‘కార్తికేయ’ సినిమాతో ఇటు ఇండస్ట్రీ జనాలను, అటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దర్శకుడు చందు మొండేటి. అతడి నుంచి మున్ముందు ఎగ్జైటింగ్ సినిమాలు చూడొచ్చన్న ఆశ అందరిలోనూ కలిగింది. ఐతే రెండో సినిమాగా అనుకోకుండా రీమేక్ అయిన ‘ప్రేమమ్’ చేయాల్సి వచ్చింది. ఆ సినిమాతోనూ అతను విజయం అందుకున్నాడు. దీని తర్వాత నాగచైతన్య హీరోగా అతను తీసిన ‘సవ్యసాచి’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలమైంది. ఈ ఫెయిల్యూర్ మీద చందు ఎక్కడా పెద్దగా స్పందించింది లేదు. ఆ సినిమా తర్వాత అతను మీడియా దృష్టిలో కూడా పడలేదు. కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత అతను ‘కార్తికేయ’ సీక్వెల్ మీద దృష్టిసారించాడు. ఈ సినిమా కరోనా సహా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాకు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు చందు.
ఇందులో ‘సవ్యసాచి’ ఫెయిల్యూర్ గురించి అతను మాట్లాడాడు. ఈ సినిమా విషయంలో తాను కన్ఫ్యూజ్ అయినట్లు చందు తెలిపాడు. ఒక కన్విక్షన్తో ఆ సినిమా చేయలేదని, ఏం చేస్తున్నాననే విషయంలో తనకు తాను కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల సినిమా తేడా కొట్టిందని అతను చెప్పాడు. ఈ సినిమా విడుదలకు ఐదు రోజుల ముందే తనకు రిజల్ట్ తెలిసిపోయిందని కూడా అతను వెల్లడించాడు.
సినిమా చూసుకుంటే తనకే నచ్చలేదని, ఒకవేళ ఇది సక్సెస్ అయినా దాని క్రెడిట్ మనం తీసుకోకూడదు అని తన అసిస్టెంట్లతో అన్నట్లు చందు వెల్లడించాడు. ఒక సినిమా విషయంలో ఏదైనా తప్పు చేయడం మొదలైతే అన్నీ తప్పుగానే అవుతాయని.. ‘సవ్యసాచి’ విషయంలో అదే జరిగిందని.. బేసిక్ ఐడియా, మాధవన్ పాత్ర.. ఇలా అన్నీ తేడా కొట్టాయని చందు తెలిపాడు. తన కెరీర్లో ఓవర్ బడ్జెట్ అయిన సినిమా కూడా అదే అని.. అందుకు తనతో సహా అందరూ కారణమే అని తెలిపాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి మంచి పెద్ద బేనర్ అండ ఉన్నా, తనకు కావాల్సిందల్లా సమకూర్చినా మంచి సినిమా చేయలేకపోయానని అతను చెప్పాడు.
This post was last modified on August 5, 2022 8:43 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…