ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ పెట్టుకున్న నమ్మకం నిజమై బింబిసార సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతూ థియేటర్ల దగ్గర సందడి చూపిస్తోంది. తన మార్కెట్ స్థాయికి మించి పెట్టిన బడ్జెట్, ఖర్చయినంత మొత్తానికి అమ్మకుండా సహేతుకమైన ధరలకే డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటి అంశాలు బయ్యర్లకు లాభాలు ఇచ్చే దిశగా తీసుకెళ్తున్నాయి. శని ఆదివారాలు ఇలాంటి టాక్ వచ్చిన సినిమాలకు సాధారణంగానే బాగుంటుంది.
అందులోనూ హౌస్ ఫుల్ బోర్డులకు అనుమానం అక్కర్లేదు. ఇదే జోరు సోమవారం కూడా కొనసాగిస్తే బ్లాక్ బస్టర్ స్టాంప్ పడిపోతుంది. కథనంలో తడబాటు, కొన్ని లాజిక్స్ లైట్ తీసుకోవడం లాంటివి పక్కనపెడితే ఫాంటసీ సినిమాల్లో ఇవి సీరియస్ గా తీసుకోవాల్సినవి కాదు కాబట్టి జనం ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే సెంటిమెంట్, యాక్షన్, థ్రిల్ అన్నీ పుష్కలంగా కుదిరిన బింబిసార ఒక్క పాటలు మాత్రమే ఆశించిన స్థాయిలో లేవనేది ఫ్యాన్స్ కంప్లయింట్. నేపధ్య సంగీతంతో ఎంఎం కీరవాణి అదరగొట్టినప్పటికీ పెద్ద ప్లస్ గా నిలవాల్సిన సాంగ్స్ మాములుగా ఉండటం కొంత లోటే అనిపించింది. ఈశ్వరుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాట తప్ప మిగిలినవి అంతంతమాత్రమే.
మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాండియర్లకు పాటలు ఎంత అడ్వాంటేజ్ అయ్యాయో చూశాం. ఇప్పటికీ యూట్యూబ్ లో వీటిని చూస్తున్నారు కాబట్టే మిలియన్ల వ్యూస్ ధారాళంగా వస్తుంటాయి. కానీ బింబిసారలో అలా కుదరలేదు. సెకాంఫ్ హాఫ్ లో వచ్చే కళ్యాణ్ రామ్ క్యాథరిన్ త్రెస్సా డ్యూయెట్ పిక్చరైజేషన్ బాగున్నప్పటికీ ట్యూన్ ఎంజాయ్ చేసేలా అనిపించదు. ఒకవేళ మ్యూజిక్ కూడా బెస్ట్ వచ్చి ఉంటే వీటి లెవెల్ ఇంకా పెరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా బిజిఎంతో ర్యాంప్ ఆడేసిన కీరవాణికి ఫ్యాన్స్ ఈ ఒక్క అసంతృప్తి నుంచి మినహాయింపు ఇచ్చేశారు
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…