ఒకే వారం రెండు ఆసక్తికర చిత్రాలు రిలీజవడం.. అవి రెండూ సమాన స్థాయిలో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడం.. థియేటర్ల వైపు ఆకర్షించడం అరుదుగా జరుగుతుంటుంది. జూన్ నెలలో మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజై రెండూ ఘనవిజయం సాధించాయి కానీ.. విడుదలకు ముందు తెలుగులో ‘విక్రమ్’ మీద మరీ అంచనాలేమీ లేవు. కానీ మౌత్ టాక్ అదిరిపోవడంతో సినిమా పెద్ద సక్సెస్ అయింది.
ఐతే ఈ వారం రాబోతున్న ‘బింబిసార’, ‘సీతారామం’ రెండూ కూడా ప్రేక్షకుల్లో ఒకే స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు సినిమాలకూ డీసెంట్ బజ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వాటి వాటి స్థాయిలో బాగానే జరుగుతున్నాయి. ఐతే ఈ రెండు చిత్రాల విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
‘బింబిసార’ ప్రధానంగా మాస్ దృష్టిని ఆకర్షిస్తుండగా.. ‘సీతారామం’ క్లాస్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. రెండూ భిన్నమైన సినిమాలు కావడం, వాటి ఆడియన్స్ కూడా వేర్వేరు కావడమే ఇలా ధైర్యంగా బాక్సాఫీస్ క్లాష్కు రెడీ అవ్వడానికి ఒక కారణం. ఆగస్టు 5కు ‘కార్తికేయ-2’ను షెడ్యూల్ చేసినపుడు ‘బింబిసార’ టీం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుక్కారణం.. జానర్ పరంగా క్లాష్ జరిగి, ప్రేక్షకులూ స్ప్లిట్ అవుతారన్న ఉద్దేశంతోనే ఆ చిత్రాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు.
ఐతే ‘సీతారామం’కు మంచి బజ్ ఉన్నప్పటికీ.. దాన్ని పెద్ద క్లాష్ లాగా భావించకపోవడానికి కారణం.. జానర్ పరంగా వైవిధ్యం, దాని ఆడియన్స్ వేరు కావడమే. రెండు సినిమాలకు మంచి టాక్ వస్తే దేని ఆడియన్స్ దానికి ఉంటారు. రెండూ బాగా ఆడతాయి. రెంటికీ టాక్ బాలేకున్నా క్లాష్ అన్నది సమస్య కాదు. అలా కాకుండా ఒక సినిమాకు బాగుండి, ఇంకో సినిమాకు టాక్ బాలేకుంటే మాత్రం జానర్ గురించి పట్టించుకోకుండా ఒక సినిమా వైపు ప్రేక్షకులు పోలరైజ్ అయ్యే ఛాన్సుంది. కాబట్టి ఈ రెండు చిత్రాలకూ టాక్ అన్నది చాలా కీలకంగా మారింది.
This post was last modified on August 3, 2022 9:51 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…