మతానికి సంబంధించిన సున్నితమైన అంశాలున్న కారణంగా ఈ నెల 5న అరబ్ దేశాల్లో విడుదల కావాల్సిన సీతారామంకి అక్కడి సెన్సార్ అధికారులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. పలుదఫాల చర్చలు, పరిశీలనలు, కోతల తర్వాత ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రేపటి నుంచే షోలు ప్రారంభం కాబోతున్నాయి. అక్కడి అధికారులు కీలకమైన కొన్ని కట్స్, మ్యూట్స్ చెప్పినప్పటికీ అవి అసలు కథను ఇబ్బంది పెట్టేలా లేకపోవడంతో వైజయంతి టీమ్ హ్యాపీగానే ఉందట. సో ఫైనల్ గా రూటు క్లియర్ అయ్యింది.
నిజానికి బాలీవుడ్ సినిమాల్లోగా సీతారామంలో అభ్యంతరకరమైన విషయాలను చూపించలేదు. టెర్రరిజం మూలాలు పాకిస్థాన్ లో అక్కడి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నట్టు మాత్రమే స్పృశించారు. అది కూడా 1965 కాలానికి సంబంధించి. అలాంటప్పుడు తమకు సంబంధమే లేని విషయం గురించి అరబ్ అంతగా ఇదై పోవడం విచిత్రంగా ఉంది. గతంలో ది కాశ్మీర్ ఫైల్స్, బెల్ బాటమ్, పద్మావత్, నీర్జా, ఢిల్లీ బెల్లి, ఫిజా, ఓ మై గాడ్, బొంబాయి లాంటి ఎన్నో చిత్రాలు దుబాయ్ లో బ్యాన్ కు గురయ్యాయి. కొన్ని వెలుగు చూశాయి మరికొన్ని ఆగిపోయాయి.
సీతారామం కూడా అదే లిస్టులో చేరుతుందేమోనన్న భయాలకు ఫైనల్ గా చెక్ పడింది. మొదటివారం పూర్తవ్వకుండానే ముప్పై కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీని ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. బింబిసార ధీటుగా పోటీ ఇస్తున్నా దాన్ని తట్టుకుని మరీ నిలబడుతోంది. ఈ వారం ఏకంగా మూడు కొత్త రిలీజులు ఉంటున్నాయి కాబట్టి వాటి టాక్ ని కాబట్టి నెక్స్ట్ వచ్చే వసూళ్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. దీని దెబ్బకే దర్శకుడు హను రాఘవపూడికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయి
This post was last modified on August 11, 2022 12:46 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…