ప్రస్తుతం తెలుగు చిత్ర నిర్మాతలు షూటింగులు బంద్ చేసి కొన్ని కీలక సమస్యల మీద చర్చలు జరపనున్నారు. అందులో మెయిన్ గా ఓటీటీ రిలీజ్ పై ఎక్కువ చర్చ ఉంది. రెండు వారాలకే ఓటీటీ లో కొత్త సినిమా వచ్చేయడంతో ప్రేక్షకులు థియేటర్ మొఖం చూడటం లేదు.
తాజాగా రిలీజైన కొత్త సినిమాల రెవెన్యూ మీద ఈ ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో ఉన్నపళంగా మీటింగులు పెట్టుకొని షూటింగ్ బంద్ చేసి వీటన్నిటికీ పరిష్కారం చూడాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పది వారాల వరకూ కొత్త సినిమాలు ఓటీటీ కి ఇవ్వకూడదని ఓ మాట కూడా అనుకున్నారు.
కానీ ఆగస్ట్ లో రెండు కొత్త సినిమాలు ఓటీటీ కి వచ్చేస్తున్నాయి. రామ్ ‘వారియర్’ సినిమా ఆగస్ట్ 11న హాట్ స్టార్ లో రానుందని ప్రచారం జరుగుతుంది ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఈ డేట్ దాదాపు ఫిక్స్ అంటున్నారు.
ఇక గోపీచంద్ -మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ సినిమా ఆగస్ట్ 5న ఆహాలో రాబోతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు నిర్మాత బన్నీ వాస్ మా సినిమా ఇప్పుడే ఓటీటీలో రాదని కచ్చితంగా యాబై రోజుల తర్వాతే అన్నట్టుగా కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు. తీరా చూస్తే రిజల్ట్ తేడా కొట్టడంతో ఇప్పుడు మాట తప్పాడు.
ఇక రామ్ ‘వారియర్’ కూడా యాబై రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ డేట్ ని కాస్త ముందుకు తీసుకురాబోతున్నారు. ఒక పక్క టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యుసర్ గిల్డ్ ఓటీటీ రిలీజ్ గురించి చర్చించుకుంటూ ఉండగా మరో వైపు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను ఎనౌన్స్ చేసేస్తున్నారు.
మరి ఇకపై అయినా నిర్మాతలు ఇలా మాట తప్పకుండా ఎఫ్ 3 లా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే థియేటర్స్ వ్యవస్థ కొంతలో కొంత చక్కబడుతుంది. జనాలు థియేటర్స్ కే మొగ్గు చూపుతారు. లేదంటే ఇక థియేటర్స్ మనుగడ కష్టమవుతుంది.
This post was last modified on August 1, 2022 1:11 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…