టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసిన సక్సెస్ ఫుల్ మూవీస్ ఎన్నో. ఇప్పుడంటే ఆయన తీసిన సినిమాలు ఆడటం లేదు కానీ ఒకప్పుడు జడ్జిమెంట్ ఉన్న నిర్మాతగా వరుస సక్సెస్ లు అందుకున్నారు రాజు. ఆయన తీసిన బెస్ట్ ఫ్యామిలీ మూవీస్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ ఒకటి. ఆ సినిమాతో చిన్నోడు పెద్దోడు అంటూ మహేష్ , వెంకటేష్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఆ సినిమా వెనుక చాలా సంగతి ఉంది. ఆ సినిమా బిహైండ్ స్టోరీ ఇటివలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు దిల్ రాజు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కథ ముందుగా వెంకటేష్ కి చెప్పి ఆ తర్వాత మహేష్ ని లాక్ చేసుకున్నారట. అలాగే షూటింగ్ డిలే అవుతూ వచ్చిన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయమని మహేష్ సజిస్ట్ చేశాడని దిల్ రాజు చెప్పుకున్నాడు. ఇక రిలీజ్ కి మూడు రోజుల ముందే షో వేసుకొని ఒక్కడే చూశాడట దిల్ రాజు.
ఆ కాన్ఫిడెంట్ తో సినిమా హిట్ అవ్వనుందని గట్టిగా నమ్మారట. అయితే ముందు రోజు చారిటీ కోసం స్పెషల్ షో వేస్తే అందులో కూర్చొని సినిమా చూసిన ప్రముఖ నిర్మాత నల్లమలపు బుజ్జి నేరుగా దిల్ రాజు ఆఫీస్ కి వచ్చేసాడట. సరిగ్గా అదే టైంలో దిల్ రాజు ఆఫీసులో ఇంకం ట్యాక్స్ రైడ్ జరుగుతుంటే వారితో సిరీయస్ గా మాట్లాడి అనంతరం సినిమా బాలేదని దిల్ రాజుకి మొఖం మీదే చెప్పేశాడట బుజ్జి.
‘బొమ్మరిల్లు’ చూసి బెస్ట్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిన నిర్మాత బుజ్జి ఈసారి సీతమ్మ వాకిట్లో గురించి అలా చెప్తుంటే దిల్ రాజు షాకయ్యాడట. ఆ సమయంలో బుజ్జితో దిల్ రాజు “చూస్తూ ఉండు సినిమా కచ్చితంగా ఆడుద్ది” అని ధీమాగా చెప్పాడట.
కానీ బుజ్జి మాత్రం ఈసారి దిల్ రాజు లెక్క తప్పనుందని సినిమా ఆడదని అనుకున్నాడట. తీరా చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించి నిర్మాతగా దిల్ రాజు కి మంచి లాభాలతో పాటు ప్రశంసలు తెచ్చిపెట్టింది.
ఏదేమైనా అప్పట్లో దిల్ రాజు జడ్జిమెంటే వేరు. ఆయన పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉండేది. సక్సెస్ కోసం ఆయన ఎన్నో రాత్రులు వర్క్ చేసే వారు. అందుకే అప్పట్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఒక సినిమా అయినా చేయాలని కోరుకునే వారు స్టార్ హీరోలు. కానీ ఇప్పుడు దిల్ రాజు లెక్క తప్పుతుంది. వరుసగా అపజయాలు అందుకుంటూ జడ్జిమెంట్ పోయిందనే కామెంట్స్ అందుకుంటున్నారు. రాబోయే సినిమాలతో అయినా దిల్ రాజు ఐయాం బ్యాక్ అనిపించుకొని బిగ్గెస్ట్ హిట్ కొడితే బాగుండని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
This post was last modified on July 28, 2022 10:34 pm
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…