టాలీవుడ్లో పెద్ద పెద్ద నిర్మాతలకు కూడా ఈ మధ్య వరుసగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నవీన్-రవిశంకర్ (మైత్రీ).. ఇలా అందరూ చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు ఈ మధ్య కాలంలో. ఐతే వీళ్లు ఒక సినిమా పోతే ఇంకో సినిమాతో నష్టాన్ని భర్తీ చేసుకోగల సామర్థ్యం ఉన్నవాళ్లే. గతంలో వాళ్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలున్నాయి.
ఈ నష్టాలను తట్టుకోలేనంత చిన్న స్థాయి కాదు వాళ్లది. కానీ ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న వాళ్లకు మాత్రం వరుసగా పరాజయాలు ఎదురైతే ఎదుర్కోవడం తేలిక కాదు. సుధాకర్ చెరుకూరి అనే మంచి నిర్మాత కొన్నేళ్ల కిందట నిర్మాణంలోకి అడుగు పెట్టి వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నాడు. ఇప్పటికే పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆయనకు తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూపంలో ఇంకా పెద్ద షాక్ తగిలింది.
ఇంతకుముందు తీసిన సినిమాల్లో కొంత విషయం ఉంది. అవి ఆ నిర్మాత అభిరుచిని చాటాయి. కానీ ‘రామారావు’ అన్ని రకాలుగా నిరాశ పరిచింది. ఇలా వరుస పరాజయాలు ఎదురైతే మనుగడ సాగించడం కష్టమవుతుంది. బేనర్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో నానితో ఆయన చేస్తున్న ‘దసరా’ పరిస్థితి ఏమవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ముందు ‘రామారావు’ బయ్యర్లకు సెటిల్ చేయాల్సి ఉంటుంది. నష్టాలు మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయ్యర్లు వదలకపోవచ్చు.
ఐతే తన సినిమాతో ఆర్థికంగా బాగా దెబ్బ తిన్న సుధాకర్ను రవితేజ ఆదుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయనకు ఇంకో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. తక్కువ పారితోషకం, బడ్జెట్లో సినిమా తీసి.. బయ్యర్లకు తక్కువకు ఇవ్వడం ద్వారా సెటిల్ చేయాలన్నది ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ సినిమా రిలీజ్కు ముందు పారితోషకం విషయంలో రవితేజ పేచీ పెట్టి నిర్మాతను ఇబ్బంది పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. తీరా చూస్తే.. సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతను అదుకోవడానికి రవితేజ ముందుకు వచ్చాడన్నది తాజా వార్త.
This post was last modified on August 1, 2022 4:22 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…