నాలుగేళ్ల క్రితం సుధీర్ బాబుని హీరోగా పెట్టి దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ‘సమ్మోహనం’ అనే సినిమా చేశాడు. సినిమా బాగుందనే టాక్ తెచ్చుకున్నా ఫైనల్ గా రిజల్ట్ మేకర్స్ అనుకున్నట్టుగా రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంద్రగంటి సుధీర్ బాబు ను పెట్టి ‘వీ’ అనే థ్రిల్లర్ యాక్షన్ సినిమా చేశాడు. ఈసారి నానిని కూడా పెట్టుకున్నాడు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఆ సినిమా ఫట్ అనిపించుకుంది. కాకపోతే ఓటీటీ డీల్ తో నిర్మాత దిల్ రాజు సేఫ్ అయ్యాడు.
ఇప్పుడు ఇంద్రగంటి – సుదీర్ బాబు కాంబోలో మరో సినిమా వస్తుంది. ఇటు కుర్ర హీరోకి అటు సీనియర్ దర్శకుడికి ఇద్దరికీ ఈ మధ్య సరైన హిట్ లేనందు వల్ల మళ్ళీ మళ్ళీ కలిసి సినిమాలు చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ ఇద్దరు. ఈసారి హీరోయిన్ గా కృతి శెట్టి ని తీసుకున్నారు. సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ అంటూ ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ మేకర్స్ వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే మాత్రం ఓ సందేహం కలుగకమానదు.
అటు ఇటు చేసి మళ్ళీ ఇంద్రగంటి ‘సమ్మోహనం’ కథనే తీస్తున్నాడా ? అనేది డౌటు. దీనికి కారణం పోస్టర్ లో సుదీర్ బాబు మెగా ఫోన్ పట్టుకొని కృతి శెట్టి పక్కన పరిగెడుతుండటం, ఆ వెనుక సినిమా టెక్నీషియన్స్ కనిపించడమే. సమ్మోహనంలో సినిమా హీరోయిన్ ని ఇష్టపడే ఓ అబ్బాయి కథ చూపించి దాన్ని అందంగా మలిచాడు ఇంద్రగంటి. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పోస్టర్ చూస్తే కూడా మళ్ళీ సినిమా బ్యాక్ డ్రాప్ , హీరోయిన్ ప్రేమకథ ఇలా కొంతవరకూ సింక్ అనిపిస్తుంది. ఈసారి సుదీర్ బాబుని డైరెక్టర్ గా మార్చి మళ్లీ హీరోయిన్ తో ప్రేమకథే చెప్తారా ? అనే సందేహం కలుగుతుంది.
పోస్టర్ చూసి అదే కథ అని చెప్పలేం కానీ… పోలిక మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చూడాలి మరి ఇంద్రగంటి ఈ కథలో ఆ అమ్మాయి గురించి కొత్తగా ఏం చెప్తారో ?
This post was last modified on August 11, 2022 12:35 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…