వేసవి సీజన్ చివర్లో వచ్చిన ‘మేజర్’, ‘విక్రమ్’ చిత్రాల తర్వాత టాలీవుడ్కు మామూలు షాకులు తగల్లేదు. గత వారాంతంలో వచ్చిన డబ్బింగ్ మూవీ ‘విక్రాంత రోణ’ తప్పితే అన్నీ చేదు అనుభవమే మిగిల్చాయి. ‘విక్రాంత్ రోణ’ను ఒరిజినల్ నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి గత ఎనిమిది వీకెండ్లలో టాలీవుడ్కు ఏ చిత్రం కూడా సంతోషాన్నివ్వలేదన్నట్లే.
వేసవిలో భారీ వసూళ్ల తర్వాత.. ఇలాంటి డ్రై రన్ ఊహంచనిదే. ముఖ్యంగా జులై నెల ఇచ్చిన షాకులు మామూలువి కావు. రవితేజ, గోపీచంద్, నాగచైతన్య, రామ్ లాంటి స్టార్ల గాలి తీసేశాయి వాళ్ల సినిమాలు. ఈ చేదు అనుభవాల తర్వాత టాలీవుడ్ ఆశలన్నీ ఆగస్టు మీద నిలిచాయి.
ఈ నెలలో రాబోయే సినిమాలు కచ్చితంగా బాక్సాఫీస్కు మళ్లీ కళ తెస్తాయన్న ఆశలు కలుగుతున్నాయి. తొలి వారంలో రాబోతున్న సీతారామం, బింబిసార చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి. వీటికి మంచి బజ్ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ సినిమాలు హిట్టయి ఆగస్టుకు శుభారంభాన్ని అందిస్తే.. తర్వాతి వారానిిక రెండు ఆసక్తికర చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్నాయి.
అందులో నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ మాస్ దృష్టిని ఆకర్షిస్తుంటే.. నిఖిల్ మూవీ ‘కార్తికేయ-2’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్లో, థ్రిల్లర్ ప్రియుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇవి రెండు కూడా కచ్చితంగా సక్సెస్ అయ్యే సినిమాల్లాగే కనిపిస్తున్నాయి. ఇక ఆమిర్ ఖాన్ డబ్బింగ్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ చాలా మంచి కథతో తెరకెక్కిన సినిమా. ఇది హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ కాబట్టి మినిమం గ్యారెంటీ మూవీ అవుతుందన్న ఆశలున్నాయి. ఇందులో నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించడం తెలుగు మార్కెట్లో సినిమాకు ప్లస్ అవుతుందేమో చూడాలి.
ఇక ఆగస్టు నెలలో భారీ అంచనాలున్న సినిమా అంటే.. ‘లైగర్’యే. ఈ సినిమా ప్రోమోలు అటు ఇటుగా ఉన్నప్పటికీ.. హైప్ అయితే గట్టిగానే కనిపిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ డేట్ అయిన ఆగస్టు 25న మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయగలనని విజయ్ ధీమాగా ఉన్నాడు. వేసవిలో భారీ చిత్రాల సందడి ముగిశాక మళ్లీ ‘లైగర్’తోనే బాక్సాఫీస్ దగ్గర ఆ స్థాయి వేడి కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఆగస్టు సినిమాలు ట్రేడ్లో ఆశలు, అంచనాలు పెంచుతున్నాయి. మరి ఈ నెల అయినా బాక్సాఫీస్ కళకళలాడుతుందేమో చూడాలి.
This post was last modified on August 1, 2022 6:32 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…