ప్రస్తుతం తెలుగు చిత్ర నిర్మాతలు షూటింగులు బంద్ చేసి కొన్ని కీలక సమస్యల మీద చర్చలు జరపనున్నారు. అందులో మెయిన్ గా ఓటీటీ రిలీజ్ పై ఎక్కువ చర్చ ఉంది. రెండు వారాలకే ఓటీటీ లో కొత్త సినిమా వచ్చేయడంతో ప్రేక్షకులు థియేటర్ మొఖం చూడటం లేదు.
తాజాగా రిలీజైన కొత్త సినిమాల రెవెన్యూ మీద ఈ ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో ఉన్నపళంగా మీటింగులు పెట్టుకొని షూటింగ్ బంద్ చేసి వీటన్నిటికీ పరిష్కారం చూడాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పది వారాల వరకూ కొత్త సినిమాలు ఓటీటీ కి ఇవ్వకూడదని ఓ మాట కూడా అనుకున్నారు.
కానీ ఆగస్ట్ లో రెండు కొత్త సినిమాలు ఓటీటీ కి వచ్చేస్తున్నాయి. రామ్ ‘వారియర్’ సినిమా ఆగస్ట్ 11న హాట్ స్టార్ లో రానుందని ప్రచారం జరుగుతుంది ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఈ డేట్ దాదాపు ఫిక్స్ అంటున్నారు.
ఇక గోపీచంద్ -మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ సినిమా ఆగస్ట్ 5న ఆహాలో రాబోతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు నిర్మాత బన్నీ వాస్ మా సినిమా ఇప్పుడే ఓటీటీలో రాదని కచ్చితంగా యాబై రోజుల తర్వాతే అన్నట్టుగా కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు. తీరా చూస్తే రిజల్ట్ తేడా కొట్టడంతో ఇప్పుడు మాట తప్పాడు.
ఇక రామ్ ‘వారియర్’ కూడా యాబై రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ డేట్ ని కాస్త ముందుకు తీసుకురాబోతున్నారు. ఒక పక్క టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యుసర్ గిల్డ్ ఓటీటీ రిలీజ్ గురించి చర్చించుకుంటూ ఉండగా మరో వైపు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను ఎనౌన్స్ చేసేస్తున్నారు.
మరి ఇకపై అయినా నిర్మాతలు ఇలా మాట తప్పకుండా ఎఫ్ 3 లా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే థియేటర్స్ వ్యవస్థ కొంతలో కొంత చక్కబడుతుంది. జనాలు థియేటర్స్ కే మొగ్గు చూపుతారు. లేదంటే ఇక థియేటర్స్ మనుగడ కష్టమవుతుంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…