ఒకే వారం రెండు ఆసక్తికర చిత్రాలు రిలీజవడం.. అవి రెండూ సమాన స్థాయిలో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడం.. థియేటర్ల వైపు ఆకర్షించడం అరుదుగా జరుగుతుంటుంది. జూన్ నెలలో మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజై రెండూ ఘనవిజయం సాధించాయి కానీ.. విడుదలకు ముందు తెలుగులో ‘విక్రమ్’ మీద మరీ అంచనాలేమీ లేవు. కానీ మౌత్ టాక్ అదిరిపోవడంతో సినిమా పెద్ద సక్సెస్ అయింది.
ఐతే ఈ వారం రాబోతున్న ‘బింబిసార’, ‘సీతారామం’ రెండూ కూడా ప్రేక్షకుల్లో ఒకే స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు సినిమాలకూ డీసెంట్ బజ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వాటి వాటి స్థాయిలో బాగానే జరుగుతున్నాయి. ఐతే ఈ రెండు చిత్రాల విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
‘బింబిసార’ ప్రధానంగా మాస్ దృష్టిని ఆకర్షిస్తుండగా.. ‘సీతారామం’ క్లాస్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. రెండూ భిన్నమైన సినిమాలు కావడం, వాటి ఆడియన్స్ కూడా వేర్వేరు కావడమే ఇలా ధైర్యంగా బాక్సాఫీస్ క్లాష్కు రెడీ అవ్వడానికి ఒక కారణం. ఆగస్టు 5కు ‘కార్తికేయ-2’ను షెడ్యూల్ చేసినపుడు ‘బింబిసార’ టీం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుక్కారణం.. జానర్ పరంగా క్లాష్ జరిగి, ప్రేక్షకులూ స్ప్లిట్ అవుతారన్న ఉద్దేశంతోనే ఆ చిత్రాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు.
ఐతే ‘సీతారామం’కు మంచి బజ్ ఉన్నప్పటికీ.. దాన్ని పెద్ద క్లాష్ లాగా భావించకపోవడానికి కారణం.. జానర్ పరంగా వైవిధ్యం, దాని ఆడియన్స్ వేరు కావడమే. రెండు సినిమాలకు మంచి టాక్ వస్తే దేని ఆడియన్స్ దానికి ఉంటారు. రెండూ బాగా ఆడతాయి. రెంటికీ టాక్ బాలేకున్నా క్లాష్ అన్నది సమస్య కాదు. అలా కాకుండా ఒక సినిమాకు బాగుండి, ఇంకో సినిమాకు టాక్ బాలేకుంటే మాత్రం జానర్ గురించి పట్టించుకోకుండా ఒక సినిమా వైపు ప్రేక్షకులు పోలరైజ్ అయ్యే ఛాన్సుంది. కాబట్టి ఈ రెండు చిత్రాలకూ టాక్ అన్నది చాలా కీలకంగా మారింది.
This post was last modified on August 3, 2022 9:51 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…