‘కార్తికేయ’ సినిమాతో ఇటు ఇండస్ట్రీ జనాలను, అటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దర్శకుడు చందు మొండేటి. అతడి నుంచి మున్ముందు ఎగ్జైటింగ్ సినిమాలు చూడొచ్చన్న ఆశ అందరిలోనూ కలిగింది. ఐతే రెండో సినిమాగా అనుకోకుండా రీమేక్ అయిన ‘ప్రేమమ్’ చేయాల్సి వచ్చింది. ఆ సినిమాతోనూ అతను విజయం అందుకున్నాడు. దీని తర్వాత నాగచైతన్య హీరోగా అతను తీసిన ‘సవ్యసాచి’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలమైంది. ఈ ఫెయిల్యూర్ మీద చందు ఎక్కడా పెద్దగా స్పందించింది లేదు. ఆ సినిమా తర్వాత అతను మీడియా దృష్టిలో కూడా పడలేదు. కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత అతను ‘కార్తికేయ’ సీక్వెల్ మీద దృష్టిసారించాడు. ఈ సినిమా కరోనా సహా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాకు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు చందు.
ఇందులో ‘సవ్యసాచి’ ఫెయిల్యూర్ గురించి అతను మాట్లాడాడు. ఈ సినిమా విషయంలో తాను కన్ఫ్యూజ్ అయినట్లు చందు తెలిపాడు. ఒక కన్విక్షన్తో ఆ సినిమా చేయలేదని, ఏం చేస్తున్నాననే విషయంలో తనకు తాను కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల సినిమా తేడా కొట్టిందని అతను చెప్పాడు. ఈ సినిమా విడుదలకు ఐదు రోజుల ముందే తనకు రిజల్ట్ తెలిసిపోయిందని కూడా అతను వెల్లడించాడు.
సినిమా చూసుకుంటే తనకే నచ్చలేదని, ఒకవేళ ఇది సక్సెస్ అయినా దాని క్రెడిట్ మనం తీసుకోకూడదు అని తన అసిస్టెంట్లతో అన్నట్లు చందు వెల్లడించాడు. ఒక సినిమా విషయంలో ఏదైనా తప్పు చేయడం మొదలైతే అన్నీ తప్పుగానే అవుతాయని.. ‘సవ్యసాచి’ విషయంలో అదే జరిగిందని.. బేసిక్ ఐడియా, మాధవన్ పాత్ర.. ఇలా అన్నీ తేడా కొట్టాయని చందు తెలిపాడు. తన కెరీర్లో ఓవర్ బడ్జెట్ అయిన సినిమా కూడా అదే అని.. అందుకు తనతో సహా అందరూ కారణమే అని తెలిపాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి మంచి పెద్ద బేనర్ అండ ఉన్నా, తనకు కావాల్సిందల్లా సమకూర్చినా మంచి సినిమా చేయలేకపోయానని అతను చెప్పాడు.
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…
క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027…
మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ…
తెలుగులో మరే హీరోకూ లేని విచిత్రమైన ‘అయ్యగారు’ అనే బిరుదును అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడంటే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన…
వచ్చే వారం జూలై 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద క్రమంగా పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీమ్…