Movie News

బింబిసార వేడుకలో విషాదం

తమ హీరోలను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎంతగా తపించిపోతారో మాటల్లో చెప్పడం కష్టం. యుట్యూబ్, టీవీ ఛానల్స్ లో ఎక్కడికీ కదలకుండా లైవ్ చూసే అవకాశం ఉన్నా కళ్లెదురా చూడాలనే ఆత్రంతో రిస్క్ చేసి మరీ విపరీతమైన రద్దీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లకు, సక్సెస్ మీట్లకు వస్తుంటారు. నిన్న జరిగిన బింబిసారకు సైతం జూనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని చూడాలనే యాంగ్జైటీతో వేలాది అభిమానులు హైదరాబాద్ శిల్పకళావేదికకు తరలివచ్చారు. అయితే అనుకోని విషాదం చోటు చేసుకుంది.

సాయిరామ్ అనే వీరాభిమాని నిన్న జరిగిన వేడుకకు హాజరయ్యాడు. కారణాలు బయటికి చెప్పలేదు కానీ అతను కన్నుమూసిన వార్త రాత్రే వెలుగులోకి వచ్చినప్పటికీ ఇందాక ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించాక స్పష్టత వచ్చింది. ఇతనిది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలం. భాగ్యనగరంలోనే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈవెంట్ జరగడానికి ముందే ఫిట్స్ వచ్చాయని ఆసుపత్రికి చేర్చినా ఫలితం దక్కలేదని అంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన కొంత సమయానికి ఇలా జరగడం బాధాకరం. అన్నయ్య, తండ్రిని ప్రమాదంలో కోల్పోయినప్పటి నుంచి తారక్ తన ప్రతి సినిమాలో ప్రేక్షకులకు జాగ్రత్తలు చెబుతూనే ఉంటాడు. దీనికో స్పెషల్ కార్డు కూడా వేస్తారు. నిన్న సైతం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని వాళ్లే ముఖ్యమని నొక్కి చెప్పిన వేదిక వద్దే ఒక అభిమాని కన్నుమూయడం ఫ్యాన్స్ ని కన్నీళ్లు పెట్టిస్తోంది. సాయిరామ్ కుటుంబానికి కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో సినిమా కన్నా జీవితం ముఖ్యమని మరోసారి ఈ సంఘటన చాటి చెప్పింది.

Satya

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

45 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

2 hours ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

2 hours ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

4 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

4 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago