటీ ఎదుర్కొంటున్న శేఖర్కు ధైర్యం చేసి ఏ నిర్మాత అయినా ఇంకో ఛాన్స్ ఇస్తాడా అన్నది డౌటే. కాకపోతే ఎడిటర్గా అతడికి మంచి పేరే ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఉపాధికైతే ఢోకా లేదు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…