టాలీవుడ్లో పెద్ద పెద్ద నిర్మాతలకు కూడా ఈ మధ్య వరుసగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నవీన్-రవిశంకర్ (మైత్రీ).. ఇలా అందరూ చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు ఈ మధ్య కాలంలో. ఐతే వీళ్లు ఒక సినిమా పోతే ఇంకో సినిమాతో నష్టాన్ని భర్తీ చేసుకోగల సామర్థ్యం ఉన్నవాళ్లే. గతంలో వాళ్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలున్నాయి.
ఈ నష్టాలను తట్టుకోలేనంత చిన్న స్థాయి కాదు వాళ్లది. కానీ ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న వాళ్లకు మాత్రం వరుసగా పరాజయాలు ఎదురైతే ఎదుర్కోవడం తేలిక కాదు. సుధాకర్ చెరుకూరి అనే మంచి నిర్మాత కొన్నేళ్ల కిందట నిర్మాణంలోకి అడుగు పెట్టి వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నాడు. ఇప్పటికే పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆయనకు తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూపంలో ఇంకా పెద్ద షాక్ తగిలింది.
ఇంతకుముందు తీసిన సినిమాల్లో కొంత విషయం ఉంది. అవి ఆ నిర్మాత అభిరుచిని చాటాయి. కానీ ‘రామారావు’ అన్ని రకాలుగా నిరాశ పరిచింది. ఇలా వరుస పరాజయాలు ఎదురైతే మనుగడ సాగించడం కష్టమవుతుంది. బేనర్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో నానితో ఆయన చేస్తున్న ‘దసరా’ పరిస్థితి ఏమవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ముందు ‘రామారావు’ బయ్యర్లకు సెటిల్ చేయాల్సి ఉంటుంది. నష్టాలు మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయ్యర్లు వదలకపోవచ్చు.
ఐతే తన సినిమాతో ఆర్థికంగా బాగా దెబ్బ తిన్న సుధాకర్ను రవితేజ ఆదుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయనకు ఇంకో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. తక్కువ పారితోషకం, బడ్జెట్లో సినిమా తీసి.. బయ్యర్లకు తక్కువకు ఇవ్వడం ద్వారా సెటిల్ చేయాలన్నది ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ సినిమా రిలీజ్కు ముందు పారితోషకం విషయంలో రవితేజ పేచీ పెట్టి నిర్మాతను ఇబ్బంది పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. తీరా చూస్తే.. సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతను అదుకోవడానికి రవితేజ ముందుకు వచ్చాడన్నది తాజా వార్త.
This post was last modified on August 1, 2022 4:22 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…