ఇండస్ట్రీ సమస్యల పై ఈ నెల 1 నుంచి తీవ్ర చర్చల్లో ఉన్న ఇండస్ట్రీ పెద్దలు కొన్ని విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఓటిటి గ్యాప్, ప్రొడక్షన్ ఖర్చుల గురించి ఒకే మాటపై తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని సమాచారం. ఒక్కో ఇష్యూ మీద ఒక్కో కమిటీ పెట్టి రిపోర్టులు ఇమ్మని చెప్పారు కానీ వాళ్ళు అందజేసే సూచనలను ప్రాక్టికల్ గా పాటించడానికి అందరూ సిద్ధంగా ఉండటం అనుమానమేనని అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
థియేటర్లకు జనం వచ్చే విషయంలో ఉన్న భ్రమలను బింబిసార, సీతారామంలు కలెక్షన్ల రూపంలో గాలిబుడగని పేల్చినంత ఈజీగా బద్దలు కొట్టాయి. బ్యాలన్స్ ఏమైనా ఉంటే పోకిరి తొక్కేసింది. సో ఆడియన్స్ ఇంట్లోనే ఉంటున్నారు, ఓటిటిలకు అలవాటు పడ్డారనేది ఒప్పుకోలేని మాటగానే చెప్పుకోవాలి. ఎనిమిది నుంచి పది వారాల మధ్య థియేటర్ కు డిజిటల్ కు గ్యాప్ ఉంటేనే మంచిదన్న ప్రతిపాదన పట్ల మిశ్రమ స్పందన దక్కడంలో ఆశ్చర్యం లేదు కానీ దీన్ని స్ట్రిక్ట్ గా పాటించకపోతే ఏం చేయాలనే దాని మీద ఎలాంటి కంక్లూజన్ రావడం లేదట.
లాల్ సింగ్ చడ్డాకు ఆరు నెలల గ్యాప్ ఉంచుకోవడాన్ని కొందరు ప్రస్తావించినప్పటికీ అమీర్ ఖాన్ సినిమా చేసేదే నాలుగేళ్లకోసారి కాబట్టి అలాంటివి చెల్లుబాటవుతాయి కానీ ఏడాదికి రెండు మూడు చేసే మీడియం రేంజ్ హీరోలకు అలా చేస్తే వచ్చే నాలుగు డబ్బుల్లోనూ ఓటిటిలు కోత పెట్టేస్తాయని కొందరు అంటున్నారు. దాని బదులు మొదటివారానికి ఎలాగూ ఫలితం తేలిపోతుంది కాబట్టి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛని ప్రొడ్యూసర్ కు ఇవ్వాలనేది మరికొందరి వాదన. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఈ ఓటిటి పంచాయితీ మాత్రం అంత సులభంగా తెగదని, ఒకవేళ చేయాలనుకున్నా ఆచరణలో బోలెడు చిక్కులొస్తాయని ఇన్ సైడ్ టాక్
This post was last modified on August 11, 2022 8:33 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…