మాములుగా సంక్రాంతి పండక్కు మన సినిమాలు పందెం కోళ్లలా తలపడటం దశాబ్దాలుగా జరుగుతున్నదే. బొమ్మలో విషయం కొంత అటుఇటు ఉన్నా ఫెస్టివల్ పుణ్యమాని నిర్మాతలు గట్టెక్కిన సందర్భాలు ఎన్నో. అయితే ఆ సీజన్ అందరికీ దొరకదు. స్టార్ హీరోలు కర్చీఫ్ వేశాక మిగిలినవాళ్లకు ఛాన్స్ ఉండదు.
ఇప్పుడా క్రేజ్ క్రమంగా దసరాకు వచ్చేలా ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోవడంతో నాలుగైదు రోజులు సెలవులు వచ్చే ఏ నెలైనా సరే పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు విజయదశమి దానికి వేదికయ్యేలా ఉంది. ఇప్పటిదాకా దసరాను అఫీషియల్ గా లాక్ చేసుకున్నది నాగార్జున ది ఘోస్ట్ మాత్రమే. అక్టోబర్ 5 డేట్ తో ఆల్రెడీ చిన్న టీజర్ వదిలారు.
వచ్చే నెల నుంచి ప్రమోషన్లు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. షూట్ ఫైనల్ స్టేజిలో ఉంది. చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా అదే తేదీకి వదిలితే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. కానీ నాగ్ చిరుల మధ్య స్నేహం దృష్ట్యా చూస్తే ఫేస్ టు ఫేస్ క్లాష్ అవ్వడం అనుమానమే. ఒకరు సెప్టెంబర్ చివరి వారం ఎంచుకోవచ్చు. కానీ అక్కడా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కాచుకుని ఉంది.
మరోవైపు మంచు విష్ణు జిన్నాను సైతం ఆ టైంకే ఫిక్స్ చేయాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఇదేమి భయపడే కాంపిటేషన్ కాకపోయినా ఆ ధైర్యం వెనుక కారణం కంటెంటేనా లేక మరేదైనా ఉందానేది తెలియాల్సి ఉంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న అన్నీ మంచి శకునములేని కూడా దసరాకే తెస్తారట. రెండు పెద్ద సినిమాలు రెండు మీడియం చిత్రాలు వెరసి పోటీ మంచి రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది. ఇంకా రెండు నెలలు టైం ఉన్నప్పటికీ ఈ నలుగురు దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని వినికిడి
This post was last modified on August 1, 2022 6:59 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…