ఈ రోజుల్లో ఒక కొత్త సినిమా రిలీజవుతోందంటే.. షో పడకముందే నెగెటివ్ ప్రాపగండా మొదలైపోతుంది. అదే పనిగా సినిమాను డీగ్రేడ్ చేసే పోస్టులు పెడుతూ నెగెటివిటీని స్ప్రెడ్ చేసే బ్యాచ్లు సిద్ధంగా ఉంటున్నాయి. ఈ విషయంలో దాదాపుగా అందరు హీరోలూ బాధితులే అవుతున్నారు. సోషల్ మీడియాలో శ్రుతి మించుతున్న ఫ్యాన్ వార్స్ పుణ్యమా అని.. ఒక హీరో రిలీజైనపుడు అవతలి వర్గం వాళ్లు దాని గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం.. దీనికి బదులుగా అవతలి వర్గం హీరో సినిమా విడుదలైనపుడు వారి వైరి వర్గం డ్యూటీ ఎక్కడం మామూలైపోయింది.
అసలే సినిమాల పరిస్థితి ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో ఈ నెగెటివిటీ మరింతగా దెబ్బ తీస్తోంది. ఐతే టాలీవుడ్లో కొందరు హీరోలు మాత్రమే ఈ నెగెటివిటీ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. నందమూరి అభిమానులు ఫ్యాన్ వార్స్లో జోరుగా పాల్గొంటూ ఉంటారు కాబట్టి ఆ కుటుంబానికి చెందిన బాలయ్య, ఎన్టీఆర్ సినిమాలు రిలీజైనపుడు వైరి వర్గాలు నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తాయి కానీ.. కళ్యాణ్ రామ్కు మాత్రం ఆ బెడదలేదు.
కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కూడా చాలా అణకువతో వ్యవహరిస్తాడు. మిడిసి పడడు. ఎవరి గురించీ నోరు జారడు. ఇక అన్నింటికీ మించి సినిమాల కోసం అతను పడే కష్టం, తపన తన పట్ల ఒక సానుకూల భావం కలిగేలా చేస్తాయి. వీటికి తోడు ఈ నందమూరి హీరో మీద అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కొంత సానుభూతి కూడా ఉంది. ఓం, హరే రామ్ లాంటి సినిమాలు ఎంతో ప్యాషన్తో చేసిన అతను.. వాటి మీద భారీ బడ్జెట్లు పెట్టి అవి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు.
అయినా తన ప్రయత్నం మానలేదు. ఇప్పుడు ‘బింబిసార’ లాంటి సాహసోపేత సినిమా చేశాడు. కొత్తగా ఏదో ట్రై చేస్తుండడం, దీని మీదా భారీ బడ్జెట్ పెట్టడంతో ఈ సినిమా బాగా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రోమోలు బాగుండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. బేసిగ్గా కళ్యాణ్ రామ్ మీద అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉండడం వల్లేనేమో ఈ సినిమా విషయంలో ఎవ్వరూ ఎలాంటి నెగెటివ్ కామెంట్లు చేయట్లేదు. సినిమా ఎలా ఉన్నా సరే మామూలుగా వేరే సినిమాలకు చేసినట్లు దీనికి నెగెటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశాలు లేనట్లే. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా మంచి విజయం సాధించే అవకాశముంది.
This post was last modified on August 4, 2022 1:21 pm
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…