ఇండస్ట్రీ సమస్యల పై ఈ నెల 1 నుంచి తీవ్ర చర్చల్లో ఉన్న ఇండస్ట్రీ పెద్దలు కొన్ని విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఓటిటి గ్యాప్, ప్రొడక్షన్ ఖర్చుల గురించి ఒకే మాటపై తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని సమాచారం. ఒక్కో ఇష్యూ మీద ఒక్కో కమిటీ పెట్టి రిపోర్టులు ఇమ్మని చెప్పారు కానీ వాళ్ళు అందజేసే సూచనలను ప్రాక్టికల్ గా పాటించడానికి అందరూ సిద్ధంగా ఉండటం అనుమానమేనని అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
థియేటర్లకు జనం వచ్చే విషయంలో ఉన్న భ్రమలను బింబిసార, సీతారామంలు కలెక్షన్ల రూపంలో గాలిబుడగని పేల్చినంత ఈజీగా బద్దలు కొట్టాయి. బ్యాలన్స్ ఏమైనా ఉంటే పోకిరి తొక్కేసింది. సో ఆడియన్స్ ఇంట్లోనే ఉంటున్నారు, ఓటిటిలకు అలవాటు పడ్డారనేది ఒప్పుకోలేని మాటగానే చెప్పుకోవాలి. ఎనిమిది నుంచి పది వారాల మధ్య థియేటర్ కు డిజిటల్ కు గ్యాప్ ఉంటేనే మంచిదన్న ప్రతిపాదన పట్ల మిశ్రమ స్పందన దక్కడంలో ఆశ్చర్యం లేదు కానీ దీన్ని స్ట్రిక్ట్ గా పాటించకపోతే ఏం చేయాలనే దాని మీద ఎలాంటి కంక్లూజన్ రావడం లేదట.
లాల్ సింగ్ చడ్డాకు ఆరు నెలల గ్యాప్ ఉంచుకోవడాన్ని కొందరు ప్రస్తావించినప్పటికీ అమీర్ ఖాన్ సినిమా చేసేదే నాలుగేళ్లకోసారి కాబట్టి అలాంటివి చెల్లుబాటవుతాయి కానీ ఏడాదికి రెండు మూడు చేసే మీడియం రేంజ్ హీరోలకు అలా చేస్తే వచ్చే నాలుగు డబ్బుల్లోనూ ఓటిటిలు కోత పెట్టేస్తాయని కొందరు అంటున్నారు. దాని బదులు మొదటివారానికి ఎలాగూ ఫలితం తేలిపోతుంది కాబట్టి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛని ప్రొడ్యూసర్ కు ఇవ్వాలనేది మరికొందరి వాదన. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఈ ఓటిటి పంచాయితీ మాత్రం అంత సులభంగా తెగదని, ఒకవేళ చేయాలనుకున్నా ఆచరణలో బోలెడు చిక్కులొస్తాయని ఇన్ సైడ్ టాక్
This post was last modified on August 11, 2022 8:33 am
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…