టాలీవుడ్ లో చాలా మంది నటులు అరువు గొంతుతో కాలం వెల్లగొడుతుంటారు. అందులో హీరో వేణు ఒకరు. ‘స్వయంవరం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడికి మొదటి సినిమాకు వాయుపుత్ర నాగార్జున అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతు ఇచ్చాడు. ఆ సినిమాలో వేణుకి ఆ వాయిస్ యాప్ట్ అయింది. దాంతో ఆ వెంటనే అన్ని సినిమాలకు నాగార్జుననే వేణుకి డబ్బింగ్ చెప్పాడు. ముఖ్యంగా ‘చిరు నవ్వుతో’ సినిమాలో నాగార్జున వాయిస్ కాకుండా వేణు వాయిస్ ఉంటే డైలాగ్స్ ఆ రేంజ్ లో క్లిక్ అయ్యేవి కావు. ఇది వేణు కూడా ఒప్పుకోవాల్సిందే. ఇలా కొన్నేళ్లుగా తనకి పర్ఫెక్ట్ వాయిస్ అనిపించుకున్న నాగార్జున గొంతు కాకుండా ఈసారి వేణు తన సొంత డబ్బింగ్ ట్రై చేశాడు.
రామారావు ఆన్ డ్యూటీ తో వేణు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మురళి అనే పోలీస్ కేరెక్టర్ చేశాడు వేణు. సినిమాలో మంచి రోలె చేశాడు. ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంటాడు. పైగా ఎక్కువ డైలాగులు ఉన్నాయి. అదీ చిత్తూరు స్లాంగ్ లో. ఇక్కడే వేణు పప్పులో కాలేశాడు. కొన్నేళ్లుగా వేణు కి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ ఇస్తాడని ఎవరికీ తెలియదు. కానీ రామారావు లో వేణు డైలాగులు విని అందరికీ అర్థమైపోయింది. పాత్ర అంతో ఇంతో బాగున్నప్పటికీ వేణు సొంత డబ్బింగ్ మాత్రం తేడా కొట్టేసింది.
అప్పట్లో డా.రాజశేఖర్ కూడా సాయి కుమార్ ని కొన్ని సినిమాలకు పక్కన పెట్టేసి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించుకున్నాడు. కానీ వాయిస్ యాప్ట్ కానందున మళ్ళీ సాయి కుమార్ ని లైన్లో పెట్టేసి ప్రస్తుతం ఆయనతోనే డబ్బింగ్ చెప్పించుకుంటున్నాడు. మరి వేణు కూడా తన సొంత డబ్బింగ్ గురించి ఫీడ్ బ్యాక్ తెసుకొని మళ్ళీ వాయుపుత్ర నాగార్జునని తెచ్చుకుంటే బెటర్. లేదంటే ఇన్నేళ్ళు వేణు సినిమాలు చూసిన ప్రేక్షకులు సొంత గొంతుతో వేరే యాక్టర్ ని చూసినట్టు చూస్తారు.
This post was last modified on July 30, 2022 10:50 am
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…