వేసవి సీజన్ చివర్లో వచ్చిన ‘మేజర్’, ‘విక్రమ్’ చిత్రాల తర్వాత టాలీవుడ్కు మామూలు షాకులు తగల్లేదు. గత వారాంతంలో వచ్చిన డబ్బింగ్ మూవీ ‘విక్రాంత రోణ’ తప్పితే అన్నీ చేదు అనుభవమే మిగిల్చాయి. ‘విక్రాంత్ రోణ’ను ఒరిజినల్ నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి గత ఎనిమిది వీకెండ్లలో టాలీవుడ్కు ఏ చిత్రం కూడా సంతోషాన్నివ్వలేదన్నట్లే.
వేసవిలో భారీ వసూళ్ల తర్వాత.. ఇలాంటి డ్రై రన్ ఊహంచనిదే. ముఖ్యంగా జులై నెల ఇచ్చిన షాకులు మామూలువి కావు. రవితేజ, గోపీచంద్, నాగచైతన్య, రామ్ లాంటి స్టార్ల గాలి తీసేశాయి వాళ్ల సినిమాలు. ఈ చేదు అనుభవాల తర్వాత టాలీవుడ్ ఆశలన్నీ ఆగస్టు మీద నిలిచాయి.
ఈ నెలలో రాబోయే సినిమాలు కచ్చితంగా బాక్సాఫీస్కు మళ్లీ కళ తెస్తాయన్న ఆశలు కలుగుతున్నాయి. తొలి వారంలో రాబోతున్న సీతారామం, బింబిసార చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి. వీటికి మంచి బజ్ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ సినిమాలు హిట్టయి ఆగస్టుకు శుభారంభాన్ని అందిస్తే.. తర్వాతి వారానిిక రెండు ఆసక్తికర చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్నాయి.
అందులో నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ మాస్ దృష్టిని ఆకర్షిస్తుంటే.. నిఖిల్ మూవీ ‘కార్తికేయ-2’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్లో, థ్రిల్లర్ ప్రియుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇవి రెండు కూడా కచ్చితంగా సక్సెస్ అయ్యే సినిమాల్లాగే కనిపిస్తున్నాయి. ఇక ఆమిర్ ఖాన్ డబ్బింగ్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ చాలా మంచి కథతో తెరకెక్కిన సినిమా. ఇది హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ కాబట్టి మినిమం గ్యారెంటీ మూవీ అవుతుందన్న ఆశలున్నాయి. ఇందులో నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించడం తెలుగు మార్కెట్లో సినిమాకు ప్లస్ అవుతుందేమో చూడాలి.
ఇక ఆగస్టు నెలలో భారీ అంచనాలున్న సినిమా అంటే.. ‘లైగర్’యే. ఈ సినిమా ప్రోమోలు అటు ఇటుగా ఉన్నప్పటికీ.. హైప్ అయితే గట్టిగానే కనిపిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ డేట్ అయిన ఆగస్టు 25న మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయగలనని విజయ్ ధీమాగా ఉన్నాడు. వేసవిలో భారీ చిత్రాల సందడి ముగిశాక మళ్లీ ‘లైగర్’తోనే బాక్సాఫీస్ దగ్గర ఆ స్థాయి వేడి కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఆగస్టు సినిమాలు ట్రేడ్లో ఆశలు, అంచనాలు పెంచుతున్నాయి. మరి ఈ నెల అయినా బాక్సాఫీస్ కళకళలాడుతుందేమో చూడాలి.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…