టాలీవుడ్ లో కొన్ని కథలు ముందుగా వేరే హీరోల దగ్గరికి వెళ్లి ఫైనల్ గా ఓ హీరో చేతిలో పడతాయి. అలా హీరోలు మారిన వాళ్ళు రిజక్ట్ చేసి ఇంకో హీరో దగ్గరికి వెళ్ళిన సినేమలెన్నో ఉన్నాయి. తాజాగా రామరావు ఆన్ డ్యూటీ విషయంలోనూ అదే జరిగింది.
ఈ కథతో కొన్నేళ్లుగా ట్రావెల్ చేస్తున్న దర్శకుడు శరత్ మండవ ఈ స్క్రిప్ట్ ను ముందుగా నాగార్జున కి చెప్పాడు. కామాక్షి మూవీ అధినేత , నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి ద్వారా నాగ్ ని అప్రోచ్ అయి కథ వినిపించాడు శరత్. ఈ విషయాన్ని ఇటివలే ఓ ఇంటర్వ్యూలో తనే చెప్పుకున్నాడు కూడా.
అయితే నాగార్జున అప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని , పైగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది… ఎవరైనా యంగ్ గా కనిపించే హీరో అయితే బెటర్ అని సజిస్ట్ చేశాడని తన వర్షన్ చెప్పుకున్నాడు. అయితే దీని బ్యాకెండ్ స్టోరీ ఏంటంటే నాగ్ ఈ కథను రిజెక్ట్ చేశాడట.
కేరెక్టర్ బాగుంది కానీ మాజీ ప్రేయసి కోసం తను ఓ కేసు చేధించడం లేదని సుముకంగానే చెప్పేశాడట. ఇక చేసేదేం లేక అప్పటి నుండి హీరో కోసం చూస్తూ ఫైనల్ గా ఈ కథను రవితేజ దగ్గరికి తీసుకెళ్ళి తన స్నేహితుడు సుధాకర్ రెడ్డి బేనర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడట.
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ టాక్ విని నాగార్జున తన జడ్జిమెంట్ గురించి తన శ్రేయాభిలాషుల దగ్గర మాట్లాడారని భోగట్టా. ఏదేమైనా ముందుగా నాగార్జున కి ఈ కథ చెప్పానని శరత్ చెప్పింది విన్న అక్కినేని ఫ్యాన్స్ సినిమా చూసి హమ్మయ్య మా హీరోకి ఓ డిజాస్టర్ తప్పింది అనుకుంటున్నారు.
ఏదేమైనా రామారావు ఆన్ డ్యూటీ మరీ తీసి పారేసే కథ మాత్రం కాదు. శరత్ తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా సరిగ్గా టేకాఫ్ చేయలేకపోయాడనే విమర్శలు అందుకుంటున్నాడు.
This post was last modified on August 1, 2022 9:02 am
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…