శుక్రవారం విడుదల సాంప్రదాయానికి భిన్నంగా ఒక రోజు ముందే రిలీజైన బాలీవుడ్ సినిమాల్లో ఒకటి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కాగా రెండోది అక్షయ్ కుమార్ రక్షాబంధన్. అంచనాల విషయంలో రెండింటి మీద నార్త్ ఆడియన్స్ లోనూ వీటి మీద పెద్ద ఆసక్తి లేదని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి. అయితే మౌత్ టాక్ సహాయంతో కౌంటర్ సేల్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో జనాన్ని మెప్పించగలమనే నమ్మకంతో బరిలో దిగాయి. లాల్ సింగ్ భవితవ్యం ఆల్రెడీ తేలిపోయింది మరి రాఖీ బంధం ఎలా ఉందనే ఆసక్తి కలగడం సహజం.
ఇదో ఛాట్ దుకాణం నడిపే లాలా కేదార్నాథ్(అక్షయ్ కుమార్) కథ. పెళ్లీడుకొచ్చిన నలుగురు చెల్లెళ్ళ బాధ్యత ఇతని మీదే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో మైనస్ పాయింట్. కేదార్ చేసే పానీపూరిలు తింటే గర్భవతులకు తప్పకుండా మగసంతానం కలుగుతుందనే సెంటిమెంట్ అక్కడి జనాల్లో బలంగా వెళ్లడంతో ఇతనికి మహా గిరాకీ. కుటుంబం కోసం చిన్ననాటి స్నేహితురాలి(భూమి పెడ్నేకర్) ప్రేమను సైతం మూడు ముళ్ళదాకా తీసుకెళ్లకుండా ఆలస్యం చేస్తుంటాడు. మరి కట్నంతో ముడిపడిన చెల్లెళ్ళకు ఎలా వివాహం చేశాడనేదే అసలు స్టోరీ.
షారుఖ్ ఖాన్ కి జీరో రూపంలో మెగా డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తర్వాత అత్ రంగీరే అనే ఓటిటి మూవీతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇప్పుడీ రక్షాబంధన్ తో ఎమోషన్స్ ఆధారంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ సఫలీకృతం కాలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టరైజేషన్స్ తో టైం పాస్ చేయించి సెకండ్ హాఫ్ లో మెలోడ్రామాను విపరీతంగా జొప్పించేయడంతో ఈ రక్షాబంధన్ చూసేవాళ్లు చేతికి టైట్ అయిపోయి బాధ కలుగుతుంది. చెప్పాలంటే చిరంజీవి హిట్లర్ శుభలేఖ సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ రాఖీలోని కట్నం సందేశాలను కలిపితే అదే ఈ రక్షాబంధన్. ఏదో అద్భుతం చేసే అవకాశం లేనట్టే
This post was last modified on August 11, 2022 10:34 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…