ప్రస్తుతం తెలుగు చిత్ర నిర్మాతలు షూటింగులు బంద్ చేసి కొన్ని కీలక సమస్యల మీద చర్చలు జరపనున్నారు. అందులో మెయిన్ గా ఓటీటీ రిలీజ్ పై ఎక్కువ చర్చ ఉంది. రెండు వారాలకే ఓటీటీ లో కొత్త సినిమా వచ్చేయడంతో ప్రేక్షకులు థియేటర్ మొఖం చూడటం లేదు.
తాజాగా రిలీజైన కొత్త సినిమాల రెవెన్యూ మీద ఈ ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో ఉన్నపళంగా మీటింగులు పెట్టుకొని షూటింగ్ బంద్ చేసి వీటన్నిటికీ పరిష్కారం చూడాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పది వారాల వరకూ కొత్త సినిమాలు ఓటీటీ కి ఇవ్వకూడదని ఓ మాట కూడా అనుకున్నారు.
కానీ ఆగస్ట్ లో రెండు కొత్త సినిమాలు ఓటీటీ కి వచ్చేస్తున్నాయి. రామ్ ‘వారియర్’ సినిమా ఆగస్ట్ 11న హాట్ స్టార్ లో రానుందని ప్రచారం జరుగుతుంది ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఈ డేట్ దాదాపు ఫిక్స్ అంటున్నారు.
ఇక గోపీచంద్ -మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ సినిమా ఆగస్ట్ 5న ఆహాలో రాబోతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు నిర్మాత బన్నీ వాస్ మా సినిమా ఇప్పుడే ఓటీటీలో రాదని కచ్చితంగా యాబై రోజుల తర్వాతే అన్నట్టుగా కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు. తీరా చూస్తే రిజల్ట్ తేడా కొట్టడంతో ఇప్పుడు మాట తప్పాడు.
ఇక రామ్ ‘వారియర్’ కూడా యాబై రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ డేట్ ని కాస్త ముందుకు తీసుకురాబోతున్నారు. ఒక పక్క టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యుసర్ గిల్డ్ ఓటీటీ రిలీజ్ గురించి చర్చించుకుంటూ ఉండగా మరో వైపు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను ఎనౌన్స్ చేసేస్తున్నారు.
మరి ఇకపై అయినా నిర్మాతలు ఇలా మాట తప్పకుండా ఎఫ్ 3 లా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే థియేటర్స్ వ్యవస్థ కొంతలో కొంత చక్కబడుతుంది. జనాలు థియేటర్స్ కే మొగ్గు చూపుతారు. లేదంటే ఇక థియేటర్స్ మనుగడ కష్టమవుతుంది.
This post was last modified on August 1, 2022 1:11 pm
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయాలపై జనసేన పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంకా మక్కువ పోలేదని…
సాధారణంగా జనావాసాలు ఉండే నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆయా కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది…
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…