ఇండస్ట్రీ సమస్యల పై ఈ నెల 1 నుంచి తీవ్ర చర్చల్లో ఉన్న ఇండస్ట్రీ పెద్దలు కొన్ని విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఓటిటి గ్యాప్, ప్రొడక్షన్ ఖర్చుల గురించి ఒకే మాటపై తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని సమాచారం. ఒక్కో ఇష్యూ మీద ఒక్కో కమిటీ పెట్టి రిపోర్టులు ఇమ్మని చెప్పారు కానీ వాళ్ళు అందజేసే సూచనలను ప్రాక్టికల్ గా పాటించడానికి అందరూ సిద్ధంగా ఉండటం అనుమానమేనని అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
థియేటర్లకు జనం వచ్చే విషయంలో ఉన్న భ్రమలను బింబిసార, సీతారామంలు కలెక్షన్ల రూపంలో గాలిబుడగని పేల్చినంత ఈజీగా బద్దలు కొట్టాయి. బ్యాలన్స్ ఏమైనా ఉంటే పోకిరి తొక్కేసింది. సో ఆడియన్స్ ఇంట్లోనే ఉంటున్నారు, ఓటిటిలకు అలవాటు పడ్డారనేది ఒప్పుకోలేని మాటగానే చెప్పుకోవాలి. ఎనిమిది నుంచి పది వారాల మధ్య థియేటర్ కు డిజిటల్ కు గ్యాప్ ఉంటేనే మంచిదన్న ప్రతిపాదన పట్ల మిశ్రమ స్పందన దక్కడంలో ఆశ్చర్యం లేదు కానీ దీన్ని స్ట్రిక్ట్ గా పాటించకపోతే ఏం చేయాలనే దాని మీద ఎలాంటి కంక్లూజన్ రావడం లేదట.
లాల్ సింగ్ చడ్డాకు ఆరు నెలల గ్యాప్ ఉంచుకోవడాన్ని కొందరు ప్రస్తావించినప్పటికీ అమీర్ ఖాన్ సినిమా చేసేదే నాలుగేళ్లకోసారి కాబట్టి అలాంటివి చెల్లుబాటవుతాయి కానీ ఏడాదికి రెండు మూడు చేసే మీడియం రేంజ్ హీరోలకు అలా చేస్తే వచ్చే నాలుగు డబ్బుల్లోనూ ఓటిటిలు కోత పెట్టేస్తాయని కొందరు అంటున్నారు. దాని బదులు మొదటివారానికి ఎలాగూ ఫలితం తేలిపోతుంది కాబట్టి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛని ప్రొడ్యూసర్ కు ఇవ్వాలనేది మరికొందరి వాదన. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఈ ఓటిటి పంచాయితీ మాత్రం అంత సులభంగా తెగదని, ఒకవేళ చేయాలనుకున్నా ఆచరణలో బోలెడు చిక్కులొస్తాయని ఇన్ సైడ్ టాక్
This post was last modified on August 11, 2022 8:33 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…