సినీ రంగంలో చిత్రమైన సెంటిమెంట్లు ఉంటాయి. మామూలుగా సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతుంటారు సినీ జనాలు. ఐతే ఈ సెంటిమెంట్లలో కొన్ని పాజిటివ్ అయితే, కొన్ని నెగెటివ్. ఐతే యువ కథానాయకుడు నిఖిల్ ఒక నెగెటివ్ విషయాన్ని పాజిటివ్ సెంటిమెంటుగా మార్చుకున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
అతడి సినిమాలు ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదా పడితే హిట్టవుతాయన్నదే ఆ సెంటిమెంట్. ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం చిత్రాల్లో ఈ సెంటిమెంట్ నిజమే అయింది. ముఖ్యంగా అర్జున్ సురవరం చాలాసార్లు వాయిదా పడి, చివరికి రిలీజయ్యాక సక్సెస్ అయింది. ఇప్పుడు నిఖిల్ కొత్త చిత్రం కార్తికేయ-2 కూడా పలుమార్లు వాయిదా పడి ఆగస్టు 13కు ఫిక్స్ అయింది. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిఖిల్కు ఈ వాయిదా సెంటిమెంట్ గురించి ప్రశ్న ఎదురైంది.
దీనికి నిఖిల్ బదులిస్తూ.. ‘‘నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో ఏ నటుడికీ ఇలా జరిగి ఉండదు. నా సినిమాకు గండం వస్తే సక్సెస్ అవుతుంది…. సెలబ్రేట్ చేసుకుంటాను అని అనుకోలేదు. అయితే నాకు కూడా ఎక్కడో ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ కూడా డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా.. అది మాకు పెద్ద హడల్. ‘అర్జున్ సురవరం’ కూడా చాలాసార్లు వాయిదా పడి చివరికి రిలీజై హిట్టయింది.
ఆ తర్వాత నేను సినిమా చేయకపోవడానికి ముఖ్య కారణం కరోనా. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ‘కార్తికేయ 2’ కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేశాను. ఒక సినిమాకు ఇంకో సినిమాకు క్లాష్ ఉండకూడదనే మా సినిమాను వాయిదా వేయించారు. ఒక రకంగా క్లాష్ లేకపోవడం మంచిదే. కానీ ప్రతిసారీ మా సినిమానే వెనక్కి వెళ్లడం నాకు బాధగా అనిపించింది. చివరికి అందరం కలిసి ఆగస్టు 13న మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అని చెప్పాడు.
This post was last modified on August 4, 2022 10:15 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…