దిల్ రాజు చాలా మంది దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఇప్పుడున్న టాప్ దర్శకుల్లో ఎక్కువ మంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఓనమాలు దిద్దుకున్నవాళ్ళే. ముఖ్యంగా సుకుమార్ ని ‘ఆర్య’తో బోయపాటి శ్రీను ని ‘భద్ర’ డైరెక్టర్స్ గా లాంచ్ చేసి ఇండస్ట్రీకి మంచి దర్శకులను ఇచ్చారు. అయితే దిల్ రాజు లాంచ్ చేసిన దర్శకులంతా అదే బేనర్ లో రెండో సినిమా చేశారు కానీ ఆ లిస్టులో సుక్కు , బోయపాటి మాత్రం లేరు. వీరిద్దరితో రెండో సినిమా చేయలేదు దిల్ రాజు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ , బోయపాటి లతో ఎందుకు రెండో సినిమా చేయలేదు అనే ప్రశ్న దిల్ రాజు కి ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ సుకుమార్ , బోయపాటి అలాగే వినాయక్ లతో రెండో సినిమా చేయలేకపోయాను. ఆ టైంలో నేను కొత్త దర్శకులతో సినిమాలు ప్లాన్ చేసుకోవడం అలాగే వాళ్ళు కూడా డైరెక్టర్స్ గా బిజీగా ఉండటం వల్ల ఎందుకో కుదరలేదు. అయితే సుకుమార్ తో ఐదేళ్ళుగా ఓ సినిమా అనుకుంటున్నా కానీ సెట్ అవ్వలేదు. త్వరలోనే సుకుమార్ , బోయపాటి శ్రీను లతో సినిమాలు చేయబోతున్నా అంటూ చెప్పుకున్నారు.
దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’ కి సుకుమార్ ఒక నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో కూడా సినిమా ఉండనుంది. దీనికి సంబంధించి ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని రాజు తెలిపారు. మరి ఆర్య తర్వాత ఇన్నేళ్ళకి కలుస్తున్న ఈ ఇద్దరూ ఎలాంటి కథతో సినిమా చేస్తారో వెయిట్ అండ్ సీ.
This post was last modified on July 28, 2022 11:43 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…