మాములుగా సంక్రాంతి పండక్కు మన సినిమాలు పందెం కోళ్లలా తలపడటం దశాబ్దాలుగా జరుగుతున్నదే. బొమ్మలో విషయం కొంత అటుఇటు ఉన్నా ఫెస్టివల్ పుణ్యమాని నిర్మాతలు గట్టెక్కిన సందర్భాలు ఎన్నో. అయితే ఆ సీజన్ అందరికీ దొరకదు. స్టార్ హీరోలు కర్చీఫ్ వేశాక మిగిలినవాళ్లకు ఛాన్స్ ఉండదు.
ఇప్పుడా క్రేజ్ క్రమంగా దసరాకు వచ్చేలా ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోవడంతో నాలుగైదు రోజులు సెలవులు వచ్చే ఏ నెలైనా సరే పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు విజయదశమి దానికి వేదికయ్యేలా ఉంది. ఇప్పటిదాకా దసరాను అఫీషియల్ గా లాక్ చేసుకున్నది నాగార్జున ది ఘోస్ట్ మాత్రమే. అక్టోబర్ 5 డేట్ తో ఆల్రెడీ చిన్న టీజర్ వదిలారు.
వచ్చే నెల నుంచి ప్రమోషన్లు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. షూట్ ఫైనల్ స్టేజిలో ఉంది. చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా అదే తేదీకి వదిలితే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. కానీ నాగ్ చిరుల మధ్య స్నేహం దృష్ట్యా చూస్తే ఫేస్ టు ఫేస్ క్లాష్ అవ్వడం అనుమానమే. ఒకరు సెప్టెంబర్ చివరి వారం ఎంచుకోవచ్చు. కానీ అక్కడా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కాచుకుని ఉంది.
మరోవైపు మంచు విష్ణు జిన్నాను సైతం ఆ టైంకే ఫిక్స్ చేయాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఇదేమి భయపడే కాంపిటేషన్ కాకపోయినా ఆ ధైర్యం వెనుక కారణం కంటెంటేనా లేక మరేదైనా ఉందానేది తెలియాల్సి ఉంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న అన్నీ మంచి శకునములేని కూడా దసరాకే తెస్తారట. రెండు పెద్ద సినిమాలు రెండు మీడియం చిత్రాలు వెరసి పోటీ మంచి రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది. ఇంకా రెండు నెలలు టైం ఉన్నప్పటికీ ఈ నలుగురు దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని వినికిడి
This post was last modified on August 1, 2022 6:59 pm
నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అమిగోస్, డెవిల్…
కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సారథి వచ్చారు. తమిళనాడులో జరుగుతున్న 24వ అఖిల భారత మహా సభల వేదికగా.. కొత్త…
బాలీవుడ్ ఆల్ టైం టాప్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యావరేజ్ టాక్ వస్తే చాలు.. వందల…
కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానులను చూశాం కానీ ఇప్పుడీ ట్రెండ్ కటవుట్లకూ పాకింది. తమదే రికార్డుగా…
ఏపీ రాజధాని అమరావతికి ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు.. విజయవాడకు వచ్చి.. అటు నుంచి గుంటూరు మీదుగా అమరావతికి…
ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాదికార సంస్థ(శాప్) చైర్మన్ రవినాయుడు.. వర్సెస్ వైసీపీ మాజీ మంత్రి రోజా మధ్య ఇప్పుడు రాజకీయం జోరుగా సాగుతోంది.…