సినీ రంగంలో చిత్రమైన సెంటిమెంట్లు ఉంటాయి. మామూలుగా సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతుంటారు సినీ జనాలు. ఐతే ఈ సెంటిమెంట్లలో కొన్ని పాజిటివ్ అయితే, కొన్ని నెగెటివ్. ఐతే యువ కథానాయకుడు నిఖిల్ ఒక నెగెటివ్ విషయాన్ని పాజిటివ్ సెంటిమెంటుగా మార్చుకున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
అతడి సినిమాలు ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదా పడితే హిట్టవుతాయన్నదే ఆ సెంటిమెంట్. ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం చిత్రాల్లో ఈ సెంటిమెంట్ నిజమే అయింది. ముఖ్యంగా అర్జున్ సురవరం చాలాసార్లు వాయిదా పడి, చివరికి రిలీజయ్యాక సక్సెస్ అయింది. ఇప్పుడు నిఖిల్ కొత్త చిత్రం కార్తికేయ-2 కూడా పలుమార్లు వాయిదా పడి ఆగస్టు 13కు ఫిక్స్ అయింది. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిఖిల్కు ఈ వాయిదా సెంటిమెంట్ గురించి ప్రశ్న ఎదురైంది.
దీనికి నిఖిల్ బదులిస్తూ.. ‘‘నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో ఏ నటుడికీ ఇలా జరిగి ఉండదు. నా సినిమాకు గండం వస్తే సక్సెస్ అవుతుంది…. సెలబ్రేట్ చేసుకుంటాను అని అనుకోలేదు. అయితే నాకు కూడా ఎక్కడో ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ కూడా డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా.. అది మాకు పెద్ద హడల్. ‘అర్జున్ సురవరం’ కూడా చాలాసార్లు వాయిదా పడి చివరికి రిలీజై హిట్టయింది.
ఆ తర్వాత నేను సినిమా చేయకపోవడానికి ముఖ్య కారణం కరోనా. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ‘కార్తికేయ 2’ కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేశాను. ఒక సినిమాకు ఇంకో సినిమాకు క్లాష్ ఉండకూడదనే మా సినిమాను వాయిదా వేయించారు. ఒక రకంగా క్లాష్ లేకపోవడం మంచిదే. కానీ ప్రతిసారీ మా సినిమానే వెనక్కి వెళ్లడం నాకు బాధగా అనిపించింది. చివరికి అందరం కలిసి ఆగస్టు 13న మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అని చెప్పాడు.
This post was last modified on August 4, 2022 10:15 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…