Movie News

కరోనా సోకిన టీవీ నటి.. బహు చక్కగా చెప్పింది

కరోనా సోకిందా.. ఇక అంతే సంగతులు అన్నట్లుగా ఉంటోంది జనాల మైండ్ సెట్. కానీ మనిషి ఆరోగ్యవంతుడిగా ఉండి.. ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పాటిస్తూ.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటూ.. అవసరమైన మందులు వేసుకుంటే రెండు వారాల్లో తిరిగి మామూలు మనిషి కావడం కష్టమేమీ కాదని చాలామంది విషయంలో రుజువవుతోంది.

ఈ విషయంలో జనాల్లో అవగాహన పెంచడానికి సెలబ్రెటీలు బాగాే కృషి చేస్తున్నారు. ఇటీవల ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి తాను కరోనా బారిన పడ్డప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఎలా దాన్నుంచి బయటపడ్డానో వివరించింది. ఇప్పుడు టీవీ నటి నవ్య స్వామి కూడా కరోనా బాధితురాలిగా తేలిన సంగతి తెలిసిందే. ఆమె వెంటనే ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన అభిమానుల కంగారు తగ్గిస్తూ.. జనాలకు మంచి సందేశం ఇచ్చింది.

తాను కరోనా బారిన పడ్డ మాట వాస్తవమే అన్న నవ్య.. వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు చెప్పింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆసుపత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకపోయిందని.. ఇంట్లోనే ఉంటూ వైద్యుల సలహాల మేరకు నడుచుకుంటున్నట్లు ఆమె చెప్పింది. తనతో గత కొన్ని రోజుల్లో క్లోజ్‌గా ఉన్న అందరికీ విషయం చెప్పి వాళ్లను కూడా టెస్ట్ చేయించుకోమని చెప్పినట్లు ఆమె వెల్లడించింది.

కరోనా గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారని.. వాటిని అస్సలు పట్టించుకోవద్దని.. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఫుడ్ తీసుకుంటూ, అవసరమైన మందులు వేసుకుంటూ వెళ్తే, జాగ్రత్తలు పాటిస్తే ఏమీ కాదని.. తాను అదే చేసి త్వరలోనే కోలుకుంటానని ఆమె చెప్పింది. తన గురించి ఆందోళన చెందిన వాళ్లకు ధన్యవాదాలు చెప్పిన నవ్య.. కరోనా సమయంలో నెగెటివిటీకి దూరంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యమైన విషయం అని విలువైన సూచన చేసింది.

This post was last modified on July 2, 2020 5:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

2 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

8 hours ago