ఆగస్టు 1.. టాలీవుడ్ జనాలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తేదీ. ఈ రోజు నుంచి మొత్తం షూటింగ్స్ అన్నీ ఆపేయాలని వారం కిందట తెలుగు యాక్టివ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిర్మాణ వ్యయం అసాధారణంగా పెరిగిపోవడం, అదే సమయంలో థియేటర్ రెవెన్యూ దారుణంగా పడిపోవడంతో నిర్మాత పరిస్థితి దయనీయంగా మారిన నేపథ్యంలో కొన్ని దిద్దుబాటు చర్యలు చేపడితే తప్ప ప్రొడక్షన్ కొనసాగించడం అసాధ్యం అని భావిస్తున్న గిల్డ్.. షూటింగ్స్కు విరామం ఇచ్చింది.
నిర్మాతలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్మాణ వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టి ఆ తర్వాత చిత్రీకరణలు కొనసాగంచాలని నిర్ణయించారు. ఐతే అశ్వినీదత్ సహా కొందరు నిర్మాతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దత్ అయితే తన సినిమాల షూటింగ్స్ ఆపేది లేదని తేల్చి చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ కూడా షూటింగ్స్ అందరూ ఎందుకు ఆపాలని ప్రశ్నించారు. మరి సోమవారం నుంచి తెలుగులో ఏ షూటింగ్స్ ఆగుతాయి.. ఏవి కొనసాగుతాయి అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
ఐతే గిల్డ్లో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తూ.. అందులో తీసుకునే నిర్ణయాల్లో కీలకంగా ఉంటున్న దిల్ రాజే.. షూటింగ్స్ ఆపాలన్న నిర్ణయాన్ని ఉల్లంఘిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన నిర్మాణంలో తెరకెక్కుతున్న విజయ్ సినిమా ‘వారసుడు’ షూటింగ్ను ఆపకుండా సోమవారం కూడా కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నంలో ఈ సినిమా షెడ్యూల్ కొనసాగుతోందట.
ఇది తమిళ, తెలగుు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమా అన్న సంగతి తెలిసిందే. ఐతే దీన్ని తమిళ చిత్రంగా పేర్కొంటూ, షూటింగ్ ఆపాల్సింది తెలుగు చిత్రాల వరకే కాబట్టి దీనికి ఆ షరతు వర్తించదంటూ చిత్రీకరణ కొనసాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రచారమే నిజం అయితే.. ఎంతోమంది డేట్స్తో ముడిపడ్డ షూటింగ్ షెడ్యూళ్ల విషయంలో మిగతా నిర్మాతలు వెనక్కి తగ్గగా.. గిల్డ్లో కీలకంగా ఉంటున్న దిల్ రాజే ఏదో మెలిక పెట్టి ఈ రూల్ను బ్రేక్ చేయడం ఏమిటనే ప్రశ్న తలెత్తడం ఖాయం.
This post was last modified on August 1, 2022 3:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…