గత వారాంతంలో విడుదలైన రెండు కొత్త చిత్రాల్లో టాక్ పరంగా సీతారామం ఎక్కువ మార్కులు వేయించుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా బింబిసార బాగా దూకుడు చూపించింది. తొలి రోజు కళ్యాణ్ రామ్ సినిమాకు ఆరున్నర కోట్ల షేర్ వస్తే.. సీతారామం షేర్ రూ.2.5 కోట్లకు పరిమితం అయింది. అందులోనూ ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది. ఇంత మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఈ వసూళ్లేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే అది క్లాస్ లవ్ స్టోరీ కావడం వల్ల తొలి రోజు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేకపోయింది.
కానీ సినిమాకు గొప్ప టాక్ రావడం, అందరూ క్లాసిక్ అని కొనియాడడంతో తొలి రోజు సాయంత్రం నుంచే వసూళ్లు పుంజుకున్నాయి. శని, ఆదివారాల్లో మంచి వసూళ్లు రాబట్టిందా సినిమా. ఆ రెండు రోజులకు దీటుగా సోమ, మంగళవారాల వసూళ్లు ఉన్నాయంటే సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. ఇది జెన్యూన్ హిట్ మూవీ అని చెప్పడానికి అది సంకేతం.
బింబిసారకు తొలి వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి బయ్యర్లు లాభాల బాటలోకి వచ్చేయగా.. సీతారామం విషయంలో కొంచెం ఆలస్యం అయింది. ఈ చిత్రం బుధవారం నాటికి బ్రేక్ ఈవెన్ అయింది. తొలి వారాంతంలో రూ.10 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించిన ఈ సినిమా తర్వాతి రెండు రోజుల్లో రూ.5 కోట్లకు పైగానే షేర్ రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.18 కోట్లకు అమ్మారు.
బుధవారం నైట్ షోలు అయ్యేసరికి సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్లే. గురువారం బయ్యర్లందరూ లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. సినిమాకు ఉన్న టాక్, వీకెండ్ తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడ్డ తీరు చూస్తే ఇది చాలా రోజులు థియేటర్లలో నిలిచేలా ఉంది. కాబట్టి బయ్యర్లందరికీ మంచి లాభాలు అందడం గ్యారెంటీ. థియేట్రికల్ రన్ అయ్యేసరికి సీతారామం బ్లాక్బస్టర్ స్టేటస్ కూడా అందుకునే ఛాన్సుంది. క్లాసిక్ అనిపించుకున్న మూవీ బ్లాక్బస్టర్ కూడా కావడం అరుదైన విషయమే.
This post was last modified on August 11, 2022 2:17 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…