ఎనిమిదేళ్ల కిందట చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా కార్తికేయ. స్వామిరారా మూవీతో చాలా గ్యాప్ తర్వాత ఓ విజయం అందుకుని కెరీర్లో పుంజుకుంటున్న సమయంలో వచ్చిన కార్తికేయ పెద్ద హిట్టయి నిఖిల్కు స్టార్ ఇమేజ్ తెచ్చింది. ఆ తర్వాత అతడికి మరికొన్ని విజయాలు దక్కాయి. అలాగే ఫ్లాపులూ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కొవిడ్, ఇతర కారణాల వల్ల కెరీర్ కొంచెం డల్లవగా.. కార్తికేయకు కొనసాగింపుగా తెరకెక్కిన సినిమా మీద అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు.
ఈ శనివారమే కార్తికేయ-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన చిత్ర దర్శకుడు చందు మొండేటి.. కార్తికేయ-2 సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా విజయం సాధించి.. కార్తికేయ-3కి పునాది వేస్తుందని కూడా అతను వ్యాఖ్యానించాడు.
కార్తికేయ తెలుగు ప్రాంతమైన సుబ్రహ్మణ్యపురంలో జరిగిందని.. సీక్వెల్కు ఉత్తరాదిన ఉన్న ద్వారకను నేపథ్యంగా తీసుకున్నామని.. ఈ కథ ద్వారకతో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతుందని.. ఈ చిత్రం తమ అంచనాలకు తగ్గట్లు విజయం సాధిస్తే.. దీనికి కొనసాగింపుగా కార్తికేయ-3 కచ్చితంగా తీస్తామని చందు చెప్పాడు. మూడో భాగం కోసం ఐడియాలు ఆలోచిస్తున్నానని.. ఆ కథ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని.. హీరో ఇంటర్నేషనల్ లెవెల్లో మిస్టరీ ఛేదించే ఆపరేషన్ మీద వెళ్తాడని చందు తెలిపాడు.
కార్తికేయ-1 చూడని వారికి కూడా కార్తికేయ-2 బాగా అర్థమవుతుందని.. మున్నాబాయ్ ఎంబీబీఎస్ తర్వాత మున్నాబాయ్ లగే రహోలో మాదిరి క్యారెక్టర్స్, సోల్ మాత్రమే తీసుకుని వేరే కథతో చేసిన సినిమా ఇదని చందు తెలిపాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చందు చెబుతూ.. గీతా ఆర్ట్స్లో ఓ సినిమా ఖరారైందని, అదయ్యాక నాగార్జునతో సినిమా ఉంటుందని వెల్లడించాడు.
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…