ఇటీవలే ఎఫ్3 ఇచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విక్టరీ వంకటేష్ ఇంకా కొత్త సినిమాని మొదలుపెట్టలేదు. జాతరత్నాలు ఫేమ్ అనుదీప్ తో ఉంటుందని లీక్ వచ్చింది కానీ అతనేమో శివ కార్తికేయన్ ప్రిన్స్ తో బిజీగా ఉన్నాడు. ఎంతలేదన్నా ఇంకో రెండు నెలల దాకా అందుబాటులోకి రావడం కష్టమే. ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకనే ఆలోచనతో తనదగ్గరకు వచ్చిన ఓ క్యామియోని వెంకీ ఒప్పుకున్నట్టుగా లేటెస్ట్ అప్ డేట్.
అది కూడా ఎక్కువ కాల్ షీట్స్ డిమాండ్ చేసేది కాకపోవడంతో సానుకూలంగా స్పందించారట. వివరాల్లోకి వెళ్తే తమిళంలో సూపర్ సక్సెస్ అందుకున్న మూవీ ఓ మై కడవులే. దీన్ని విశ్వక్ సేన్ హీరోగా తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమేక్ చేశారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఇందులో దేవుడిగా కనిపించే ప్రత్యేక అతిథి పాత్ర ఒకటుంది. ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి చేస్తే బ్రహ్మాండంగా పేలింది.
కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో చేయించారు కానీ అదింకా రిలీజ్ కాలేదు. ఇప్పుడా క్యారెక్టర్ కే తెలుగులో వెంకటేష్ ను ఒప్పించారట. డేట్లు మహా అయితే వారం లోపే చాలనే కండిషన్ తో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడీ ఫ్యాక్టర్ ఓరి దేవుడోకు చాలా ప్లస్ అవుతుంది.
ఒక్కో అడుగు వేస్తూ కెరీర్ ని ట్రాక్ లో పెట్టుకుంటున్న విశ్వక్ సేన్ కు సీనియర్ల అండ చాలా అవసరం. అందులో భాగంగానే ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు వెంకీ తోడైతే ఓరి దేవుడాకు దగ్గుబాటి అభిమానుల అండ దొరుకుతుంది. మూవీ బాగుండి పాజిటివ్ టాక్ వచ్చేస్తే మంచి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టే కాబట్టి టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తమిళంలో తీసిన అశ్వత్ మరిముత్తు తెలుగులోనూ దర్శకుడిగా వ్యవహరించారు.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…