దిల్ రాజు చాలా మంది దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఇప్పుడున్న టాప్ దర్శకుల్లో ఎక్కువ మంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఓనమాలు దిద్దుకున్నవాళ్ళే. ముఖ్యంగా సుకుమార్ ని ‘ఆర్య’తో బోయపాటి శ్రీను ని ‘భద్ర’ డైరెక్టర్స్ గా లాంచ్ చేసి ఇండస్ట్రీకి మంచి దర్శకులను ఇచ్చారు. అయితే దిల్ రాజు లాంచ్ చేసిన దర్శకులంతా అదే బేనర్ లో రెండో సినిమా చేశారు కానీ ఆ లిస్టులో సుక్కు , బోయపాటి మాత్రం లేరు. వీరిద్దరితో రెండో సినిమా చేయలేదు దిల్ రాజు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ , బోయపాటి లతో ఎందుకు రెండో సినిమా చేయలేదు అనే ప్రశ్న దిల్ రాజు కి ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ సుకుమార్ , బోయపాటి అలాగే వినాయక్ లతో రెండో సినిమా చేయలేకపోయాను. ఆ టైంలో నేను కొత్త దర్శకులతో సినిమాలు ప్లాన్ చేసుకోవడం అలాగే వాళ్ళు కూడా డైరెక్టర్స్ గా బిజీగా ఉండటం వల్ల ఎందుకో కుదరలేదు. అయితే సుకుమార్ తో ఐదేళ్ళుగా ఓ సినిమా అనుకుంటున్నా కానీ సెట్ అవ్వలేదు. త్వరలోనే సుకుమార్ , బోయపాటి శ్రీను లతో సినిమాలు చేయబోతున్నా అంటూ చెప్పుకున్నారు.
దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’ కి సుకుమార్ ఒక నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో కూడా సినిమా ఉండనుంది. దీనికి సంబంధించి ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని రాజు తెలిపారు. మరి ఆర్య తర్వాత ఇన్నేళ్ళకి కలుస్తున్న ఈ ఇద్దరూ ఎలాంటి కథతో సినిమా చేస్తారో వెయిట్ అండ్ సీ.
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…