ఫేక్ ప్రకటనతో షాక్ అయిన మెగా ఫ్యాన్స్

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్‌కి, అందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మామూలుగా అయితే చెర్రీ బర్త్ డే అంటే ఆ హడావుడి ఓ రేంజ్‌లో ఉండేది. అయితే కరోనా కారణంగా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశాడు చరణ్.  దాంతో సోషల్ మీడియాలోనే బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఈ మెగా పవర్ స్టార్.

అయితే ఓ ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన వార్త, చరణ్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. యూవీ క్రియేషన్స్ పేరిట క్రియేట్ చేసిన ఓ అకౌంట్‌లో ‘రామ్ చరణ్ తన తర్వాతి సినిమా డైరెక్టర్ సుజిత్‌తో చేయబోతున్నాడు’ అంటూ ట్వీట్ చేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘ఏమైంది ఈ వేళ’ సినిమా చూసి దర్శకుడు సంపత్ నందికి ‘రచ్ఛ’ ఛాన్స్ ఇచ్చిన చరణ్… ‘సాహో’ సినిమా చూశాక కూడా సుజిత్‌కు అవకాశం ఇచ్చాడా… అని ఆశ్చర్యపోయారు. అయితే అది ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన ఫేక్ న్యూస్ అని తెలిసాక కుదుటపడ్డారు.

ప్రస్తుతం’ఆర్ఆర్ఆర్’సినిమా చేస్తున్న చరణ్, తన తర్వాతి సినిమాపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాటు సుజిత్, వంశీ పైడిపల్లి కూడా చరణ్‌‌తో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్టులో ఉన్నారు. మరి ఈ వార్త నిజమై చరణ్, సుజిత్‌తో సినిమాకు కమిట్ అయితే మాత్రం…  ‘సాహో’ దెబ్బకు ఖాళీగా ఉన్న సుజిత్‌కు మళ్లీ ఓ బంపర్ అవకాశం దక్కినట్టే.

Share
Show comments
Published by
Satya

Recent Posts

రవితేజను అవమానించిన నిర్మాత ఎవరు?

సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…

5 minutes ago

ఆమిర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…

3 hours ago

వృషకర్మ… జాక్ పాట్ కొట్టిందమ్మా

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…

5 hours ago

అంతు చిక్కని ప్రభాస్ ఆలోచనలు

టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…

6 hours ago

యుద్ధం ప్రభావం బాక్సాఫీసు మీద ఉంటుందా

ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…

7 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఇప్పట్లో ముగింపు లేదా?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…

7 hours ago