కొవిడ్ తర్వాత హిందీ ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. వాళ్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడంలో చాలా సెలక్టివ్గా ఉంటున్నారు. క్లాస్ టచ్ ఉన్న సినిమాల జోలికి అస్సలు వెళ్లట్లేదు. అలాగే ఇంతకుముందు బ్రహ్మరథం పట్టిన స్టార్ల సినిమాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు. ముఖ్యంగా లిబరల్స్గా ముద్ర వేయించుకుని హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను తమ సినిమాల్లో కించపరిచేలా చూపించడం, బయట ఆ తరహా స్టేట్మెంట్లు ఇవ్వడం చేసి ఉంటే వాళ్లు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బలైపోతున్నారు.
ఆమిర్ ఖాన్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఇప్పుడు అలాగే దెబ్బ తింది. ‘పీకే’ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచేలా సన్నివేశాలున్నాయని, గతంలో ఆమిర్ దేశంలో అసహనం పెరిగిపోతుండటం గురించి కామెంట్లు చేశాడని తన చిత్రాన్ని టార్గెట్ చేశారు. ఆమిర్ అనే కాదు.. మొత్తంగా బాలీవుడ్ స్టార్లు తమ చిత్రాల్లో హిందుత్వాన్ని తక్కువ చేసి చూపించడంపై ఇప్పుడు ఒక ఉద్యమమే నడుస్తోంది సోషల్ మీడియాలో.
బాలీవుడ్ తీరు ఇలా ఉంటే సౌత్ సినిమాల్లో హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను, చరిత్రను గొప్పగా చూపించడాన్ని అక్కడి జనాలు కొనియాడుతున్నారు. ‘అఖండ’ సహా పలు చిత్రాలను ఉదాహరణగా చూపిస్తూ హిందీ జనాలే బాలీవుడ్ సినిమాలను తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. మన దగ్గర హిందు దేవుళ్లు, ఆచారాలను గ్లోరిఫై చేస్తే ఆ సినిమాలను కొనియాడుతున్నారు. హిందీలో ఈ టైపు చిత్రాలను రిలీజ్ చేస్తే బాగా ఆదరిస్తున్నారు కూడా. ‘కార్తికేయ-2’ ఈ తరహా చిత్రమే కావడంతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలు బరిలో ఉండడంతో ‘కార్తికేయ-2’ను హిందీలో పరిమిత సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ తక్కువ స్క్రీన్లు, షోలతోనే ఈ చిత్రానికి నార్త్లో మంచి స్పందన వస్తోంది. హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. తొలి రోజు ఈ చిత్రానికి వచ్చిన స్పందన అక్కడి క్రిటిక్స్ను, ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాలో శ్రీకృష్ణుడి గురించి గొప్పగా చెప్పడం, చూపించడం, అనుపమ్ ఖేర్ కీలక పాత్ర చేయడం ప్లస్ అయింది. తొలి రోజు రెస్పాన్స్ చూశాక రెండో రోజు నుంచి థియేటర్లు, షోలు పెంచక తప్పని పరిస్థితి తలెత్తింది. బాలీవుడ్ ప్రేక్షకుల మూడ్కు తగ్గట్లుగా ‘కార్తికేయ-2’ టీం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందనే చెప్పాలి.
This post was last modified on August 14, 2022 6:20 pm
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…