సూపర్ స్టార్లు సైతం హారర్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని నిరూపించిన సినిమా చంద్రముఖి. 2005లో వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ తలైవా అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. దీని సీక్వెల్ ని ఆయనతోనే తీయాలని దర్శకుడు పి వాసు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు.
రెండో భాగాన్ని కన్నడలో విష్ణువర్ధన్ తో హిట్ అయ్యింది కానీ తెలుగులో వెంకటేష్ తో నాగవల్లిగా రీమేక్ చేస్తే ఇక్కడ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు పూర్తిగా కొత్త కథతో చంద్రముఖి 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే
లారెన్స్ హీరోగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కిస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ ఒకరో ఇద్దరో కాదట. ఏకంగా ఐదుగురిని తీసుకున్నట్టు చెన్నై అప్ డేట్. లక్ష్మి మీనన్, మంజిమా మోహన్, మహిమా నంబియార్, సృష్టి దాంగే, సుభిక్ష కృష్ణన్ లు లారెన్స్ సరసన ఆడిపాడనున్నారు.
ఇటీవలే మైసూర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళలో చంద్రముఖి ఎవరన్నది మాత్రం సస్పెన్స్ లో పెట్టేశారు. ఫస్ట్ పార్ట్ చేసిన జ్యోతికనే తిరిగి ఇందులో కూడా అదే క్యారెక్టర్ చేస్తారనే ప్రచారం ఉంది కానీ అఫీషియల్ అప్డేట్ లేదు.
సో చంద్రముఖిలో దెయ్యాలతో పాటు పుష్కలంగా గ్లామర్ ని కూడా దట్టించబోతున్నారు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న చంద్రముఖి 2కి సుమారు వంద కోట్ల దాకా బడ్జెట్ కేటాయించినట్టు కోలీవుడ్ టాక్. ఈ మధ్య బొత్తిగా కనిపించడం తగ్గించేసిన లారెన్స్ డిసెంబర్ లో రుద్రుడుతో పలకరించనున్నాడు. ఆ తర్వాత వచ్చేది లకలకనే.
రజిని చేసిన పాత్రలో పరకాయ ప్రవేశం చేయబోతున్న లారెన్స్ మీద అంచనాల పరంగా చాలా ఒత్తిడి ఉంది. ఏ మాత్రం అటుఇటు అయినా కష్టం. అందుకే దర్శకుడు పి వాసు మొదటి భాగంతో సంబంధం లేకుండా డిఫరెంట్ ప్లాట్ సెట్ చేశారట
This post was last modified on July 28, 2022 10:31 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…