ఒకప్పుడు నిర్మాతలకు హీరో తాలూకు అభిమానుల డిమాండ్లు తెలిసేవి కాదు కానీ సోషల్ మీడియా ట్రెండింగ్ పుణ్యమాని క్షణాల్లో వాళ్ళ మనసులో ఉన్నదేమిటో తెలిసిపోతోంది. కొన్నిసార్లు వీటికి తలొగ్గి సారీలు చెప్పిన సందర్భాలు వాళ్ళ కోరిక తీర్చిన ఉదంతాలు ఉన్నాయి. కానీ అందరూ ఒకేలా స్పందిస్తారని కాదు కానీ ఈ ట్వీట్ల వ్యవహారం ఒక్కోసారి వైరస్ గా మారి చాలా దూరం వెళ్లిన దాఖలాలు ఎన్నో.
తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజు మీద RC 15 అప్డేట్ కోసం ఒత్తిడి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆజాది అమృత్ మహోత్సవాల పేరిట డెబ్భై అయిదవ స్వాతంత్ర దినోత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. శంకర్ రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న మూవీలో ఈ బ్యాక్ డ్రాప్ ఉంది.
ఇండిపెండెన్స్ కు ముందు జరిగే ఎపిసోడ్ లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించే క్యారెక్టర్ లో చరణ్ షాక్ ఇస్తాడని గతంలోనే లీక్ వచ్చింది. దాని తాలూకు ఫోటోలు లీకై ఆన్ లైన్ లో రచ్చ చేశాయి. ఇలాంటివి చేస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఎస్విసి సంస్థ అప్పట్లో ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. కట్ చేస్తే ఇప్పుడు టైటిల్ రిలీజ్ చేయడానికి ఇది సరైన సమయమని మెగాభిమానుల డిమాండ్.
టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎలాగూ సెట్స్ లో షూట్ చేస్తున్న వర్కింగ్ స్టిల్స్ ఆల్రెడీ బయటికి వచ్చాయి కాబట్టి అదేదో అఫీషియల్ గా చేయమని అడుగుతున్నారు. వాళ్ళు అడిగింది సబబుగానే ఉంది కానీ శంకర్ మనసులో ఏముందో బయటికి రావడం లేదు. కామన్ మ్యాన్ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది కానీ ఇంకా ఏదీ తేల్చలేదు. ఇండియన్ 2 కోసం బ్రేక్ ఇస్తారనే న్యూస్ కూడా ఇంకా ధృవీకరించలేదు
This post was last modified on August 11, 2022 10:39 pm
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…