‘కార్తికేయ’ సినిమాతో ఇటు ఇండస్ట్రీ జనాలను, అటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దర్శకుడు చందు మొండేటి. అతడి నుంచి మున్ముందు ఎగ్జైటింగ్ సినిమాలు చూడొచ్చన్న ఆశ అందరిలోనూ కలిగింది. ఐతే రెండో సినిమాగా అనుకోకుండా రీమేక్ అయిన ‘ప్రేమమ్’ చేయాల్సి వచ్చింది. ఆ సినిమాతోనూ అతను విజయం అందుకున్నాడు. దీని తర్వాత నాగచైతన్య హీరోగా అతను తీసిన ‘సవ్యసాచి’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలమైంది. ఈ ఫెయిల్యూర్ మీద చందు ఎక్కడా పెద్దగా స్పందించింది లేదు. ఆ సినిమా తర్వాత అతను మీడియా దృష్టిలో కూడా పడలేదు. కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత అతను ‘కార్తికేయ’ సీక్వెల్ మీద దృష్టిసారించాడు. ఈ సినిమా కరోనా సహా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాకు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు చందు.
ఇందులో ‘సవ్యసాచి’ ఫెయిల్యూర్ గురించి అతను మాట్లాడాడు. ఈ సినిమా విషయంలో తాను కన్ఫ్యూజ్ అయినట్లు చందు తెలిపాడు. ఒక కన్విక్షన్తో ఆ సినిమా చేయలేదని, ఏం చేస్తున్నాననే విషయంలో తనకు తాను కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల సినిమా తేడా కొట్టిందని అతను చెప్పాడు. ఈ సినిమా విడుదలకు ఐదు రోజుల ముందే తనకు రిజల్ట్ తెలిసిపోయిందని కూడా అతను వెల్లడించాడు.
సినిమా చూసుకుంటే తనకే నచ్చలేదని, ఒకవేళ ఇది సక్సెస్ అయినా దాని క్రెడిట్ మనం తీసుకోకూడదు అని తన అసిస్టెంట్లతో అన్నట్లు చందు వెల్లడించాడు. ఒక సినిమా విషయంలో ఏదైనా తప్పు చేయడం మొదలైతే అన్నీ తప్పుగానే అవుతాయని.. ‘సవ్యసాచి’ విషయంలో అదే జరిగిందని.. బేసిక్ ఐడియా, మాధవన్ పాత్ర.. ఇలా అన్నీ తేడా కొట్టాయని చందు తెలిపాడు. తన కెరీర్లో ఓవర్ బడ్జెట్ అయిన సినిమా కూడా అదే అని.. అందుకు తనతో సహా అందరూ కారణమే అని తెలిపాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి మంచి పెద్ద బేనర్ అండ ఉన్నా, తనకు కావాల్సిందల్లా సమకూర్చినా మంచి సినిమా చేయలేకపోయానని అతను చెప్పాడు.
This post was last modified on August 5, 2022 8:43 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…