టాలీవుడ్లో పెద్ద పెద్ద నిర్మాతలకు కూడా ఈ మధ్య వరుసగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నవీన్-రవిశంకర్ (మైత్రీ).. ఇలా అందరూ చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు ఈ మధ్య కాలంలో. ఐతే వీళ్లు ఒక సినిమా పోతే ఇంకో సినిమాతో నష్టాన్ని భర్తీ చేసుకోగల సామర్థ్యం ఉన్నవాళ్లే. గతంలో వాళ్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలున్నాయి.
ఈ నష్టాలను తట్టుకోలేనంత చిన్న స్థాయి కాదు వాళ్లది. కానీ ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న వాళ్లకు మాత్రం వరుసగా పరాజయాలు ఎదురైతే ఎదుర్కోవడం తేలిక కాదు. సుధాకర్ చెరుకూరి అనే మంచి నిర్మాత కొన్నేళ్ల కిందట నిర్మాణంలోకి అడుగు పెట్టి వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నాడు. ఇప్పటికే పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆయనకు తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూపంలో ఇంకా పెద్ద షాక్ తగిలింది.
ఇంతకుముందు తీసిన సినిమాల్లో కొంత విషయం ఉంది. అవి ఆ నిర్మాత అభిరుచిని చాటాయి. కానీ ‘రామారావు’ అన్ని రకాలుగా నిరాశ పరిచింది. ఇలా వరుస పరాజయాలు ఎదురైతే మనుగడ సాగించడం కష్టమవుతుంది. బేనర్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో నానితో ఆయన చేస్తున్న ‘దసరా’ పరిస్థితి ఏమవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ముందు ‘రామారావు’ బయ్యర్లకు సెటిల్ చేయాల్సి ఉంటుంది. నష్టాలు మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయ్యర్లు వదలకపోవచ్చు.
ఐతే తన సినిమాతో ఆర్థికంగా బాగా దెబ్బ తిన్న సుధాకర్ను రవితేజ ఆదుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయనకు ఇంకో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. తక్కువ పారితోషకం, బడ్జెట్లో సినిమా తీసి.. బయ్యర్లకు తక్కువకు ఇవ్వడం ద్వారా సెటిల్ చేయాలన్నది ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ సినిమా రిలీజ్కు ముందు పారితోషకం విషయంలో రవితేజ పేచీ పెట్టి నిర్మాతను ఇబ్బంది పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. తీరా చూస్తే.. సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతను అదుకోవడానికి రవితేజ ముందుకు వచ్చాడన్నది తాజా వార్త.
This post was last modified on August 1, 2022 4:22 pm
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…