బింబిసార సినిమా మీద నందమూరి కళ్యాణ్ రామ్, అతడి టీం పెట్టుకున్న నమ్మకం నిజమైంది. ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రి రిలీజ్ బజ్ వల్ల ముందే ఈ సినిమాకు మంచి బుకింగ్స్ జరగగా.. టాక్ బాగుండడంతో తొలి రోజు వసూళ్లు మరింత పుంజుకున్నాయి. సినిమా హౌస్ ఫుల్స్తో రన్ అవుతోంది. సాయంత్రానికి అదనపు థియేటర్లు, షోలు వేసేంత డిమాండ్ వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఊపు చూసి ఆలస్యం చేయకుండా దర్శకుడు వశిష్ఠతో కలిసి ప్రెస్ మీట్ పెట్టాడు కళ్యాణ్ రామ్.
తన సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ అతను ఒకింత ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీ తరఫున ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు. ఇది మా విజయం అని చెప్పుకోను. ఇది ప్రజల విజయం. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే.. జనాలు తండోపతండాలుగా థియేటర్లకి వస్తారని నిరూపించారు. ఈ విజయానికి మా సినిమా ఇండస్ట్రీ మొత్తం మీకు రుణపడి ఉంటాం. మరోసారి మమ్మల్ని బతికించారు మీరు.
ముందు ముందు మంచి సినిమాలతో మీముందుకు వస్తానని తెలియజేస్తున్నాను అని కళ్యాణ్ రామ్ అన్నాడు. తనకు ఇంత మంచి సినిమాను ఇచ్చిన దర్శకుడు వశిష్ఠకు కృతజ్ఞతలు చెప్పిన కళ్యాణ్ రామ్.. బింబిసారకు సీక్వెల్ ఉంటుందని మరోసారి స్పష్టం చేశాడు. బింబిసారుడు అనే గొప్ప పాత్రను నేను చేయగలనో లేదో నాకు తెలియదు కానీ నేను చేయగలను అని.. ఈ సినిమాని నా దగ్గరకు తీసుకువచ్చిన దర్శకుడు వశిష్టకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు.
ఇక ‘బింబిసార’ పార్ట్ 2ను బాధ్యతతో తెరకెక్కించాల్సిన బాధ్యతను వశిష్టకు అప్పగిస్తున్నాను. ఆ సినిమాతో భారీగా.. ఇంకో అద్భుతమైన సినిమాతో మీ ముందుకు వస్తాం అని కళ్యాణ్ రామ్ చెప్పాడు. ఈ సినిమాకు ప్రోత్సాన్నిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. అతనే తమ తొలి ప్రేక్షకుడని, సినిమా చూసి ఇది పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ఇచ్చాడని చెబుతూ లవ్ యూ నానా అని తన తమ్ముడిపై ప్రేమను చూపించాడు నందమూరి హీరో.
This post was last modified on August 6, 2022 9:26 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…