ఒకప్పుడు భారీ బడ్జెట్ గ్రాండియర్లను నిర్మించి గొప్ప ఖ్యాతి సంపాదించిన బడా బ్యానర్లు కాలక్రమేణా వచ్చిన మార్పులకు తట్టుకోలేక తప్పుకోవడం చాలానే చూశాం. సురేష్ ప్రొడక్షన్స్ నే తీసుకుంటే సురేష్ బాబు సోలోగా ప్రొడ్యూసర్ కార్డు వేసుకుని ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. ఎన్టీఆర్ స్థాపించిన రామకృష్ణ సినీ స్టూడియోస్ తన కార్యకలాపాలు ఎప్పుడో ఆపేసింది.
దేవివరప్రసాద్, టి త్రివిక్రమరావు లాంటి అగ్రనిర్మాతలు కాలం చేయడానికి ముందే నిర్మాణాలకు స్వస్తి చెప్పి ఇతర వ్యాపకాల్లో బిజీ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. వీటికి భిన్నంగా వారసురాళ్ల అండతో సి అశ్వినీదత్ వైజయంతి సంస్థకు కొత్త జీవాన్ని ఇస్తూ కొత్త ఉత్సాహంతో పరుగులు పెడుతున్నారు.
కూతురు స్వప్న దత్, ప్రియాంక దత్ లు దీన్ని ముందుండి నడిపిస్తున్న తీరు అద్భుత ఫలితాలను ఇస్తోంది. మొదట్లో కొన్ని ఎదురు దెబ్బలు, ఫ్లాపులు వచ్చినప్పటికీ వీళ్ళు వెనుకడుగు వేయలేదు. అసలు తప్పు ఎక్కడ జరుగుతోందో గుర్తించి దాన్ని సరిచేయడం మొదలుపెట్టారు. మహానటితో ఇది స్టార్ట్ అయ్యింది. సావిత్రి జీవితకథను తెరకెక్కించిన తీరు అందరిని విస్మయపరిచింది.
కమర్షియల్ గానూ అది అందుకున్న విజయం చిన్నది కాదు. ఇక కథగా వినడానికి సిల్లీగా అనిపించే జాతిరత్నాలుతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సీతారామం వంతు. చాలా రిస్క్ అనిపించే ఇలాంటి ప్రాజెక్టుని ఈ స్థాయిలో లావిష్ గా తెరకెక్కించిన తీరు మరోసారి విజయాన్ని వైజయంతి ఖాతాలో వేసింది. స్వప్న, ప్రియాంకలే కాకుండా వీళ్ళ వెనుక ఉండే మరో సోదరి స్రవంతి భాగస్వామ్యం కూడా ఎంతో ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ అశ్వినీ దత్ అల్లుడు నాగఅశ్విన్ పాత్రను విస్మరించలేం. ఇవే ఇంత జాగ్రత్తగా తీస్తే అయిదు వందల కోట్లతో ముడిపడిన ప్రాజెక్ట్ కెని ఇంకే రేంజ్ లో చూపించబోతున్నారో వేరే చెప్పాలా.
This post was last modified on August 7, 2022 10:31 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…