ఈ నెల 9న రీ రిలీజ్ కాబోతున్న పోకిరి బుకింగ్స్ చూస్తే మతులు పోవడం ఖాయం. ఒక్క హైదరాబాద్ లోనే ఇప్పటికి పాతిక షోలు వేస్తే దాదాపుగా అన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ కావడం గమనార్హం. ఇవింకా పెరిగే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు రాత్రి సుమారు వంద నుంచి నూటా యాభై మధ్య ప్రీమియర్లు ఫిక్స్ అయ్యాయి.
కొన్ని చోట్ల టికెట్ల కోసం ఒత్తిడి తట్టుకోలేక అదనపు థియేటర్లను జోడిస్తుంటే అప్పటికప్పుడు అవి కూడా హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయంటే షాక్ కాక మరేమిటి. ఇంత మేనియాని గత రెండు దశాబ్దాల్లో ఏ సినిమా సొంతం చేసుకోలేదన్నది వాస్తవం. యుట్యూబ్ లో ఫ్రీగా చూసే సౌకర్యం ఉండగా ఇప్పుడీ క్రేజ్ రావడం ఏమిటాని సమస్య ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
పోకిరి టైంలో చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు దాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని అందుకోలేదు. వాళ్లకు పండుగాడి యుఫోరియాని వినడం చదవడం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. దాన్ని వాళ్లకు మరోసారి హాళ్ల దగ్గర రుచి చూపించే ఉద్దేశంతో సీనియర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు.
బుక్ మై షోలో పెరుగుతూ పోతున్న షోలను చూస్తేనే చెప్పొచ్చు సూపర్ స్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో. ఇదొక్కటే కాదు ఒక్కడు కూడా ఇదే తరహాలో ఒక రోజు ముందు ఆగస్ట్ 8కి షోలు వేస్తున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఏడు షోలు ఫుల్ కావడానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు. దానికి దర్శకుడు గుణశేఖర్ తో సహా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించబోతున్నారు. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఇదో ట్రెండ్ గా మరి ఇతర ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరోల బ్లాక్ బస్టర్లను ఇలా ప్రత్యేకంగా వేసుకుని మురిసిపోవడం మాములు విషయమయ్యేలా ఉంది
This post was last modified on August 6, 2022 9:37 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…