నితిన్ హీరోగా పరిచయమై ఇరవై ఏళ్లవుతోంది. కానీ దిల్ తర్వాత ఆ రేంజ్ మాస్ సినిమాతో హిట్ కొట్టింది లేదు. మధ్యలో సీతారాముల కళ్యాణం లంకలో అనే సినిమాతో కంప్లీట్ మాస్ హీరో అవ్వాలని ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. హీరో , రెచ్చిపో ఇలా నితిన్ మాస్ సినిమా చేసిన ప్రతీ సారి ప్రేక్షకులు అతన్ని తిప్పికొట్టారు.
ఇప్పుడు నితిన్ ఆ ట్రాక్ లోకి వెళ్ళాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. మాచెర్ల నియోజిక వర్గం అనే టైటిల్ తో కంప్లీట్ గా మాస్ సినిమా చేశాడు. సినిమాలో సెకండాఫ్ అంతా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకున్నాడు. అంజలి ఐటెం సాంగ్, మాస్ ఫైట్స్ ఇలా అన్ని అల్లుకున్నాడు. ఈ సినిమా రేపే థియేటర్స్ లోకి వస్తోంది.
ఈ సినిమాను నిర్మించింది నితిన్ తండ్రి , అక్క. సొంత బేనర్ లో హిట్ దక్కుతుందా ? లేదా అనే టెన్షన్ ఓ వైపు ఈ సినిమాతో అయినా మాస్ హీరోగా ఎష్టాబిలాష్ అవ్వాలనే కసి మరో వైపు నితిన్ లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాతో ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ట్రైలర్స్, సాంగ్స్ మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేలా కనిపిస్తున్నాయి. కానీ అలా వచ్చిన మాస్ ఆడియన్స్ ని ఈ కొత్త దర్శకుడు కం హీరో నితిన్ ఎలా మెప్పిస్తారో అన్నదే పాయింట్. మాస్ ఆడియన్స్ కి ఏ మాత్రం ఎక్కినా నితిన్ ఓ కమర్షియల్ మాస్ హిట్ దక్కడం ఖాయమనిపిస్తుంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…