ఒకప్పుడు నిర్మాతలకు హీరో తాలూకు అభిమానుల డిమాండ్లు తెలిసేవి కాదు కానీ సోషల్ మీడియా ట్రెండింగ్ పుణ్యమాని క్షణాల్లో వాళ్ళ మనసులో ఉన్నదేమిటో తెలిసిపోతోంది. కొన్నిసార్లు వీటికి తలొగ్గి సారీలు చెప్పిన సందర్భాలు వాళ్ళ కోరిక తీర్చిన ఉదంతాలు ఉన్నాయి. కానీ అందరూ ఒకేలా స్పందిస్తారని కాదు కానీ ఈ ట్వీట్ల వ్యవహారం ఒక్కోసారి వైరస్ గా మారి చాలా దూరం వెళ్లిన దాఖలాలు ఎన్నో.
తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజు మీద RC 15 అప్డేట్ కోసం ఒత్తిడి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆజాది అమృత్ మహోత్సవాల పేరిట డెబ్భై అయిదవ స్వాతంత్ర దినోత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. శంకర్ రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న మూవీలో ఈ బ్యాక్ డ్రాప్ ఉంది.
ఇండిపెండెన్స్ కు ముందు జరిగే ఎపిసోడ్ లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించే క్యారెక్టర్ లో చరణ్ షాక్ ఇస్తాడని గతంలోనే లీక్ వచ్చింది. దాని తాలూకు ఫోటోలు లీకై ఆన్ లైన్ లో రచ్చ చేశాయి. ఇలాంటివి చేస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఎస్విసి సంస్థ అప్పట్లో ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. కట్ చేస్తే ఇప్పుడు టైటిల్ రిలీజ్ చేయడానికి ఇది సరైన సమయమని మెగాభిమానుల డిమాండ్.
టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎలాగూ సెట్స్ లో షూట్ చేస్తున్న వర్కింగ్ స్టిల్స్ ఆల్రెడీ బయటికి వచ్చాయి కాబట్టి అదేదో అఫీషియల్ గా చేయమని అడుగుతున్నారు. వాళ్ళు అడిగింది సబబుగానే ఉంది కానీ శంకర్ మనసులో ఏముందో బయటికి రావడం లేదు. కామన్ మ్యాన్ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది కానీ ఇంకా ఏదీ తేల్చలేదు. ఇండియన్ 2 కోసం బ్రేక్ ఇస్తారనే న్యూస్ కూడా ఇంకా ధృవీకరించలేదు
This post was last modified on August 11, 2022 10:39 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…