దిల్ రాజు చాలా మంది దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఇప్పుడున్న టాప్ దర్శకుల్లో ఎక్కువ మంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఓనమాలు దిద్దుకున్నవాళ్ళే. ముఖ్యంగా సుకుమార్ ని ‘ఆర్య’తో బోయపాటి శ్రీను ని ‘భద్ర’ డైరెక్టర్స్ గా లాంచ్ చేసి ఇండస్ట్రీకి మంచి దర్శకులను ఇచ్చారు. అయితే దిల్ రాజు లాంచ్ చేసిన దర్శకులంతా అదే బేనర్ లో రెండో సినిమా చేశారు కానీ ఆ లిస్టులో సుక్కు , బోయపాటి మాత్రం లేరు. వీరిద్దరితో రెండో సినిమా చేయలేదు దిల్ రాజు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ , బోయపాటి లతో ఎందుకు రెండో సినిమా చేయలేదు అనే ప్రశ్న దిల్ రాజు కి ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ సుకుమార్ , బోయపాటి అలాగే వినాయక్ లతో రెండో సినిమా చేయలేకపోయాను. ఆ టైంలో నేను కొత్త దర్శకులతో సినిమాలు ప్లాన్ చేసుకోవడం అలాగే వాళ్ళు కూడా డైరెక్టర్స్ గా బిజీగా ఉండటం వల్ల ఎందుకో కుదరలేదు. అయితే సుకుమార్ తో ఐదేళ్ళుగా ఓ సినిమా అనుకుంటున్నా కానీ సెట్ అవ్వలేదు. త్వరలోనే సుకుమార్ , బోయపాటి శ్రీను లతో సినిమాలు చేయబోతున్నా అంటూ చెప్పుకున్నారు.
దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’ కి సుకుమార్ ఒక నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో కూడా సినిమా ఉండనుంది. దీనికి సంబంధించి ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని రాజు తెలిపారు. మరి ఆర్య తర్వాత ఇన్నేళ్ళకి కలుస్తున్న ఈ ఇద్దరూ ఎలాంటి కథతో సినిమా చేస్తారో వెయిట్ అండ్ సీ.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…