గత వారాంతంలో విడుదలైన రెండు కొత్త చిత్రాల్లో టాక్ పరంగా సీతారామం ఎక్కువ మార్కులు వేయించుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా బింబిసార బాగా దూకుడు చూపించింది. తొలి రోజు కళ్యాణ్ రామ్ సినిమాకు ఆరున్నర కోట్ల షేర్ వస్తే.. సీతారామం షేర్ రూ.2.5 కోట్లకు పరిమితం అయింది. అందులోనూ ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది. ఇంత మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఈ వసూళ్లేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే అది క్లాస్ లవ్ స్టోరీ కావడం వల్ల తొలి రోజు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేకపోయింది.
కానీ సినిమాకు గొప్ప టాక్ రావడం, అందరూ క్లాసిక్ అని కొనియాడడంతో తొలి రోజు సాయంత్రం నుంచే వసూళ్లు పుంజుకున్నాయి. శని, ఆదివారాల్లో మంచి వసూళ్లు రాబట్టిందా సినిమా. ఆ రెండు రోజులకు దీటుగా సోమ, మంగళవారాల వసూళ్లు ఉన్నాయంటే సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. ఇది జెన్యూన్ హిట్ మూవీ అని చెప్పడానికి అది సంకేతం.
బింబిసారకు తొలి వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి బయ్యర్లు లాభాల బాటలోకి వచ్చేయగా.. సీతారామం విషయంలో కొంచెం ఆలస్యం అయింది. ఈ చిత్రం బుధవారం నాటికి బ్రేక్ ఈవెన్ అయింది. తొలి వారాంతంలో రూ.10 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించిన ఈ సినిమా తర్వాతి రెండు రోజుల్లో రూ.5 కోట్లకు పైగానే షేర్ రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.18 కోట్లకు అమ్మారు.
బుధవారం నైట్ షోలు అయ్యేసరికి సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్లే. గురువారం బయ్యర్లందరూ లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. సినిమాకు ఉన్న టాక్, వీకెండ్ తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడ్డ తీరు చూస్తే ఇది చాలా రోజులు థియేటర్లలో నిలిచేలా ఉంది. కాబట్టి బయ్యర్లందరికీ మంచి లాభాలు అందడం గ్యారెంటీ. థియేట్రికల్ రన్ అయ్యేసరికి సీతారామం బ్లాక్బస్టర్ స్టేటస్ కూడా అందుకునే ఛాన్సుంది. క్లాసిక్ అనిపించుకున్న మూవీ బ్లాక్బస్టర్ కూడా కావడం అరుదైన విషయమే.
This post was last modified on August 11, 2022 2:17 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…