సినీ రంగంలో చిత్రమైన సెంటిమెంట్లు ఉంటాయి. మామూలుగా సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతుంటారు సినీ జనాలు. ఐతే ఈ సెంటిమెంట్లలో కొన్ని పాజిటివ్ అయితే, కొన్ని నెగెటివ్. ఐతే యువ కథానాయకుడు నిఖిల్ ఒక నెగెటివ్ విషయాన్ని పాజిటివ్ సెంటిమెంటుగా మార్చుకున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
అతడి సినిమాలు ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదా పడితే హిట్టవుతాయన్నదే ఆ సెంటిమెంట్. ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం చిత్రాల్లో ఈ సెంటిమెంట్ నిజమే అయింది. ముఖ్యంగా అర్జున్ సురవరం చాలాసార్లు వాయిదా పడి, చివరికి రిలీజయ్యాక సక్సెస్ అయింది. ఇప్పుడు నిఖిల్ కొత్త చిత్రం కార్తికేయ-2 కూడా పలుమార్లు వాయిదా పడి ఆగస్టు 13కు ఫిక్స్ అయింది. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిఖిల్కు ఈ వాయిదా సెంటిమెంట్ గురించి ప్రశ్న ఎదురైంది.
దీనికి నిఖిల్ బదులిస్తూ.. ‘‘నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో ఏ నటుడికీ ఇలా జరిగి ఉండదు. నా సినిమాకు గండం వస్తే సక్సెస్ అవుతుంది…. సెలబ్రేట్ చేసుకుంటాను అని అనుకోలేదు. అయితే నాకు కూడా ఎక్కడో ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ కూడా డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా.. అది మాకు పెద్ద హడల్. ‘అర్జున్ సురవరం’ కూడా చాలాసార్లు వాయిదా పడి చివరికి రిలీజై హిట్టయింది.
ఆ తర్వాత నేను సినిమా చేయకపోవడానికి ముఖ్య కారణం కరోనా. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ‘కార్తికేయ 2’ కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేశాను. ఒక సినిమాకు ఇంకో సినిమాకు క్లాష్ ఉండకూడదనే మా సినిమాను వాయిదా వేయించారు. ఒక రకంగా క్లాష్ లేకపోవడం మంచిదే. కానీ ప్రతిసారీ మా సినిమానే వెనక్కి వెళ్లడం నాకు బాధగా అనిపించింది. చివరికి అందరం కలిసి ఆగస్టు 13న మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అని చెప్పాడు.
This post was last modified on August 4, 2022 10:15 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…