దిల్ రాజు చాలా మంది దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఇప్పుడున్న టాప్ దర్శకుల్లో ఎక్కువ మంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో ఓనమాలు దిద్దుకున్నవాళ్ళే. ముఖ్యంగా సుకుమార్ ని ‘ఆర్య’తో బోయపాటి శ్రీను ని ‘భద్ర’ డైరెక్టర్స్ గా లాంచ్ చేసి ఇండస్ట్రీకి మంచి దర్శకులను ఇచ్చారు. అయితే దిల్ రాజు లాంచ్ చేసిన దర్శకులంతా అదే బేనర్ లో రెండో సినిమా చేశారు కానీ ఆ లిస్టులో సుక్కు , బోయపాటి మాత్రం లేరు. వీరిద్దరితో రెండో సినిమా చేయలేదు దిల్ రాజు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ , బోయపాటి లతో ఎందుకు రెండో సినిమా చేయలేదు అనే ప్రశ్న దిల్ రాజు కి ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ సుకుమార్ , బోయపాటి అలాగే వినాయక్ లతో రెండో సినిమా చేయలేకపోయాను. ఆ టైంలో నేను కొత్త దర్శకులతో సినిమాలు ప్లాన్ చేసుకోవడం అలాగే వాళ్ళు కూడా డైరెక్టర్స్ గా బిజీగా ఉండటం వల్ల ఎందుకో కుదరలేదు. అయితే సుకుమార్ తో ఐదేళ్ళుగా ఓ సినిమా అనుకుంటున్నా కానీ సెట్ అవ్వలేదు. త్వరలోనే సుకుమార్ , బోయపాటి శ్రీను లతో సినిమాలు చేయబోతున్నా అంటూ చెప్పుకున్నారు.
దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’ కి సుకుమార్ ఒక నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో కూడా సినిమా ఉండనుంది. దీనికి సంబంధించి ఎనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని రాజు తెలిపారు. మరి ఆర్య తర్వాత ఇన్నేళ్ళకి కలుస్తున్న ఈ ఇద్దరూ ఎలాంటి కథతో సినిమా చేస్తారో వెయిట్ అండ్ సీ.
This post was last modified on July 28, 2022 11:43 am
గత ఏడాది మలయాళంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి…
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…