తెలుగు సినిమా ప్రస్థానంలో అతి గొప్ప మైలురాయిగా చెప్పుకునే సినిమా అన్న నందమూరి తారకరామారావు నటించిన దానవీరశూర కర్ణ. సుమారు నాలుగు గంటల నిడివితో రూపొందిన ఈ మాస్టర్ పీస్ 1977లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం పది లక్షల లోపే బడ్జెట్ తో రూపొంది కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ బ్లాక్ బస్టర్ నమోదు చేసిన రికార్డుల గురించి చెప్పుకుంటూ పొతే ఓ పెద్ద పుస్తకమే అవుతుంది.
ఎన్టీఆర్ మూడు పాత్రలు చేయడమే కాదు దర్శకత్వం కూడా వహించడం చరిత్ర మరువని సాహసం. ఇప్పుడు దీనికి పోకిరికి లింక్ ఏమై ఉంటుందనేగా మీ ప్రశ్న. అక్కడికే వద్దాం. డివిఎస్ కర్ణని 1994లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. కటవుట్లు, దండాలు, అభిమానుల ఊరేగింపులు, తెల్లవారుఝామున స్పెషల్ షోలతో చాలా రచ్చ జరిగింది. 17 ఏళ్ళ తర్వాత విడుదలైన పాత చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు 60 లక్షలకు కొనుగోలు చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ.
వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ మళ్ళీ కోటి రూపాయలకు పైగా వసూలు చేయడం ఇప్పటికీ ఏ సినిమా అందుకోలేకపోయింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత హిస్టరీ రిపీట్ అయ్యింది. నిన్న కేవలం సాయంత్రం మాత్రమే వేసిన పోకిరి స్పెషల్ ప్రీమియర్లకు భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్న ఒక్క ఆర్టిసి క్రాస్ లోనే 6 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ రావడం మాములు విషయం కాదు.
మొత్తం రెండు వందలకు పైగా జరిగిన వరల్డ్ వైడ్ స్క్రీనింగ్స్ చూసుకుంటే ఈ మొత్తం మూడు కోట్లకు పైగానే ఉంటుందని ట్రేడ్ అంచనా. ఓ రెండు రోజుల్లో ఆ లెక్కలూ బయటికి వస్తాయి. మొత్తానికి దానవీరశూరకర్ణ తర్వాత ఘరానా మొగుడు, తొలిప్రేమ లాంటివి చాలా రీ రిలీజులు జరుపుకున్నాయి కానీ ఆ స్థాయిలో ప్రభంజనం రికార్డులు సృష్టించింది మాత్రం ఖచ్చితంగా పోకిరిలో పండుగాడే.
This post was last modified on August 10, 2022 10:04 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…