అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాల గురించి ఆయన చెబుతున్న మాటలకు.. వాస్తవంగా వాటిలో ఉన్న విషయానికి పొంతన ఉండడం లేదు. ఎఫ్-3, థాంక్యూ సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేసి దిల్ రాజు జడ్జిమెంట్ను ప్రశ్నార్థకం చేశాయి. మరోవైపు ఈ రెండు చిత్రాల టికెట్ల ధరల విషయంలో కూడా రాజు చెప్పిన వ్యాఖ్యల విషయంలో విమర్శలు వచ్చాయి.
ఎఫ్-3కి ఎక్కువ రేట్లే పెట్టి తగ్గించినట్లు చెప్పడం ప్రేక్షకులకు రుచించలేదు. థాంక్యూ టికెట్ల ధరల విషయంలో ముందు ప్రెస్ మీట్లో ఇచ్చిన స్టేట్మెంట్పై మళ్లీ మాట మార్చేశారు. ఇక టాలీవుడ్లో సమస్యల పరిష్కారం కోసం షూటింగ్స్ ఆపేయాలని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించిన దిల్ రాజు.. తన బేనర్లో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘వారసుడు’ చిత్రీకరణను మాత్రం ఆపలేదు. ఇది తమిళ చిత్రం అంటూ కవర్ చేసే ప్రయత్నం బెడిసికొట్టింది. ఆయన క్రెడిబిలిటీని బాగా దెబ్బ తీసింది.
ఇప్పుడు దిల్ రాజు మరోసారి విమర్శలకు కేంద్రంగా మారాడు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘థాంక్యూ’ సినిమా.. థియేటర్లలో రిలీజైన 20 రోజులకే ఓటీటీలో వచ్చేస్తోంది. జులై 22న ఈ చిత్రం విడుదల కాగా.. ఆగస్టు 11న అమేజాన్ ప్రైమ్ దీన్ని స్ట్రీమ్ చేయబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఓటీటీ థియేటర్లను మింగేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నిర్మాతలు.. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంలో రాజుది ముఖ్య పాత్ర.
తాజాగా ‘బింబిసార’ సక్సెస్ మీట్లో కూడా రాజు మాట్లాడుతూ.. థియేట్రికల్ రిలీజ్ నుంచి 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలందరం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సినిమాను కూడా అలాగే స్ట్రీమింగ్కు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా విషయంలో ఇలా మాట్లాడిన ఆయన.. తన ప్రొడక్షన్లో వచ్చిన ‘థాంక్యూ’ విషయంలో ఈ రూల్ను ఎలా బ్రేక్ చేశారో అర్థం కావడం లేదు. బహుశా ఈ చిత్రానికి డిజిటల్ డీల్ చాలా ముందే ఖరారైందని, కాబట్టి దీనికి కొత్త రూల్ వర్తించదని, భవిష్యత్తులో వచ్చే తన సినిమాలకు ఆ నిబంధనను అనుసరించి డీల్స్ చేసుకుంటామని రాజు చెబుతారేమో.
This post was last modified on August 10, 2022 12:40 am
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…