విజయేంద్ర ప్రసాద్ అంటే.. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. తన కొడుకు రాజమౌళి దర్శకత్వంలో ఆయన కథలతో తెరకెక్కిన మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. ఇంకా కొడుకు కోసం ఆయన అందించిన వేరే కథలు కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. ‘బాహుబలి’తో వచ్చిన పేరుతో ఆయన బాలీవుడ్లో భజరంగి భాయిజాన్, మణికర్ణిక లాంటి భారీ సినిమాలకు కథ అందించగా అవి కూడా మంచి ఫలితాన్నందుకున్నాయి.
దీంతో ఆయనకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. హిందీలో ఆయన మరికొన్ని భారీ చిత్రాల కోసం పని చేస్తున్నట్లు ఇంతకుముందు సంకేతాలు ఇచ్చాడు. వాటి సంగతి ఇంకా ఏమీ తేలకుండానే ఇప్పుడు ఆయన రచనతో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే ఇది రాజమౌళి తీసే సినిమా కాదు. ఒక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్.. ఒక తెలుగు దర్శకుడితోనే ఈ చిత్రం తెరకెక్కిస్తుందని అంటున్నారు.
ఐతే ఆ సినిమా కథ గురించి అయితే సమాచారం బయటికి వచ్చింది. ‘1770-ఏక్ సంగ్రామ్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందట. బెంగాలీలో వచ్చిన ‘ఆనంద మఠం’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. బ్రిటిష్ పాలనలో 1770 లో జరిగిన ఒక సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో ఈ నవల ఉంటుంది. 1771వ సంవత్సరంలో బెంగాల్లో సంభవించిన మహా కరువు, సన్యాసుల తిరుగుబాటు.. తదితర అంశాల ప్రస్తావన ఇందులో ఉంటుంది.
ప్రఖ్యాత బెంగాలీ రచయిత బకించంద్ర చటర్జీ ఈ నవలను రాశారు. బెంగాలీ నుంచి ఇది హిందీ సహా పలు భాషల్లోకి అనువాదం అయింది. ఈ నవలలో ఉపయోగించిన ‘వందేమాతరం’ గీతాన్నే 1896 కాంగ్రెస్ మహాసభల సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారట. తర్వాతే వందేమాతర గీతం ప్రసిద్ధికెక్కింది. చరిత్ర మీద ప్రస్తుత రచయితల్లో విజయేంద్రకు ఉన్నంత పట్టు ఇంకెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇలాంటి భారీ చిత్రానికి ఆయన అందిస్తే దానికి వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుంది. ఆగస్టు 15న ఈ సినిమా గురించి ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.
This post was last modified on August 4, 2022 10:38 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…