ఒకే వారం రెండు ఆసక్తికర చిత్రాలు రిలీజవడం.. అవి రెండూ సమాన స్థాయిలో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడం.. థియేటర్ల వైపు ఆకర్షించడం అరుదుగా జరుగుతుంటుంది. జూన్ నెలలో మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజై రెండూ ఘనవిజయం సాధించాయి కానీ.. విడుదలకు ముందు తెలుగులో ‘విక్రమ్’ మీద మరీ అంచనాలేమీ లేవు. కానీ మౌత్ టాక్ అదిరిపోవడంతో సినిమా పెద్ద సక్సెస్ అయింది.
ఐతే ఈ వారం రాబోతున్న ‘బింబిసార’, ‘సీతారామం’ రెండూ కూడా ప్రేక్షకుల్లో ఒకే స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు సినిమాలకూ డీసెంట్ బజ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వాటి వాటి స్థాయిలో బాగానే జరుగుతున్నాయి. ఐతే ఈ రెండు చిత్రాల విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
‘బింబిసార’ ప్రధానంగా మాస్ దృష్టిని ఆకర్షిస్తుండగా.. ‘సీతారామం’ క్లాస్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. రెండూ భిన్నమైన సినిమాలు కావడం, వాటి ఆడియన్స్ కూడా వేర్వేరు కావడమే ఇలా ధైర్యంగా బాక్సాఫీస్ క్లాష్కు రెడీ అవ్వడానికి ఒక కారణం. ఆగస్టు 5కు ‘కార్తికేయ-2’ను షెడ్యూల్ చేసినపుడు ‘బింబిసార’ టీం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుక్కారణం.. జానర్ పరంగా క్లాష్ జరిగి, ప్రేక్షకులూ స్ప్లిట్ అవుతారన్న ఉద్దేశంతోనే ఆ చిత్రాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు.
ఐతే ‘సీతారామం’కు మంచి బజ్ ఉన్నప్పటికీ.. దాన్ని పెద్ద క్లాష్ లాగా భావించకపోవడానికి కారణం.. జానర్ పరంగా వైవిధ్యం, దాని ఆడియన్స్ వేరు కావడమే. రెండు సినిమాలకు మంచి టాక్ వస్తే దేని ఆడియన్స్ దానికి ఉంటారు. రెండూ బాగా ఆడతాయి. రెంటికీ టాక్ బాలేకున్నా క్లాష్ అన్నది సమస్య కాదు. అలా కాకుండా ఒక సినిమాకు బాగుండి, ఇంకో సినిమాకు టాక్ బాలేకుంటే మాత్రం జానర్ గురించి పట్టించుకోకుండా ఒక సినిమా వైపు ప్రేక్షకులు పోలరైజ్ అయ్యే ఛాన్సుంది. కాబట్టి ఈ రెండు చిత్రాలకూ టాక్ అన్నది చాలా కీలకంగా మారింది.
This post was last modified on August 3, 2022 9:51 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…