ఇటీవలే ఎఫ్3 ఇచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విక్టరీ వంకటేష్ ఇంకా కొత్త సినిమాని మొదలుపెట్టలేదు. జాతరత్నాలు ఫేమ్ అనుదీప్ తో ఉంటుందని లీక్ వచ్చింది కానీ అతనేమో శివ కార్తికేయన్ ప్రిన్స్ తో బిజీగా ఉన్నాడు. ఎంతలేదన్నా ఇంకో రెండు నెలల దాకా అందుబాటులోకి రావడం కష్టమే. ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకనే ఆలోచనతో తనదగ్గరకు వచ్చిన ఓ క్యామియోని వెంకీ ఒప్పుకున్నట్టుగా లేటెస్ట్ అప్ డేట్.
అది కూడా ఎక్కువ కాల్ షీట్స్ డిమాండ్ చేసేది కాకపోవడంతో సానుకూలంగా స్పందించారట. వివరాల్లోకి వెళ్తే తమిళంలో సూపర్ సక్సెస్ అందుకున్న మూవీ ఓ మై కడవులే. దీన్ని విశ్వక్ సేన్ హీరోగా తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమేక్ చేశారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఇందులో దేవుడిగా కనిపించే ప్రత్యేక అతిథి పాత్ర ఒకటుంది. ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి చేస్తే బ్రహ్మాండంగా పేలింది.
కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో చేయించారు కానీ అదింకా రిలీజ్ కాలేదు. ఇప్పుడా క్యారెక్టర్ కే తెలుగులో వెంకటేష్ ను ఒప్పించారట. డేట్లు మహా అయితే వారం లోపే చాలనే కండిషన్ తో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడీ ఫ్యాక్టర్ ఓరి దేవుడోకు చాలా ప్లస్ అవుతుంది.
ఒక్కో అడుగు వేస్తూ కెరీర్ ని ట్రాక్ లో పెట్టుకుంటున్న విశ్వక్ సేన్ కు సీనియర్ల అండ చాలా అవసరం. అందులో భాగంగానే ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు వెంకీ తోడైతే ఓరి దేవుడాకు దగ్గుబాటి అభిమానుల అండ దొరుకుతుంది. మూవీ బాగుండి పాజిటివ్ టాక్ వచ్చేస్తే మంచి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టే కాబట్టి టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తమిళంలో తీసిన అశ్వత్ మరిముత్తు తెలుగులోనూ దర్శకుడిగా వ్యవహరించారు.
This post was last modified on August 8, 2022 9:20 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…