Movie News

బింబిసార వేడుకలో విషాదం

తమ హీరోలను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఎంతగా తపించిపోతారో మాటల్లో చెప్పడం కష్టం. యుట్యూబ్, టీవీ ఛానల్స్ లో ఎక్కడికీ కదలకుండా లైవ్ చూసే అవకాశం ఉన్నా కళ్లెదురా చూడాలనే ఆత్రంతో రిస్క్ చేసి మరీ విపరీతమైన రద్దీలో ప్రీ రిలీజ్ ఈవెంట్లకు, సక్సెస్ మీట్లకు వస్తుంటారు. నిన్న జరిగిన బింబిసారకు సైతం జూనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణ్ రామ్ ని చూడాలనే యాంగ్జైటీతో వేలాది అభిమానులు హైదరాబాద్ శిల్పకళావేదికకు తరలివచ్చారు. అయితే అనుకోని విషాదం చోటు చేసుకుంది.

సాయిరామ్ అనే వీరాభిమాని నిన్న జరిగిన వేడుకకు హాజరయ్యాడు. కారణాలు బయటికి చెప్పలేదు కానీ అతను కన్నుమూసిన వార్త రాత్రే వెలుగులోకి వచ్చినప్పటికీ ఇందాక ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించాక స్పష్టత వచ్చింది. ఇతనిది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలం. భాగ్యనగరంలోనే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈవెంట్ జరగడానికి ముందే ఫిట్స్ వచ్చాయని ఆసుపత్రికి చేర్చినా ఫలితం దక్కలేదని అంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

జాగ్రత్తగా ఇంటికి వెళ్లండని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన కొంత సమయానికి ఇలా జరగడం బాధాకరం. అన్నయ్య, తండ్రిని ప్రమాదంలో కోల్పోయినప్పటి నుంచి తారక్ తన ప్రతి సినిమాలో ప్రేక్షకులకు జాగ్రత్తలు చెబుతూనే ఉంటాడు. దీనికో స్పెషల్ కార్డు కూడా వేస్తారు. నిన్న సైతం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని వాళ్లే ముఖ్యమని నొక్కి చెప్పిన వేదిక వద్దే ఒక అభిమాని కన్నుమూయడం ఫ్యాన్స్ ని కన్నీళ్లు పెట్టిస్తోంది. సాయిరామ్ కుటుంబానికి కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో సినిమా కన్నా జీవితం ముఖ్యమని మరోసారి ఈ సంఘటన చాటి చెప్పింది.

This post was last modified on July 30, 2022 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago