ప్రస్తుతం తెలుగు చిత్ర నిర్మాతలు షూటింగులు బంద్ చేసి కొన్ని కీలక సమస్యల మీద చర్చలు జరపనున్నారు. అందులో మెయిన్ గా ఓటీటీ రిలీజ్ పై ఎక్కువ చర్చ ఉంది. రెండు వారాలకే ఓటీటీ లో కొత్త సినిమా వచ్చేయడంతో ప్రేక్షకులు థియేటర్ మొఖం చూడటం లేదు.
తాజాగా రిలీజైన కొత్త సినిమాల రెవెన్యూ మీద ఈ ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో ఉన్నపళంగా మీటింగులు పెట్టుకొని షూటింగ్ బంద్ చేసి వీటన్నిటికీ పరిష్కారం చూడాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పది వారాల వరకూ కొత్త సినిమాలు ఓటీటీ కి ఇవ్వకూడదని ఓ మాట కూడా అనుకున్నారు.
కానీ ఆగస్ట్ లో రెండు కొత్త సినిమాలు ఓటీటీ కి వచ్చేస్తున్నాయి. రామ్ ‘వారియర్’ సినిమా ఆగస్ట్ 11న హాట్ స్టార్ లో రానుందని ప్రచారం జరుగుతుంది ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఈ డేట్ దాదాపు ఫిక్స్ అంటున్నారు.
ఇక గోపీచంద్ -మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ సినిమా ఆగస్ట్ 5న ఆహాలో రాబోతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు నిర్మాత బన్నీ వాస్ మా సినిమా ఇప్పుడే ఓటీటీలో రాదని కచ్చితంగా యాబై రోజుల తర్వాతే అన్నట్టుగా కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు. తీరా చూస్తే రిజల్ట్ తేడా కొట్టడంతో ఇప్పుడు మాట తప్పాడు.
ఇక రామ్ ‘వారియర్’ కూడా యాబై రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ డేట్ ని కాస్త ముందుకు తీసుకురాబోతున్నారు. ఒక పక్క టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యుసర్ గిల్డ్ ఓటీటీ రిలీజ్ గురించి చర్చించుకుంటూ ఉండగా మరో వైపు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను ఎనౌన్స్ చేసేస్తున్నారు.
మరి ఇకపై అయినా నిర్మాతలు ఇలా మాట తప్పకుండా ఎఫ్ 3 లా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే థియేటర్స్ వ్యవస్థ కొంతలో కొంత చక్కబడుతుంది. జనాలు థియేటర్స్ కే మొగ్గు చూపుతారు. లేదంటే ఇక థియేటర్స్ మనుగడ కష్టమవుతుంది.
This post was last modified on August 1, 2022 1:11 pm
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…